మార్కెటింగ్ కమిటీ రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సేవ చేయాలని ఏపీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు. నెల్లూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ కోటేశ్వరరెడ్డి, మిగతా కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రైతులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్న ప్రభుత్వం తమదే అన్నారు. రానున్న రోజుల్లో ప్రతి గ్రామానికి మేలు చేస్తామన్నారు. పార్టీ అభ్యున్నతి కోసం నిత్యం శ్రమించే కార్యకర్తలను తగు రీతిలో పదవులు ఇచ్చి గౌరవిస్తామని మంత్రి కాకాని వివరించారు.
Tag:
నెల్లూరు
ఆర్టీసీ డ్రైవర్లపై దాడి కేసులో ఏడుగురు నిందితులను అరెస్టు చేసినట్లు నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి తెలిపారు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన ఆయన. ప్రధాన నిందితుడు దేవరకొండ సుధీర్ కోసం గాలిస్తున్నామన్నారు. నేరం జరిగిన వెంటనే నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని చెప్పారు. నిందితులంతా నకిలీ నోట్ల మార్పిడి ముఠాకు చెందిన వారని, ప్రజలను బెదిరించడం, మోసం చేయడం. ఈ ముఠా నైజమని తెలిపారు. మరో ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నట్లు ఆయన వివరించారు. ముఠాపై గతంలోనే పలు కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. హారన్ కొట్టారనే నెపంతో కావలి పరిధిలో ఆర్టీసీ డ్రైవర్లు బి.ఆర్.సింగ్, శ్రీనివాసరావులపై 14 మంది విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. డ్రైవర్లపై వైసీపీ మూకలు రెచ్చిపోయి విచక్షణారహితంగా కొట్టడం దారుణమని ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు.






Total views : 79763