Tuesday, April 28, 2026
News Navigation
Tuesday, April 28, 2026
News Navigation

Breaking

Tuesday, April 28, 2026
Home Devotional పంచగంగ దేవస్థానం.. నంది నోటి నుండి నీటి ధార!

పంచగంగ దేవస్థానం.. నంది నోటి నుండి నీటి ధార!

by Satya
stream of water from Nandi's mouth

దీన్ని కృష్ణాబాయి ఆలయంగా పిలుస్తారు స్థానికులు. 17-18 శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయంలో చూడచక్కని కృష్ణుడి విగ్రహం కూడా ఉంటుంది. కృష్ణాబాయి ఆలయానికి కిలోమీటరు దూరంలో ప్రసిద్ధి చెందిన పంచగంగ ఆలయం దర్శనమిస్తుంది. 4500 ఏళ్ల కిందటి ఈ కృష్ణుడి గుడి లో కృష్ణ, వేణి, సావిత్రి, కొయనా, గాయత్రి నదులు సంగమిస్తాయి నమ్మకం. ఈ గుడిలోని గోముఖం నుండి వచ్చే ధార ఆ ఐదు నదులూ ప్రతిరూపమని చెబుతారు. ఇక్కడికి ఏడాది పొడవునా భక్తులు వస్తుంటారు. గోముఖం నుండి బయటకు వచ్చిన కృష్ణా నది అతివేగంగా మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఆగ్నేయ మూల నుండి నలభై ఐదు మైళ్ళ ప్రవహించి తర్వాత దక్షిణ మహారాష్ట్ర గుండా మరో పది మైళ్ళ సాగి వాణి నదిని కలుపుకుని కృష్ణవేణి నదిగా ఖ్యాతి చెందినది. తర్వాత దక్షిణ మహారాష్ట్రలో మరో 150 మైళ్ళు ప్రవహించిన కృష్ణనది కర్ణాటకలో కలుస్తుంది. కృష్ణ, వీణ, సావిత్రి, కోయనా, గాయత్రి ఈ ఐదు నదుల సంగమ ప్రదేశంలో నిర్మించిన ఆలయాన్ని ఇక్కడ చూడొచ్చు. ఆలయంలో గోముఖి విగ్రహం, శ్రీకృష్ణుని విగ్రహాన్ని చూడొచ్చు. ఈ ఆలయానికి ఉన్న విశిష్టత మూలంగా ఏడాది పొడవునా భక్తులు సందర్శిస్తుంటారు. ఈ ఆలయాన్ని 13వ శతాబ్దంలో దేవగిరి యాదవ్ రాజు సింఘండియో నిర్మించారు. తరువాత, 16 వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని మరాఠా చక్రవర్తి శివాజీ మార్చారు. ఈ ఆలయం శ్రీకృష్ణుడికి అంకితం చేయబడింది మరియు కృష్ణుడి అందమైన విగ్రహంతో అలంకరించబడింది. ఈ ఆలయం శ్రీకృష్ణుడికి అంకితం చేయబడింది మరియు అతని అందమైన విగ్రహాన్ని కలిగి ఉంది. ఈ ఆలయం వెనుక ఉన్న పురాణం, బ్రహ్మ, విష్ణు మరియు శివుని పై సావిత్రి శాపంతో దగ్గరి సంబంధం ఉంది. అవి ఇక్కడ కోయినా, కృష్ణ, వెన్నా నదిలోకి ప్రవహిస్తాయి. అయితే వెన్నానది కొంత దూరం ప్రవహించి కృష్ణానదిలో కలుస్తుంది. కృష్ణ, వెన్న ఈ రెండు నదులు కలిసి కృష్ణవేణి నదిలా ముందుకు ప్రవహించగా, కోయినా నది మహాబలేశ్వర్ కొండల్లో పుట్టి అందులో ఒక పాయ మహాబలేశ్వర్ వైపు వచ్చి కృష్ణా నదిలో కలుస్తుంది. మహబలేశ్వరం లోని కొండమీదున్న కృష్ణవేణి ఆలయంలో గోముఖం నుంచి వెలువడే నీటిధార సందర్శకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. ఇక కృష్ణానది జన్మించిన స్థానం ఒక కొండ మొదలు లోనే ఒక ఎత్తైన చోట కొండ అంచు ఉంది. ఇది ఇలా ఉంటె ఆలయ ప్రవేశ ద్వారానికి ఎదురుగా ఐదు తూములు లాంటి రంధ్రాలు ఉండగా, అవి ఒకదానికి ఒకటి ఆరు అడుగుల దూరంలో ఉన్నాయి. ఈ ఒక్కో రంధ్రం గుండా నీరు ఎప్పుడు వస్తూనే ఉంటుంది. అయితే ఈ ఐదు నదులు ఆలయానికి వెనుక వైపు ఉన్న కొండమీద నుండి ప్రవహిస్తూ వస్తూ, ఈ రంధ్రాల గుండా కాలువ లోకి చేరి ఒకే నదిగా ప్రవహిస్తాయి. అదే కృష్ణా నది ప్రవహిస్తుంది. దీనినే పంచగంగ అని అంటారు. అక్కడి గోముఖం నుండి జాలువారే నీటి ధారను పవిత్ర జలంగా భావించి, భక్తులు తలపై చల్లుకున్నారు. అక్కడి నుంచి కొంచెం దిగువకు వెళితే ఆలయాల కేంద్రంగా పేరుగాంచిన మహాబలేశ్వరం వస్తుంది. ఆ ప్రాంతాన్ని ‘ వై ‘ అనీ, ‘వాయి’ అనీ పిలుస్తారు. వాయిస్ దొడ్డ గణపతి మహాబలేశ్వరం తర్వాత కృష్ణమ్మ వాయి పట్టణం గుండా ప్రవహిస్తుంది. మహాభారత కాలంలో విరాట నగరంగా పిలిచిన ఈ పట్టణానికి ఆలయాల నగరంగా కూడా పేరుంది. మహాబలేశ్వర్ ఆలయం కనిపిస్తుంది. ఈ మందిరం నుంచి బయటకు రాగానే అక్కడ మనకి మహాబలేశ్వర్ ఆలయం కనిపిస్తుంది. ఇది అతి పురాతన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. గర్భగుడిలో మహాబలేశ్వర స్వామి శివలింగ విగ్రహ మూర్తి దర్శనం ఇస్తాడు. ఇలా ఎన్నో విశేషాలు ఉన్న ఈ ఆలయానికి భక్తులు ఎప్పుడు అధిక సంఖ్యలో వచ్చి పంచగంగని చూసి తరిస్తారు. ఆలయం సమీపంలో ఉన్న దుకాణాల్లో రంగురంగుల హ్యాండీక్రాఫ్ట్స్ ను కొనుగోలు చేయవచ్చు.

Advertisements

You may also like

Our Visitor

008619
Total views : 56963

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.