Tuesday, June 2, 2026
News Navigation
Tuesday, June 2, 2026
News Navigation

Breaking

Tuesday, June 2, 2026
Home Latest News ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష…

ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష…

by Prakash
CM Revanth Reddy's review with senior officials

ఎండాకాలం తాగు నీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. జలాశయాలు డెడ్ స్టోరేజీకి చేరుకున్న నేపథ్యంలో సచివాలయంలో ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రానున్నది ఎండాకాలం కాబట్టి.. నీటి అసవరాలకు అనుగుణంగా అత్యవసరం అయితే.. నీళ్ల కోసం KRMBకి లేఖ రాయాలని సూచించారు. నగరాలు, పట్టణాలు, ప‌ల్లెలు, తండాలు, కాల‌నీలు అనే తేడా లేకుండా ప్రతి ఇంటికీ తాగు నీరు అందేలా సాగు నీరు, పట్టణాభివృద్ధి, పుర‌పాల‌క‌, పంచాయ‌తీరాజ్‌, శాఖ‌ల స‌మ‌గ్ర కార్యాచ‌ర‌ణ ప్రణాళికలు రూపొందించాల‌ని సీఎం అధికారుల‌ను ఆదేశించారు. అయితే.. తాగు నీటి కోసమంటూ నాగార్జున సాగ‌ర్‌ నుంచి ఏపీ 9 TMC లకు పైగా నీరు తీసుకుపోతోందని అధికారులు సమావేశంలో వివరించారు. అంత పెద్ద మొత్తంలో తాగు నీరు ఎక్కడ వినియోగిస్తున్నార‌ని, స‌రైన గ‌ణాంకాలు తీసుకొని ఇతర అవసరాలకు నీరు తీసుకుపోకుండా చూడాల‌ని అధికారుల‌ను సీఎం ఆదేశించారు.

Advertisements

You may also like

Our Visitor

019446
Total views : 90731

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.