104
తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చ సందర్భంగా గందరగోళం నెలకొంది. బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్రెడ్డి వ్యాఖ్యల పట్ల మంత్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పపువ్వు సారా అంశంపై శాసనసభలో చర్చ జరిగగా… సారా పథకానికి ఇందిరమ్మ పేరు పెట్టొద్దంటూ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్ప సారాకు ఇప్ప టకీలా లేదా.. మరేదైనా పేరు పెట్టుకోవాలని ఆయన అన్నారు. దీన్ని మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి తప్పుబట్టారు. ఎమ్మెల్యే రాకేశ్రెడ్డి క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. రాకేశ్రెడ్డి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ తెలిపారు.





Total views : 77598