మహిళా సాధికారత కోసం ఎల్లప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ ముందుంటుందని ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్, ఎన్టీఆర్ ట్రస్ట్ సీఈఓ రాజేంద్ర కుమార్ తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత కుట్టు మిషన్ ను కార్యక్రమాన్ని ప్రారంభించారు. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నిజం గెలవాలి కార్యక్రమం లో భాగంగా కుప్పం పర్యటనకి వచ్చినపుడు మహిళలు చాలా మంది తమకు ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం కావాలని కోరారు. ఉచిత శిక్షణ కేంద్రం కుప్పంలో ఏర్పాటు చేస్తామని నారా భువనేశ్వరి హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ ని కట్టుబడి ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించామని అన్నారు. మహిళా సాధికారత కోసం చంద్రబాబు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఎల్లప్పుడు ముందుంటారని తెలిపారు. భవిషత్తులో కూడా మరిన్ని సెంటర్లు ఏర్పాటుచేసి మరింత చేయూత అందిస్తామన్నారు. ఒక్క సెంటర్లో రోజుకి యాభై మంది మహిళలకు శిక్షణ ఇస్తామని, మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Chandra babu
నోవాటెల్ హోటల్లో చంద్రబాబు సమావేశం(chandra babu meeting at novatel)
అమరావతి, ఉదయం 10.30 కి నోవాటెల్ హోటల్ కి చంద్రబాబు. టీడీపీ – జనసేన – బీజేపీ ల ఉమ్మడి కీలక సమావేశం. పొత్తుల ఖరారు తర్వాత జరుగుతున్న మూడు పార్టీల మొదటి సమావేశం. జనసేన – బీజేపీకి 30 అసెంబ్లీ, 8 లోక్ సభ స్థానాలు కేటాయించినట్లు ఇప్పటికే చంద్రబాబు వెల్లడి. ఏ ఏ స్థానాల్లో జనసేన – బీజేపీ పోటీ చేయాలనే దానిపై సమావేశంలో చర్చ. ఆయా స్థానాల్లో అభ్యర్థులు ఎంపిక పైన కసరత్తు చేయనున్న మూడు పార్టీలు. మూడు పార్టీలు పోటీ చేసే స్థానాల పై ఈరోజు సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశం.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
కాకినాడ రూరల్ గంగనాపల్లి గ్రామంలో జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి పంతం నానాజీ ఆధ్వర్యంలో సుమారుగా 200 మంది వైసీపీ పార్టీ కు చెందిన కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. పంతం నానాజీ జనాసేన పార్టీ కండువాలు వేసి జనసేన పార్టీలో ఆహ్వానించారు. పంతం నానాజీ, తెలుగుదేశం పార్టీ నాయకులు చప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వైసిపి పార్టీ మీద ప్రజలకు నమ్మకం లేదని అన్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వలనే రాష్ట్రంలో సంక్షేమం ,సుపరిపాలన సాధ్యమని ప్రజలు గ్రహించారు అని అన్నారు. ఎన్నికల దగ్గరికి వచ్చే కొద్ది వైసీపీ ప్రభుత్వం ఖాళీ అవటం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల అధ్యక్షుడు కర్రేడ్ల గోవింద్, తడాల అబ్బు, కుర్ర నాగేశ్వరరావు, పుల్ల శ్రీరాములు, మాదరపు తాతాజీ, సిరంగు శ్రీనివాసరావు, తాటికాయలు వీరబాబు, సోదే ముసలయ్య జనసేన కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.
నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం (Doan constituency)లో కొండపేట లో 9, 10, 11,12, వార్డులలో పది ఇంటికి వెళ్లి చంద్రబాబు నాయుడు (Chandra babu Naidu) పెట్టినటువంటి మ్యానిఫెస్టోలో పథకాల గురించి ప్రజలకి వివరిస్తున్న కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి (Kotla Jaya Surya Prakash reddy) మీ ఓటు సైకిల్ గుర్తుకు వేసి డోన్ లో నన్ను ఎమ్మెల్యేగా గెలిపించవలసిందిగా కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి కోరారు. ఎమ్మెల్యే అయితే అభివృద్ధి ఏందో ఇప్పుడున్న మినిస్టర్ కు చేసి చూపిస్తా అని కోట్ల తెలిపారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు సీఎం అయితే పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తు బాగుంటుందని ప్రజలకు తెలియజేశారు. ఒక ఓటు ఒక ఛాన్స్ అన్న జగన్మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy)కి ఏసి మన రాష్ట్రంని అంధకారంలోకి తీసుకుపోయారు. అందుకే ఈసారి మనం జగన్ మోహన్ రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడించి చంద్రబాబు నాయుడుని మన రాష్ట్రానికి సీఎం చేసుకుంటే మన రాష్ట్ర అభివృద్ధితో పాటు మన రాష్ట్రంలో రాజధాని కూడా ఏర్పాటు చేసుకోవడానికి శ్రమించే వ్యక్తి చంద్రబాబు నాయుడు అని కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి తెలిపారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: బోయిన్ పల్లి శివాలయాల్లో భక్తుల ప్రత్యేక పూజలు..
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై కసరత్తు ముమ్మరం చేశారు. దీనిలో భాగంగా తాజాగా బాబు ఢిల్లీ పర్యటన ఖరారైంది. చంద్రబాబు నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. బీజేపీతో సార్వత్రిక ఎన్నికలలో పొత్తు విషయమై ఢిల్లీలో కీలక చర్చలు జరపనున్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్తో చంద్రబాబు భేటీ అయ్యారు. సుమారు గంటన్నర పాటు ఈ సమావేశం జరిగింది. ఇందులో ఢిల్లీ అంశాలతో పాటు రెండో ఉమ్మడి జాబితాలోని అభ్యర్థుల విషయమై కూడా ఇరువురు అధినేతలు కీలక మంతనాలు జరిపారు. మరోవైపు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, సోము వీర్రాజు ఢిల్లీ లోనే ఉన్నారు.
ఏపీలో ఎన్నికల వేళ…రాజధాని అంశం మరోసారి తెరపైకి వచ్చింది. అమరావతినే కొనసాగించాలని పవన్, చంద్రబాబు పట్టు పడుతుండగా జగన్ మాత్రం ససేమిరా అంటున్నారు. విశాఖనే ఏపీకి రాజధాని అంటూ మరోసారి కుండబద్దలు కొట్టారు. అంతేకాదు.. సీఎంగా విశాఖలోనే ప్రమాణస్వీకారం చేస్తానంటున్నారాయన. మరోసారి న్యాయ, శాసన రాజధానులపైనా సీఎం వైఎస్ జగన్ మనసునలోని మాట విప్పేశారు. కర్నూలు న్యాయ రాజధానిగా ఉంటుందన్నారు. అమరావతి కేవలం శాసన రాజధాని మాత్రమే అని చెప్పారు. ఈ లెక్కన మూడు రాజధానుల నినాదంతోనే తాను ఎన్నికలకు వెళ్తున్నట్లు జగన్ చెప్పకనే చెప్పేశారు అంటే తాను గెలిస్తే మూడు రాజధానులకు ప్రజలు ఓటేసినట్లే అనేది ఆయన భావన. ఇదే తరుణంలో అమరావతే రాజధాని అంటున్నారు పవన్, చంద్రబాబు. వచ్చే ఎన్నికల్లో గెలవబోయేది తామే అని, తాము అధికారంలోకి వచ్చీ రాగానే అమరావతికి పట్టం కడతామని చంద్రబాబు చెబుతున్నారు. దీంతో ఎన్నికల్లో ఏపీ రాజధాని అంశం కీలక పాత్ర పోషించబోతోంది. జగన్ విశాఖ, పవన్, చంద్రబాబు జై అమరావతి అంటుంటే జగన్ మాత్రం జై వైజాగ్ అంటున్నారు. ఏపీ ప్రజల్లో మాత్రం అమరావతి ఫీలింగే బలంగా ఉందని పవన్, చంద్రబాబు నమ్ముతున్నారు. ఈ తరుణంలో మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎటువైపు? వారి నిర్ణయం ఎలా ఉండబోతోంది అన్నది ఆసక్తికరంగా మారింది.
