ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని జయరాం లాడ్జి సెంటర్ లో AP 29Z 1409 ఆర్టీసీ బస్సు నుండి ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు జారి కింద పడ్డాడు. తలకి గాయాలవడంతో, గిద్దలూరు పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది దగ్గరుండి అంబులెన్సు ఎక్కించి ఆసుపత్రి కి తరలించారు. సకాలంలో స్పందించిన గిద్దలూరు S I మహేష్ తన సిబ్బందిని పంపించి ట్రాఫిక్ అంతరాయం లేకుండా క్షత గాత్రుని అంబులెన్సు లో తరలించారు. ఒద్దులావపల్లెకు చెందిన ప్రసాద్ (38) గా గుర్తింపు. స్థానిక తిరుమల రెస్టారెంట్ లో వంట మాస్టర్ గా పని చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
Read Also..




Total views : 78286