మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మద్యంతర బెయిల్ లభించడంతో సాయంత్రం 4గంటలకు విడుదల కానున్నారు.ఈ సందర్భంగా నందిగామ తెలుగుదేశం పార్టీ ఎమ్ఎల్ఎ అభ్యర్థి తంగిరాల సౌమ్య ఆద్వర్యంలో భారీ ఎత్తున బాణసంచా కాలుస్తూ ఒకరి కొకరు స్వీట్లు తినిపించుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. మహిళలు ఆనందంతో నృత్యాలు చేశారు. దేశం పార్టీ కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సౌమ్య మాట్లాడుతూ న్యాయమే గెలిచింది. చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యం లా బయటికి వస్తారని అన్నారు. సింహం బయటకు వచ్చింది. వైసీపీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని ఆమె అన్నారు. చంద్రబాబు నాయుడు కు బెయిల్ రావడం చాలా సంతోషంగా ఉందని ముందుంది ముసళ్ళ పండుగ. వైసీపీ ప్రజలు ఓటుతోనే ప్రజలు బుద్ధి చెప్తారని తంగిరాల సౌమ్య అన్నారు.
Chandra babu
స్కిల్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఆనందం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు బెయిల్ రావడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానాన్ని తాము ముందు నుంచి తప్పుపడుతున్నామని… నోటీసులు ఇవ్వకుండా, విచారణ జరపకుండానే ఆయనను అరెస్ట్ చేశారని విమర్శించారు. ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండానే ఎలా అరెస్ట్ చేస్తారని విమర్శించారు. బాబుకు బెయిల్ రావడం మంచి పరిణామమని చెప్పారు. మరోవైపు వైసీపీ ప్రభుత్వంపై పురందేశ్వరి విమర్శలు గుప్పించారు. నాణ్యత లేని మద్యాన్ని అమ్ముతూ, ప్రజల ఆరోగ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం నాశనం చేస్తోందని మండిపడ్డారు. మద్యం అమ్మకాల ద్వారా జేబులు నింపుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని దుయ్యబట్టారు.
నిజం గెలిసింది కాబట్టే చంద్రబాబు నాలుగు వరాల పాటు మధ్యంతర బెయిల్ పై బయటకు వస్తున్నారని. జగన్ జైల్లో ఉన్నాడని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. చంద్రబాబుని కూడా జైల్లో పెట్టాలని కుట్రపన్ని జైల్లో పెట్టించారని. అరెస్ట్ చేయించి ఆధారాలు లేకుండా కాలయాపన చేశారని. తమ నాయకుడు బయటికి రావడం పై హర్షం వ్యక్తం చేస్తున్నామంటున్నా టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూతో మా కాకినాడ జిల్లా ప్రతినిధి నందిని ఫేస్ టు ఫేస్.
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిలు మంజూరు చేయడంపై రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. మిఠాయిలు పంచుకుంటూ, బాణాసంచా పేలుస్తూ కార్యకర్తలు, నాయకులు సంతోషంలో మునిగిపోయారు. రాజమండ్రి, హిందూపురం సహా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ అభిమానులు, కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి సంతోషాన్ని పంచుకుంటున్నారు. టపాసులు కాలుస్తూ హోరెత్తిస్తున్నారు. అన్నమయ్య జిల్లా టిటిడి మాజీ పాలకవర్గ సభ్యులు తెలుగుదేశం పార్టీ నాయకులు సుగువాసి ప్రసాద్ బాబు ఆధ్వర్యంలో రాయచోటి పట్టణం మాండవ్య నది ఒడ్డున వెలిసియున్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో 101 టెంకాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరైన తర్వాత వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందిస్తూ సీఎం జగన్ పై మండిపడ్డారు. జైలు నుంచి చంద్రబాబు ప్రాణాలతో బయటపడ్డారని… మరికొన్ని రోజులు జైల్లో ఉంటే ఆయన ప్రాణాలకు ఈ దుర్మార్గులు హాని కలిగించే వారని అన్నారు. కొన్ని గంటల్లో చంద్రబాబు జైలు నుంచి బయటకు రానున్నారని చెప్పారు. తనపై కూడా ఈ దుర్మార్గమైన ముఖ్యమంత్రి జగన్ 16 నుంచి 18 కేసులు పెట్టించాడని మండిపడ్డారు. తాను