తెలంగాణ(Telangana) టెన్త్ ఫలితాలు(10th Results) విడుదలయ్యాయి. హైదరాబాద్లో విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరిగిన పదో తరగతి పరీక్షలకు మొత్తం 5.05 లక్షల మంది హాజరు కాగా, ఉత్తీర్ణత 91.31 శాతంగా నమోదైంది. ఇక తాజాగా విడుదలైన ఫలితాల్లో బాలికలు సత్తాచాటారు. 93.23 శాతం మంది బాలికలు ఉత్తీర్ణులయ్యారు. బాలుర ఉత్తీర్ణత 89.42 శాతం. 99.05 శాతం ఉత్తీర్ణతతో నిర్మల్ జిల్లా టాప్లో ఉంటే.. 65.10 శాతం ఉత్తీర్ణత సాధించిన వికారాబాద్ చివరి స్థానంలో నిలిచింది. కాగా పదవతరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలు కూడా అధికారులు ఖరారు చేశారు. జూన్ 3 నుంచి 13 వరకు పరీక్షలు జరుగనున్నాయి.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.రైతులు అన్నం పెట్టే దేవుళ్ళతో సమానం, వారిని ఇబ్బంది కలిగించకూడదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల మంత్రి ,జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, రెవెన్యూ అటవీ అధికారులతో సమావేశం నిర్వహించారు. సోమశిల…
- బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా సందర్శించారు. కేంద్రమంత్రితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు డీకే అరుణ, లక్ష్మణ్లు ఈ పర్యటనలో పాల్గొన్నారు.…
- యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ ప్రారంభోత్సవం.హైదరాబాద్లో ఒలింపిక్ క్రీడలు నిర్వహించాలనేది తన డ్రీమ్ అని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి అన్నారు. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ, గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్ను భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషతో కలిసి ఆయన ప్రారంభించారు.…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 201046