మహేశ్వరం బీజెపి పార్టీ అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్ సరూర్ నగర్ డివిజన్ లో పార్టీ నాయకుల తో కలసి విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. బీజేపీ పార్టీకి ఓటు వేసి గెలిపించలి అని ప్రజలను కోరారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని అందెల శ్రీరాములు ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకంలో కేంద్రం వాటా ఉందని అందెల శ్రీరాములు తెలిపారు. దళిత బంధు, బీసీ బంధు, గృహలక్ష్మి పథకం అంటూ అన్ని రకాలుగా తెలంగాణ ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. లోకల్ వ్యక్తిగా, మహేశ్వరం నియోజకవర్గం లో సమస్యలు తెలిసిన వ్యక్తిగా ప్రజలు ఆదరిస్తున్నారని శ్రీరాములు అన్నారు
Tag:






Total views : 78357