భార్య ఇతరులతో అక్రమ సంబంధం పెట్టుకుందని భర్త అనుమానంతో భార్య తల నరికిన సంఘటన గురువారం రాత్రి రొంపిచెర్లలో చోటు చేసుకుంది. ఎస్ఐ కృష్ణయ్య కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. రొంపిచెర్ల గ్రామపంచాయతీ, పాలెం వీది కి చెందిన వాహిదా (32) పీలేరుకు చెందిన ఖాజా కిజర్ (42) ఇరువురు 14 సంవత్సరాల క్రితం ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. భర్త ఆర్టీసీ కండక్టర్ గా పనిచేస్తుండేవాడు. అయితే మూడు సంవత్సరాల క్రితం భర్త ఉద్యోగానికి రాజీనామా చేసి ఆటో నడుపుకుంటున్నాడు. ఈ క్రమంలో భార్య ఇతరులతో అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానంతో వారం రోజులుగా భార్యాభర్తలు ఘర్షణ పడుతున్నారు. గురువారం రాత్రి 7 గంటలకు కత్తితో భార్య తల మీద నరికి వేశాడు. దీంతో పిల్లలు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి ఆమెను అతని నుండి విడిపించి పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్ల పరీక్షించి, పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారని తెలియజేశారు. రొంపిచెర్ల పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేస్తామని ఎస్సై కృష్ణయ్య తెలిపారు.
Tag:
An extramarital affair that took life
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు డివిజన్ ఎర్రంపేటలో శనివారం రాత్రి ఇద్దరు దారుణ హత్యకు గురయ్యారు. చింతూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గజేంద్రకుమార్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఉన్న శ్రీకాంత్ (38) ప్రియాంక (30) సన్నిహితంగా ఉన్న సమయంలో ఆమె భర్త దుర్గాప్రసాద్ (పండు) చూశాడు. కోపోద్రిక్తుడైన ఆయన ఇనుప రాడ్డుతో ఇద్దరిని బలంగా కొట్టాడు. శ్రీకాంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రియాంకను చింతూరు ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.






Total views : 78728