కేసీఆర్ రాక్షస పాలనను గద్దె దించేందుకు కాంగ్రెస్ లో చేరానని చెప్పారు వివేక్ వెంకటస్వామి. తనకు టికెట్ ముఖ్యం కాదని కేసీఆర్ సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటమే లక్ష్యమన్నారు. హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో రాహుల్ సమక్షంలో వివేక్.. తన కుమారుడు వంశీకృష్ణతో కలిసి కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్బంగా మాట్లాడిన వివేక్ వెంకటస్వామి.. తొమ్మిదేళ్ల పాలనలో కేసీఆర్ కుటుంబం దోచుకుందని ఆరోపించారు. సోనియా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని రాష్ట్రం వచ్చినా ప్రజల ఆకాంక్ష నెరవేరలేదన్నారు. బీఆర్ఎస్ పాలనలో ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని తెలిపారు. కేసీఆర్ ను గద్దె దించాల్సిన అవసరముందన్నారు. అందరం కలిసి కట్టుగా కేసీఆర్ ను గద్దె దించుతామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ప్రకారం పనిచేస్తానని చెప్పారు. తెలంగాణ సాధనలో తమ కుటుంబం ఎంతో కృషి చేసిందని చెప్పారు.
#congress
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తో ఫేస్ టూ ఫేస్ యాంకర్ కాంగ్రెస్, కమ్యూనిస్టుల పొత్తుల అంశం పై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రెండు రోజుల అల్టిమేటం జారీ చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలే వైరా , మిర్యాలగూడ సీట్లు కేటాయిస్తామని ప్రతిపాదించి, ప్రస్తుతం మాట మారుస్తున్నారని అన్నారు. పొత్తుల అంశం లో కాంగ్రెస్ తీరు సరిగా లేదని విమర్శించారు. వైరా, మిర్యాలగూడ స్థానాలు కేటాయించని పక్షంలో పొత్తుల ప్రసక్తి ఉండదని స్పష్టం చేస్తున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తో మా ఖమ్మం జిల్లా ప్రతినిధి సంతోష్ ఫేస్ టూ ఫేస్.
తెలంగాణలో సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యమన్నారు కిషన్ రెడ్డి. రాష్ట్ర ఎన్నికలు దగ్గరపడటంతో ప్రధాన పార్టీలన్నీ త్వరితగతిన పావులు కదుపుతూ.. రాజకీయ సమీకరణాలలో దూకుడు పెంచాయన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఎంఐఎంను అడ్డుపెట్టుకుని ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని కిషన్ రెడ్డి ఆరోపించారు. మంత్రులు ఓల్డ్సిటీకి వెళ్లాలంటే అసదుద్దీన్ అనుమతి తీసుకొని పర్యటించాల్సిన దుస్థితి నెలకొందని విమర్శించారు. మజ్లిస్ పార్టీ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో కరెంట్ బిల్లులు సైతం కట్టరన్నారు. ఓల్డ్సిటీలో ఎంఐఎం చేస్తున్నది తప్పు అని అధికారులు కూడా చెప్పలేకపోతున్నారని.. అటువంటి దౌర్బాగ్య పరిస్థితుల్లో ప్రభుత్వం ఉండటం హేయనీయమన్నారు.





Total views : 90425