విడుదలైన తర్వాత తిరుమల వెంకన్నను దర్శించుకోవాలనుకున్నానని… అయితే, ఆ దేవున్ని కూడా తనకు ఈ ముఖ్యమంత్రి దూరం చేశాడని అన్నారు. చంద్రబాబు విషయంలో న్యాయమూర్తి ద్వారా వెంకటేశ్వరస్వామి న్యాయాన్ని పలికించారని రఘురాజు చెప్పారు. వెంకటేశ్వరస్వామిని చంద్రబాబు దర్శనం చేసుకుని, ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని, నూతనోత్తేజంతో మళ్లీ ప్రజల మధ్య అడుగు పెట్టాలని కోరుకుంటున్నానని అన్నారు. ఆయనను బాధ పెట్టిన అందరినీ రాజకీయంగా కడతేర్చాలని కోరుకుంటున్నానని చెప్పారు. వెంకన్న స్వామిని దర్శనం చేసుకుంటే అంతా మంచే జరుగుతుందని… తాను తిరుమల వెంకన్నను దర్శనం చేసుకోలేక అమెరికాలోని వెంకటేశ్వరస్వామి దేవాలయాన్నీ తిరిగానని అన్నారు. మన దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఉన్న వెంకన్న ఆలయాలన్నీ ఇప్పటికీ తిరుగుతూనే ఉన్నానని చెప్పారు. తాను ఏపీలోకి ఇప్పుడు అడుగు పెట్టే పరిస్థితి లేదని అన్నారు. చంద్రబాబుకు బెయిల్ వస్తుందని ముందే ఊహించే… లిక్కర్ కేసులో ఆయనపై మరో కేసు పెట్టారని మండిపడ్డారు. ఈ నాలుగు వారాల్లో చంద్రబాబును ఏ కేసులో కూడా అరెస్ట్ చేయలేరని చెప్పారు. చంద్రబాబుపై పెట్టిన ఐదు కేసులూ రెడ్లు పెట్టారని విమర్శించారు. కేసులు కట్టేది కూడా రెడ్డేనని, మధ్యలో కథ నడిపించేందరి సజ్జల రామకృష్ణారెడ్డి అని, పైనుంచి నడిపించేది జగన్ రెడ్డి అని అన్నారు. రెడ్లు తప్ప మరెవరూ లేరని… ఈ విషయాన్ని చెప్పడానికి తాను సంకోచించనని చెప్పారు.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో టీడీపీ శ్రేణులు ఆనందంలో మునిగిపోయాయి. బెయిల్ మంజూరైన వెంటనే మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయం వద్ద మీడియాతో అచ్చెన్నాయుడు మాట్లాడుతూ… చంద్రబాబు మీద వ్యక్తిగత కక్ష పెట్టుకుని, తప్పు లేకపోయినా కేసులు పెట్టారనే విషయం తెలుగు ప్రజలందరికీ తెలిసి పోయిందని అన్నారు. అక్రమ కేసులు పెట్టి, జైల్లో ఉంచి లబ్ధి పొందాలని జగన్ చూశారని విమర్శించారు. 45 ఏళ్ల రాజకీయ చరిత్రలో చంద్రబాబు చిన్న తప్పు కూడా చేయలేదని… పార్టీలో ఎవరు తప్పు చేసినా ఆయన సహించరని చెప్పారు. మహానుభావుడు చంద్రబాబును ఈ మూర్ఖుడు, ఈ దుర్మార్గుడు జగన్ 52 రోజుల పాటు జైల్లో పెట్టించారని అచ్చెన్న మండిపడ్డారు. బెయిల్ పై హైకోర్టు తీర్పును రిజర్వ్ చేస్తే… రాత్రికి రాత్రే చంద్రబాబుపై లిక్కర్ కేసు పెట్టించిన సైకో అని దుయ్యబట్టారు. చంద్రబాబు అరెస్ట్ జగన్ పతనానికి నాంది అని… బాబు జైలు నుంచి బయటకు అడుగు పెట్టిన క్షణం నుంచే వైసీపీ పతనమవుతుందని చెప్పారు. వైసీపీని బంగాళాఖాతంలో కలుపుతామని వ్యాఖ్యానించారు. హైకోర్టులో ఈరోజు తమకు న్యాయం జరిగిందని అన్నారు. ఇప్పటికే లోకేశ్ బాబు రాజమండ్రిలో ఉన్నారని… తాము కూడా ఇప్పుడు రాజమండ్రికి బయల్దేరుతున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో ఏం చేయాలనేది అందరం కూర్చొని చర్చించి నిర్ణయిస్తామని తెలిపారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వం మద్యం అనుమతుల కేసు నమోదు చేయడంపై నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కక్ష సాధింపునకు మరో రూపమే జగన్ అని మండిపడ్డారు. కక్ష సాధింపులో నువ్వు ఆంధ్రా గోల్డ్, ప్రెసిడెంట్ మెడల్ బ్రదర్ అంటూ ఘాటుగా స్పందించారు. పిచ్చికి వాడుతున్నట్టే, కక్ష సాధింపు ధోరణికి కూడా మందులు వాడాలని అన్నారు. రాష్ట్రంలో నాసిరకం మద్యం తాగి 35 లక్షల మంది రోగాల బారినపడ్డారని, 30 వేల మంది ప్రాణాలు కోల్పోయారని లోకేశ్ వెల్లడించారు. ఎవరి హయాంలో లిక్కర్ దందా జరుగుతోందో చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. మందుబాబుల తిట్లు వినే ధైర్యం జగన్ కు ఉందా? అని ప్రశ్నించారు.
