పశ్చిమబెంగాల్లో జరిగిన తొలి దశ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్షా స్పందిస్తూ.. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని దీంతో స్పష్టమైందన్నారు. ఇక, దీదీ దిగిపోయే సమయం ఆసన్నమైందన్నారు. తొలి దశలో భాగంగా 152 సీట్లకు పోలింగ్ జరగ్గా.. అందులో 110కి పైగా స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని కేంద్ర మంత్రి ధీమా వ్యక్తం చేశారు. బెంగాల్ ప్రజలు తమ భవిష్యత్తును తొలి దశలోనే నిర్ణయించుకున్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలోని అభివృద్ధికి వారు మొగ్గు చూపారన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే.. పశ్చిమ బెంగాల్లో భయానక పాలనను అంతం చేస్తామని అమిత్షా పేర్కొన్నారు. చట్టబద్ధమైన పాలనను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. మార్పు అంటే.. చొరబాటు రహిత బెంగాల్గా మార్చడమేనన్నారు. అవినీతి, బుజ్జగింపులు, దోపిడీల నుంచి స్వేచ్ఛ, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమన్నారు. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు.
Tag: