73
చార్ధామ్ యాత్ర ఘనంగా ప్రారంభమైంది. యమునోత్రి, గంగోత్రి ఆలయాల ద్వారాలు తెరుచుకున్నాయి. ఈ నెల 22న కేదార్నాథ్ ఆలయం, 23న ఉదయం 6.15కు బద్రీనాథ్ ఆలయాలను ఓపెన్ చేస్తారు. ఈ యాత్ర నవంబర్ వరకు కొనసాగనుంది. ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్న వారికి మాత్రమే దర్శనానికి అనుమతిస్తున్నారు. ఇక భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఈ నెల 22 నుంచి హెలికాప్టర్ సేవలు కూడా ప్రారంభం కానుండటంతో యాత్ర మరింత సులభంగా మారనుంది.





Total views : 53914