తెలంగాణలో పూర్తిగా ధీనస్థితిలో ఉన్న తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్పార్టీ పదవులకు, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడికి పంపించారు. గత ఏడాది కాలంగా తెలంగాణలో టీడీపీ క్యాడర్ని, నేతల్ని సమన్వయం చేసుకుంటూ వచ్చారు కాసాని జ్ఞానేశ్వర్. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయవద్దని అధిష్టానం చెప్పడంతో కాసాని అసంతృప్తికి లోనయ్యారు. అయితే పార్టీ రాష్ట్ర నాయకత్వం పోటీ చేయాలని భావించాయి. అందుకు భిన్నంగా టీడీపీ అధిష్టానం నుంచి సంకేతాలు రావడంతో ఆయన రాజీనామా చేశారు. ప్రస్తుతం టీడీపీకి రాజీనామా చేసిన కాసాని జ్ఞానేశ్వర్ తన భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తానని వెల్లడించారు.
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మీడియాతో మాట్లాడిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ. నారా భువనేశ్వరి గారు నిజం గెలవాలని బస్సు యాత్ర చేస్తానని అంటున్నారు, నిజం గెలవాలని మీరు అనడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇది న్యాయస్థానాన్ని తప్పు పట్టేట్లుగా ఉంది. మీరు ఎంతో తెలివైన వారు ప్రజలు అమాయకులు ఏమైనా వింటారు అనేగా మీ ఉద్దేశ్యం. తన సొంత తండ్రిని వెన్నుపోటు పొడిచి చనిపోయేలా చేసిన చంద్రబాబుని ఏమి అనని భువనేశ్వరి ఈరోజు తప్పు చేసి దోషిగా జైలుకు వెళితే తాను పోరాటం చేస్తాను అనడం ఎంత దారుణం. దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు ఉంది మీరు నిజం గెలవాలని చెప్పడం. చంద్రబాబుని జైల్లో పెడితే ప్రజలు ఎవరైనా బాధపడ్డారా? చంద్రబాబు నాయుడు కరెక్ట్, ఎన్టీఆర్ గారిదే తప్పు అనేది పోనీ భువనేశ్వరి గారు చెప్పగలరా? నారా లోకేష్ కెమెరా మెన్ గంగ సినిమాలో లాగా తన తండ్రిని పక్కకు తప్పించి తాను చంద్రబాబు స్థానంలోకి రావడానికి చూస్తున్నారని నుమానం. రెండు అక్రమ పార్టీలు అక్రమ కలయిక ఈరోజు జిల్లాలో పెట్టారు. ఇక్కడ సీటు ఎవరికి ఇస్తారో తెలియక టీడీపీ జనసేన నాయకులు మదన పడిపోతున్నారు. పవన్ కళ్యాణ్ తన ఆర్థిక లాభం కోసం చంద్రబాబు కాళ్ళు పట్టుకున్నాడు. దీనికి కాపు సామాజిక వర్గం సిగ్గుపడే పరిస్థితి ఏర్పడింది. జనసేన టీడీపీ కూటమి ఎన్నికల లోపు ఎన్ని ముక్కలు అవుతుందో చూడండి.
టిడిపి జనసేన ఆత్మీయ సమ్మేళనాలు జిల్లాల వారీగా మూడు రోజులు పాటు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆత్మీయ సమ్మేళనం కాకినాడలో జరిగింది. తెలుగుదేశం పార్టీ తరపున ప్రతినిధిగా ఉన్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రెండు పార్టీలు సమన్వయంతో ముందుకు వెళ్తామని జగన్ కు తగిన బుద్ధి చెబుతామని ఈ సందర్భంగా రవీంద్ర పేర్కొన్నారు. జగన్ అనే వైరస్ కు జనసేన, టిడిపి సరైన వ్యాక్సిన్ అని చెబుతున్న రవీంద్ర తో మా ప్రతినిధి నందిని ఫేస్ టు ఫేస్.