ఈ నెల 4 న కియా కార్ల పరిశ్రమ వద్ద తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రా కదిలి రా బహిరంగ సభను కార్యకర్తలు విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే బికె పార్థసారథి పిలుపునిచ్చారు. గత ఐదు రోజుల నుండి అమరావతిలో ఉన్న బీకే పార్థసారథి తన కార్యాలయానికి ఇవాళ ఉదయం వచ్చాడు. ఆయన అమరావతి వెళ్ళినప్పుడు నుండి ఆయన కార్యాలయం వద్ద అభిమానులు కార్యకర్తల సందడి నెలకొంది నేడు తన కార్యాలయం రావడంతో పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. అయితే హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా పోవాలని అధిష్టానం సూచించిందని ఆయన పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీలోనే మంచి పేరున్న నాయకుడిగా కొనసాగుతున్నానని అలాగే ఈ నెల జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చాడు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలో నిజం గెలవాలి యాత్ర చేపట్టారు.
చంద్రబాబు అరెస్ట్ అనంతరం జేపీ అగ్రహారం గ్రామంలో మరణించిన టీడీపీ కార్యకర్త సుర్ల దేవుడమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి ఆర్థికసాయం చెక్ అందించారు. గంపవానిపాలెం గ్రామంలో మృతి చెందిన టీడీపీ కార్యకర్త మాకిరెడ్డి పెద్దమ్మ కుటుంబాన్ని పరామర్శించారు. ఆర్థికసాయం తాలూకు చెక్ అందించారు. సభలో ఆమె ప్రసంగిస్తూ టీడీపీ కార్యకర్తలకు కర్తవ్యబోధ చేశారు. సైకిల్ కు ఎదురులేదని, ఎవరు అడ్డొచ్చినా లెక్కచేయొద్దని పిలుపునిచ్చారు. వైసీపీ పాలనలో రాష్ట్ర ప్రజల హక్కుల్ని కాలరాస్తున్నారు. మనం మన హక్కుల్ని సాధించడం కోసం సైకిల్ ని గెలిపించుకోవాలి.
తెలుగుదేశం జెండాను ఎగరేయాలి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ. ప్రజల కోసం చేసే పోరాటంలో సైకిల్ కి ఎవరైనా అడ్డొస్తే తొక్కుకుంటూ ముందుకెళ్లి పోవాలి… పసుపు సైనికులు ఎక్కడా వెనక్కి తిరిగి చూడవద్దు. గత నాలుగున్నరేళ్లుగా వైసీపీ ప్రభుత్వం ఏపీకి రాజధాని లేకుండా చేసింది. చంద్రబాబు 2019లో ముఖ్యమంత్రి అయ్యుంటే అమరావతి పూర్తి చేసేవారు. జగన్ 3 రాజధానులు అని ఒక్క రాజధాని కూడా లేకుండా చేశారు. రాబోయే ఎన్నికల్లో గెలిచేది టీడీపీనే… మన రాజధాని అమరావతే. ఓటు అనే ఆయుధంతో ప్రజాస్వామ్యాన్ని గెలిపిద్దాం… వైసీపీ చేతిలో నుండి ఏపీని కాపాడుకుందాం” అంటూ నారా భువనేశ్వరి ఉద్వేగభరితంగా ప్రసంగించారు.
