కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తను రాజకీయాల్లో కింది స్థాయి నుంచి ఎమ్మెల్యే వరకు ఎదిగానని ఇప్పటి వరకు ప్రజాబలంతో ఇన్ని రోజులు రాజకీయాల్లో ఉన్నానన్నారు. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్ ఏం చేస్తాడో నాకు తెలియదు నేను మాత్రం ఎన్నికల్లో పోటీ చేస్తాను అన్నారు. నా కొడుకు కూడా ప్రజాభిమానం పొంది రాజకీయాల్లో ఎదగాలని కోరుకుంటున్నా అని తెలిపారు.
ఏపీ రాజకీయాలు
ఎన్టీఆర్ జిల్లా, తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపి రాష్ట్ర కార్యదర్శి కొత్త నాగేంద్రకుమార్ (నాగబాబు) మీడియా సమావేశం నిర్వహించారు..
ఈ సందర్భంగా నాగేంద్ర కుమార్ మాట్లాడుతూ ఇది ఆరోగ్యశ్రీ కాదు, అనారోగ్యశ్రీ అని అన్నారు. జగన్ రెడ్డి పాలనలో కార్పొరేట్ హాస్పిటల్ లో ఆరోగ్యశ్రీ పదకం పేదలకు దూరం అయ్యిందన్నారు. రూ 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ పదకం అంటూ జగన్ రెడ్డి కొత్త ప్రచారానికి తెర తీశారు. కార్పొరేట్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ లో వైద్యం చేయలేమని నెల కిందటే కార్పొరేట్ యాజమాన్యాలు ప్రభుత్వానికి చెప్పినాయి. భారతమ్మ పత్రిక సాక్షికి, కూలీ మీడియా కి ఇచ్చే యాడ్స్ డబ్బులు కార్పోరేట్ హాస్పిటల్స్ కు బిల్ చెల్లిస్తే పేద ప్రజలకు వైద్యం అన్నా అందేది అని అన్నారు. 25 లక్షలు ఉచిత వైద్యం “పేరుగొప్ప – ఊరుదిబ్బ” చందాన వుంది.
ప్రభుత్వ పాఠశాలల, కళాశాలల శానిటేషన్ వర్కర్స్ సిఐటియు యూనియన్ ఆధ్వర్యంలో విజయవాడ అలంకార్ సెంటర్ చౌక్ లో ధర్నా నిర్వహించారు.శానిటేషన్ వర్కర్స్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల, కళాశాలల శానిటేషన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయా రమాదేవి మాట్లాడుతూ వేతనాలు పెంచాలి. ప్రతి నెల 5 వ తేదిలోపు వేతనాలు చెల్లించాలి. మున్సిపల్ స్కూల్స్లో పనిచేసే శానిటై జేషన్ వర్కర్లను మున్సిపల్ శాఖలో కొనసాగించాలి. బకాయి వేతనాలు చెల్లించాలి. శానిటేషన్ పరికరాలు (గౌజులు, మాస్క్ లు, శానిటేషన్, చీపుర్లు, ఫినాయిల్ సదుపాయాలు కల్పించాలి. రాజకీయ వేధింపులు ఆపాలి. ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి. ఇఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పించాలి. ప్రమాద భీమా సౌకర్యంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పధకాలన్నింటినీ ఈ కార్మికులకు అమలు చెయ్యాలి. శానిటేషన్ కార్మికులందరినీ 4 వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలి. బాత్రూంలను ఫోటోతీసి యాప్లో అప్లోడ్ చేసే విధానాన్ని రద్దు చేయాలి.