బీజేపీ మూడో లిస్ట్ ను విడుదల చేయడంతో కాంగ్రెస్ విడుదల చేసే మూడో జాబితాపై అందరి దృష్టి పడింది. ఇప్పటి వరకు రెండు జాబితాలను విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ.. ఇవాళ అభ్యర్థుల మూడో జాబితాను ప్రకటించనుంది. వామపక్షాల సీట్ల సర్దుబాటు, మరికొన్ని స్థానాల అభ్యర్థుల మార్పు విషయంపై హస్తం పార్టీ తర్జనభర్జనలు పడుతోంది. రెండో జాబితా ప్రకటన తర్వాత పార్టీలో చెలరేగిన అసమ్మతి సెగను దృష్టిలో ఉంచుకుని మూడో జాబితాపై కాంగ్రెస్ తీవ్ర కసరత్తు చేసింది
Tag:
Congress BJP
డబ్బు మద్యం ఎరవేయకుండా ఓట్లు అడిగే ధైర్యం టిఆర్ఎస్, కాంగ్రెస్ బిజెపిలకు ఉందా? అని నర్సంపేట నియోజకవర్గం ఎంసిపిఐ(యు) ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దారపు రమేష్ సవాల్ విసిరారు. ఓటర్లకు డబ్బు మద్యం ఎరవేయకుండా ప్రలోభాలకు గురి చేయకుండా ఓట్లు అడిగే ధైర్యం లేదన్నారు. ఆశయాలకు అనుగుణంగా నీతిగా నిజాయితీగా విధానాల ప్రాతిపదికన ప్రజలను చైతన్యం చేసి ఓట్లు అభ్యర్థించే ఏకైక పార్టీ ఎంసిపిఐ(యు) అని అన్నారు. ఎన్నికల్లో కోట్లాది రూపాయలు గుమ్మరించి మద్యం మత్తులో ఓట్లు దండుకొని రాజకీయాలను వ్యాపారంగా మార్చిన రాజకీయ పార్టీలను గుర్తించాలని కోరారు. నీతివంతమైన రాజకీయాలను ముందుకు తీసుకెళ్లేందుకు సమర్ధుడైన బహుజన బిడ్డగా నన్ను ఆదరించాలని ఓట్లు వేసి గెలిపించాలని కోరారు.






Total views : 77964