ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. అమరావతిలో జరుగుతున్న కీలక కేబినెట్ సమావేశానికి హాజరైన పవన్ కళ్యాణ్, అస్వస్థత కారణంగా సమావేశం మధ్యలోనే బయటకు వెళ్లిపోయారు. వెన్నునొప్పితో ఇబ్బంది పడుతున్న ఆయన నేరుగా మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయానికి వెళ్లారు. అమరావతిలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరుగుతున్న ఏపీ మంత్రివర్గ సమావేశం కొనసాగుతుండగా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్య సమస్యల కారణంగా అర్ధాంతరంగా సమావేశం నుంచి నిష్క్రమించారు. కొంతకాలంగా వెన్నునొప్పితో బాధపడుతున్న పవన్ కళ్యాణ్, కేబినెట్ సమావేశంలో అసౌకర్యంగా ఫీలైనట్లు సమాచారం. దీంతో సమావేశాన్ని మధ్యలోనే విడిచి వెళ్లిపోయారు. జనసేన కార్యకర్తలు, అభిమానులు డిప్యూటీ సీఎం ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే పవన్ పరిస్థితి నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
Tag:




Total views : 92580