వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డిపై కర్నూలులో కేసు నమోదైంది. మంత్రి టీజీ భరత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు పోలీసులు. మే 14న కర్నూలు కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో పాల్గొన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి..మంత్రి టీజీ భరత్పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో తన పేరు, పరువుకు భంగం కలిగేలా సిద్ధార్థరెడ్డి వ్యవహరించారని..అలాగే ప్రజలను భయాందోళనలకు గురిచేశారని పోలీసులకు కంప్లైంట్ చేశారు టీజీ భరత్. మంత్రి నుంచి అందిన ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Tag:





Total views : 81773