పదవులు, కాంట్రాక్టుల కోసం బీజేపీ పార్టీలో చేరలేదని ప్రజా సేవే లక్ష్యంగా రాజకీయాలకు వచ్చానన్నారు మునుగోడు బిజెపి పార్టీ అభ్యర్థి చలమల్ల కృష్ణారెడ్డి. కానీ కొందరు దాన్ని జీర్ణించుకోలేక తన రాజకీయ ఎదుగుదలకు అడ్డం పడుతున్నారన్నారు. చౌటుప్పల్ మున్సిపల్ పలు వార్డుల్లో ప్రచారంలో భాగంగా ఈ విధంగా మాట్లాడారు. బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అవినీతిలో కూరుకుపోయి రెండుసార్లు ఎమ్మెల్యే అవకాశం ఇచ్చిన అసెంబ్లీలో ఏ ఒక్కరోజు కూడా మునుగోడు సమస్యలపై మాట్లాడలేదన్నారు. బిజెపి మేనిఫెస్టో వివరిస్తూ సంవత్సరానికి నాలుగు సిలిండర్లు ఉచితమని మహిళలకు పావుల వడ్డీకే రుణాలని అమ్మాయి పుట్టగానే 2 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామన్నారు. కమలం పువ్వు గుర్తుకే ఓటు వేయాలని ఓటర్లను కోరారు.
Chalamalla Krishna Reddy
ఈ ప్రాంత బిడ్డ గా నాకు ఒక్కసారి అవకాశమిస్తే ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తాననన్నారు బీజేపీ అభ్యర్థి చలమల్ల కృష్ణా రెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్గొండ జిల్లా చండూరు మండలం బోడంగిపర్తి, తాస్కాన్ గూడెం, శిరిదేపల్లి గ్రామాలలో ప్రచారం నిర్వహించారు. కోలాటాలతో ఘన స్వాగతం పలికారు మహిళలు బిజెపి శ్రేణులు. ఈ సందర్భంగా చలమల్ల కృష్ణా రెడ్డి మాట్లాడుతూ. రాజగోపాల్ రెడ్డి లాగా నేను కాంట్రాక్ట్ ల కోసం రాజకీయాలు చేయడం లేదన్నారు, ఎమ్మెల్యేగా ,ఎమ్మెల్సీగా ఉండి. ఈ ప్రాంతానికి ఆయన చేసిన అభివృద్ధిని ఏమి లేదనీ, ఆయన్ని గెలిపిస్తే మళ్ళీ మనకు దొరకడని అన్నారు. కూసుకుంట్ల ఒక అసమర్ధ ఎమ్మెల్యే అని, ఆయనకు మాట్లాడే ధైర్యం లేదని, ఆయన సేవలిక చాలని అన్నారు. మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీని ప్రజలు విస్మరించారని ఈ నెల జరిగే 30న ఎన్నికల్లో బిజెపి పార్టీ 20,000 మెజార్టీతో కషాయం జండా ఎగర పోతుందన్నారు. ఈ ప్రాంతంలో పుట్టిన వ్యక్తిగా ఈ ప్రాంత అభివృద్ధి చేయడమే తన ఏకైక లక్ష్యం అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులతో ప్రతి గ్రామంలో బీటీ రోడ్లు, పేద ప్రజలకు రేషన్ కార్డ్స్, పెన్షన్స్, ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు, ఇల్లు లేని ప్రతి ఒక్క నిరుపేదకు ఇంటి స్థలంతో పాటు ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షలు ఇప్పిస్తామన్నారు. మునుగోడు గడ్డమీద కాషాయం జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ఎన్నికలకు కొద్దిరోజులు మాత్రమే సమయం ఉండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. మునుగోడు నుంచి పోటీ చేస్తున్న బిజెపి అభ్యర్థి చలమల్ల కృష్ణారెడ్డికి మహిళలు బ్రహ్మరథం పడుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలో చలమల్ల కృష్ణారెడ్డికి ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికి… గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా చలమల్ల కృష్ణా రెడ్డి మాట్లాడుతూ… స్థానికుడినైన తనను గెలిపించాలని కోరారు. ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చానని, కాంగ్రెస్ అహంకార అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా ఉండి మునుగోడు నియోజకవర్గాన్ని ఉద్ధరించింది ఏమీ లేదని విమర్శించారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసినా ప్రభాకర్ రెడ్డి తన సొంతంగా నిధులు తెచ్చిన దాఖలాలు లేవని కృష్ణారెడ్డి ఆరోపించారు. అసెంబ్లీకి వెళ్లి నిద్రపోవడానికి తప్ప నియోజకవర్గ సమస్యలపై పోరాడింది ఏమీ లేదన్నారు. ప్రజలు తనకు ఒక్కసారి అవకాశం ఇస్తే కేంద్ర ప్రభుత్వ సహకారంతో మునుగోడును సమగ్రంగా అభివృద్ధి చేస్తానని చలమల్ల కృష్ణా రెడ్డి కోరారు.





Total views : 147521