Tdp :
ఎన్నికలకు టీడీపీ, జనసేన శ్రేణులను సిద్దం చేసేలా ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు రంగంలోకి దిగుతున్నారు. మొన్నటి వరకు సీట్ల సర్దుబాటు, పోటీ చేసే అభ్యర్దుల వడపోతతో బిజిబిజీగా ఉన్న వారు.. ఇటీవల సంయుక్తంగా పోటీ చేసే స్థానాలను ప్రకటించారు. ఇక క్షేత్రస్థాయిలో ఇరు పార్టీల నేతలు కలిసి కార్యక్రమాలు నిర్వహించేలా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. అయితే తాడేపల్లిగూడెం లో ఈనెల 28వ తేదీన నిర్వహించే భారీ బహిరంగ సభ ద్వారా టీడీపీ, జనసేన ఉమ్మడి ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. గతంలో లోకేష్ పాదయాత్ర సందర్భంగా టీడీపీ ఏర్పాటు చేసిన సభకు పవన్ కళ్యాణ్ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఇప్పుడు తాడేపల్లిగూడెంలో జనసేన ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సభకు చంద్రబాబు అతిధిగా హాజరవుతున్నారు. ఇరు పార్టీల అధినేతలు ఈ సభ ద్వారా ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. అన్ని నియోజకవర్గాలలో టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు కలిసి పని చేసేలా సంసిద్దం కావాలని పిలుపునివ్వనున్నారు. జనసేన పీఎసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ దగ్గర ఉండి మరీ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇక ఇరు పార్టీల నుంచి ఈ సభ విజయవంతం చేసే విధంగా ప్రత్యేకంగా కమిటీలను కూడా ఏర్పాటు చేసి.. అందరూ కలిసి పని చేసే మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేయడం విశేషం. ఈ సభకు మహిళలు భారీగా తరలి వచ్చే అవకాశం ఉండడంతో వారికి ప్రత్యేకంగా గ్యాలరీలను ఏర్పాటు చేశారు. మంచి నీరు, మజ్జిగ, ఇతర అల్పాహారాన్ని అందించేలా వాలంటీర్లను నియమించారు. “ఎన్నికలకు సమాయత్తం అయ్యేలా రెండు పార్టీలూ నిర్వహించబోయే ఈ సభకు ‘తెలుగు జన విజయకేతనం.. జెండా’గా నామకరణం చేసినట్లు నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల విజయపు జెండా కావాలని, 28వ తేదీన జరగబోయే సభలో రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇరు పార్టీల అధినేతలు తమ ప్రణాళికను వెల్లడిస్తారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జనసేన – తెలుగుదేశం పార్టీ పొత్తును మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నారని, వైసీపీ విముక్త రాష్ట్రం కోసం ప్రజలంతా తమకు అండగా ఉంటారని, ఈ ఉమ్మడి సభ రాష్ట్ర రాజకీయాలకు ఒక దిశా నిర్దేశంగా మారబోతుందన్నారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
ఇక ఈ సభకు లక్షల సంఖ్యలో ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలి వస్తారని భావిస్తున్నారు. సువీశాల ప్రాంగణంలో ఎవరికీ ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు కూడా భారీగా చేస్తున్నారు. జన సందోహాన్ని దృష్టిలో ఉంచుకని పకడ్పందీగా బారికేడ్ల ను కడుతున్నారు. ఇక స్టేజి దగ్గర నుంచి వెనుక వరకు గ్యాలరీలను నిర్మించి.. అందులో నిర్దేశించిన వారిని మాత్రమే అనుమతిస్తారు. జన సైనికులు, తెలుగు తమ్ముళ్లు అలాగే వీర మహిళలు, తెలుగు మహిళలు సంయుక్తంగా ఈ సభను విజయవంతం చేయాలని టీడీపీ నేతలు కూడా పిలుపునిచ్చారు. ఎక్కడా ఎలాంటి అవాంతరాలు లేకుండా ఇరు పార్టీల నుంచి నాయకులు ఏర్పాట్లను పర్యవేక్షించడం విశేషం. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఏర్పడిన పొత్తును బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, సంక్షేమం అభివృద్ధి అనే ఉమ్మడి పార్టీల అజెండాను ప్రజలకు అర్థమయ్యేలా ఈ సభలో వివరిస్తామని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు.
జనసేన, టీడీపీ ఉమ్మడి గా జెండా పేరుతో నిర్వహించే ఈ సభ ద్వారా తమ అజెండాను ప్రజలకు వివరించడంతో పాటు, వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలు, జగన్ చేసిన మోసాలు, మాయలను కూడా చంద్రబాబు, పవన్ లు వివరించనున్నారు. ఇక సిద్దం సభల పేరుతో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాుతున్న జగన్ వ్యాఖ్యలకు కూడా తమదైన శైలిలో ఈ జెండా సభ ద్వారా సరైన బదులు చెబుతారని టీడీపీ, జనసేన నేతలు స్పష్టం చేస్తున్నారు.
