టెక్ దిగ్గజం గూగుల్, తన సర్వీసెస్, ప్లాట్ఫారమ్స్ అందించే ఎక్స్పీరియన్స్ను మెరుగుపరిచేందుకు నిరంతరం కృషి చేస్తోంది. ప్రస్తుతం ప్రపంచంలో టాప్ పొజిషన్లో ఉన్న వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫారం యూట్యూబ్ యూజర్ ఎక్స్పీరియన్స్ని ఇంప్రూవ్ చేయడానికి కొత్త జనరేటివ్ AI ఫీచర్లను డెవలప్ చేస్తోంది. ఈ అడ్వాన్స్డ్ ఆప్షన్లను ముందుగానే ఎక్స్పీరియన్స్ చేసే అవకాశాన్ని సెలక్టెడ్ యూజర్లకు అందించింది. కొత్త ఫీచర్స్ బెనిఫిట్స్, యాక్సెస్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. కొత్త ఫీచర్లలో ఒకటి ఏంటంటే, ఎక్స్టెన్సివ్ కామెంట్ థ్రెడ్స్తో యూట్యూబ్ వీడియోల కామెంట్స్ కేటగరైజ్ చేసేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగిస్తుంది. ఈ AI-బేస్డ్ టూల్ కామెంట్స్ని థీమ్స్ లేదా టాపిక్స్గా విభజిస్తుంది. యూజర్లు ఈజీగా డిస్కషన్స్లో పాల్గొనే సదుపాయం కల్పిస్తుంది. అంతేకాకుండా, కంటెంట్ క్రియేటర్లు ఈ కామెంట్ సమ్మరీల ద్వారా ఆడియన్స్తో సులువుగా ఎంగేజ్ కావచ్చు. కంటెంట్ కోసం ఫ్రెష్ ఇన్స్పిరేషన్ కనుగొనడానికి ఉపయోగించుకోవచ్చు.
AI Features
ఇండియన్ మొబైల్ మార్కెట్లో కొరియన్ మొబైల్ దిగ్గజం శామ్సంగ్ కంపెనీ టాప్ ప్లేస్లో కొనసాగుతోంది. అయితే వచ్చే ఏడాది రానున్న గెలాక్సీ S24 సిరీస్ ఫోన్లతో రెండు పాపులర్ AI చాట్బాట్లను పరిచయం చేయాలని కంపెనీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం టెక్ ఇండస్ట్రీ మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) చుట్టూ తిరుగుతోంది. దాదాపు అన్ని రంగాలూ ఏఐ అడ్వాన్స్మెంట్ను సద్వినియోగం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. ఓపెన్ఏఐ చాట్జీపీటీ, గూగుల్ బార్డ్ చాట్బాట్లతో ఈ ట్రెండ్ మరింత ఊపందుకుంది. ఇప్పుడు మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు కూడా కస్టమర్లకు ఈ ఫీచర్లను చేరువ చేస్తున్నాయి. ఈ విషయంలో గూగుల్ ముందుండగా, శామ్సంగ్ కూడా స్మార్ట్ఫోన్లలో ఏఐని ఇంట్రడ్యూస్ చేసే ప్లాన్లో ఉంది. బడ్జెట్ ఫ్రెండ్లీ నుంచి ఫ్లాగ్షిప్ డివైజ్ల వరకూ అని సెగ్మెంట్స్లో ఈ బ్రాండ్ ఆకట్టుకుంటోంది. కానీ శామ్సంగ్ స్మార్ట్ఫోన్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)ని ఇంట్రడ్యూస్ చేయడంలో కాస్త ఆలస్యం చేసింది.
Read Also..





Total views : 78508