సనత్ నగర్ నియోజకవరంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ నీలిమ ఇంటింటి ప్రచారం బన్సిలాల్ పేట్ డివిజన్ లోని బలరాం కాంపౌండ్, పద్మారావు నగర్ హమాలి బస్తీలో నిర్వహించారు. ఈ సందర్భంగా కోటా నీలిమ మాట్లాడుతూ… నగరంలో అభివృద్ధి జరుగుతుంటే పద్మరావు నగర్ లో రోడ్లు, హమాలీ బస్తీ ఎందుకు అంత అధ్వనంగా ఉందని ప్రశ్నించారు. తిండికి లేని కేసీఆర్ కుటుంబానికి ఇవాళ లక్షల కోట్లు ఎలా వచ్చాయో చెప్పాలన్నారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని యువత ఆశపడిందని, కానీ వారి ఆశలపై కేసీఆర్ నీళ్లు చల్లారన్నారు. ఉద్యోగాలు రాక యువత ఆత్మహత్యలు చేసుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. తెలంగాణ సాధించింది ఇందుకేనా? అని ప్రశ్నించారు.
Tag:
congress election campign
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బాగంగా ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మందుముల పరమేశ్వర రెడ్డి ప్రచారంలో దూసుకెళుతున్నారు. ఏఎస్ రావు నగర్ డివిజన్లోని కమల్ నగర్ లతో పాటు పలు ప్రాంతాలలో కార్యకర్తలతో కలిసి కాంగ్రెస్ అభ్యర్థి మందుముల పరమేశ్వర రెడ్డి, ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటేసి పరమేశ్వర రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన 6 సంక్షేమ పథకాలను వివరిస్తూ తనకు ఓటేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.






Total views : 78647