Read Also…
తెలుగుదేశం పార్టీలో నాయకుల మధ్య చిన్న చిన్న బేధాభిప్రాయాలు తప్ప రానున్న ఎన్నికలలో వైఎస్సార్సీపీ ని గద్దె దించి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును మరోసారి సిఎం చేయాలనీ కృత నిశ్చయంతో తెలుగుదేశం పార్టీ అభిమానులు ఉత్సాహంగా ఉన్నారని రాయచోటి తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, మాజీ జడ్పి చైర్మన్, రాజంపేట పార్లమెంట్ కాబోయే అభ్యర్ధి సుగావాసి సుబ్రహ్మణ్యం అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి లో సుగవాసి సుబ్రహ్మణ్యం ను వారి పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసారు. వారిని శాలువాతో సన్మానించి బొకే అందజేసి మీ యొక్క ఆశీస్సులు కావాలని కోరారు. మండిపల్లి సుగవాసి కుటుంబాల నాయకత్వం వర్దిల్లాలి చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిగా గెలిపించాలంటూ బారి నినాదాలు చేశారు వారి అభిమానులు. ఈ సందర్బంగా వారిరువురు మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో వైసిపినీ గద్దె దించి తెలుగుదేశం పార్టీని గెలిపించేందుకు కార్యకర్తలు సిద్దంగా ఉన్నరున్నారు. మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అనే నాకు టికెట్ రాకపోయినా పార్టీ కోసం అందరితో కష్టపడే వాడినే తప్ప ఎలాంటి రాగద్వేషాలకు లోనయ్యేవాడిని కానన్నారు. వెనుక బడిన ప్రాంతం రాయచోటి అభివృద్ధి చేయడమే ధ్యేయంగా సుగావాసి, మండిపల్లి కుటుంబాలు పని చేస్తాయన్నారు. సుగవాసి కుటుంబం, మండిపల్లి రెండు కుటుంబాలు కూడా మంచి ఆప్యాయత ప్రజాదరణ పుష్కలంగా కలిగి ఉన్నాయని రానున్న ఎన్నికలలో అత్యధిక మేజార్టితో గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ పై నమ్మకం ఉంచి తమను రాయచోటి అభ్యర్థిగా ప్రకటించిన తెదేపా అధ్యక్షులు చంద్ర బాబునాయుడు,లోకేష్,పవన కళ్యాణ్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లు అందరం కలిసి పార్టీ జెండా రెప రెప లాడిస్తాం. మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ద్వారక నాధ రెడ్డి, అభ్యర్థి రాంప్రసాద్ రెడ్డి తో కలిసి పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించుకు తీరుతాం. నాయకులు కలుసి పోవాలని ప్రజలే ఆదేశించారని మా రెండు కుటుంబాల కలయిక నియోజకవర్గం అభ్యున్నతికి కృషి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. మా తండ్రి పాలకొండ రాయుడు ఒక సమూహానికి మండిపల్లి నాగిరెడ్డి నాయకులుగా వ్యవహరించారన్నారు. అప్పట్లో వారి కార్యకర్తల కార్యక్రమాలకు మేము మా కార్యకర్తల కార్యక్రమాలకు హాజరయ్యే వాళ్ళం కాదు అటువంటి రాజకీయాలకు ప్రజలు మార్పు తెచ్చారన్నారు. ప్రజల కోరిక మేరకే నాయకులందరూ కలిసి పొయ్యారు ఫ్యాక్షన్ లాంటి వాతావరణం ఉండదు కేవలం రాయచోటి అన్ని రంగాలలో అభివృద్ధికి మాత్రమే పాటు పడే విధంగా మా కలియిక ఉంటుందని వారి స్పష్టంగా తెలియజేశారు.