ప్రపంచకప్ లో లీగ్ దశలో ఆడిన 9 మ్యాచ్ ల్లోను టీమ్ ఇండియా జయకేతనం ఎగరేసింది. ప్రపంచకప్ టైటిల్ కు అడుగు దూరంలో నిలిచింది. కీలక సెమీస్ పోరులో భారత్ న్యూజిలాండ్ ను 70 పరుగుల తేడాతో మట్టికరిపించింది. దీంతో గత వరల్డ్ కప్ సెమీస్ పరాజయానికి ఇప్పడు బదులు తీర్చుకున్నట్లైంది. అయితే వరుసగా మూడోసారి ఫైనల్ చేరుదామనుకున్న కివీస్ ఆశలు ఇసారి ఫలించలేదు. 398 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 48.5 ఓవర్లలో 327 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ పరాజయంతో న్యూజిలాండ్ తన ప్రపంచకప్ ప్రయాణాన్ని ముగించింది. మహ్మద్ షమీ (7/57) వికెట్లు తీసి ఆ జట్టు పతనాన్ని శాసించాడు. షమీ దెబ్బకు కివీస్ విలవిలలాడింది. బుమ్రా, సిరాజ్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీసి భారత్ విజయంలో తమవంతు పాత్ర పోషించారు.
Tag:




Total views : 78819