గజ్వెల్ మండలం కొల్గూర్ గ్రామం రైతు బిడ్డ బిగ్ బాస్ లో విజయం సాధించారు. బిగ్ బాస్ సీజన్-7 విన్నర్ గా ‘రైతు బిడ్డ’ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచారు. గొడుగు సత్యనారాయణ, విజయ దంపతులకు కుమార్తె గౌతమి, కుమారుడు ప్రశాంత్, మనోహర్, వినయ్ సంతానం. తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ పిల్లలను చదివించారు. ప్రశాంత్ స్వగ్రామంలో ఆరవ తరగతి వరకు, ఏటిగడ్డ కిష్టాపూర్ లో పదవ తరగతి పూర్తి చేసి గజ్వేల్ లో ప్రైవేటు కళాశాలలో ఇంటర్ పూర్తి చేశారు. డిగ్రీ మధ్యలో ఆపి తండ్రికి వ్యవసాయ పనుల్లో అండగా నిలిచాడు. సోషల్ మీడియా వేదికగా , ఫేస్బుక్, టిక్ టాక్, ఇంస్టాగ్రామ్ లో జై జవాన్ జై కిసాన్ అంటూ అన్నదాతల కష్టాలు ప్రపంచానికి తెలియజేయడానికి వీడియోలు తీసి యూట్యూబ్ లో అప్లోడ్ చేసేవారు. రైతు బిడ్డగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. విజేతగా నిలిచిన ప్రశాంత్ కు రూ.35 లక్షల ప్రైజ్ మనీ, మారుతి బ్రీజా కార్ మరియు జాయ్ అలుకాస్ గిఫ్ట్ ఓచర్ బహుమతులుగా లభించాయి. పట్టుదలతో చేస్తే తప్పకుండా విజయం దక్కుతుంది . గత మూడు సంవత్సరాల క్రితం బిగ్ బాస్ లో ప్రయత్నించినా ఫలితం దక్కకపోవడంతో సీజన్ 7 లో కామన్ మెన్ కోటాలో ఎంట్రీ దక్కింది. బిగ్ బాస్ 7లో 20 మంది కంటెస్ లో పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచారు.
Tag:
తెలంగాణ వార్తలు
జగిత్యాలలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండు చేస్తూ వివిధ జిల్లాల నుంచి మహిళలు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. సీపీఎం ఆధ్వర్యంలో పిలుపు నివ్వగా ఆధార్ కార్డులు, దరఖాస్తులతో జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు చేరుకున్నారు.అక్కడి నుంచి భారీ ర్యాలీగా పాత బస్టాండ్, యావర్ రోడ్ మీదుగా ఆర్డీవో కార్యాలయం వరకు వెళ్లి ఆర్డీవోకు వినతి పత్రం సమర్పించారు. సీపీఐ రాష్ర్ట, జిల్లా నాయకులు హాజరు కాగా వారితో ర్యాలీలో పాల్గొన్నారు. పేదలకు ఇళ్ళ స్థలాలు ఇస్తున్నామంటే వచ్చామని, తమకు స్థలాలు ఇవ్వాలని పేదలు కోరారు.