విజయవాడ, ఎస్మా ప్రయోగించినా తగ్గమంటూ సమ్మెను కొనసాగిస్తామంటున్న అంగన్వాడీలు. వేతనాలపెంపు, ఉద్యోగ భద్రతపై ఆందోళన విరమించేది లేదంటున్న మున్సిపల్ కార్మికులు. టీచర్ల సమస్యలపై యూటిఎఫ్ ఆద్వర్యంలో 36 గం.ల దీక్షకు పిలుపు, అనుమతి లేదన్న పోలీసులు. అయినా దీక్ష చేస్తామంటున్న యూటిఎఫ్ నేతలు. ఉద్యోగ భద్రతపై ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాధన్యతపై సమ్మెకు దిగుతామంటున్న 108, 104 సిబ్బంది. ఈనెల 22 వరుకు దశలవారిగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామంటున్న 108, 104 ఉద్యోగ సంఘాల నేతలు. అన్ని సంఘాలు ఒకేసారి ఆందోళనలకు పిలుపునివ్వడంతో దద్దరిల్లిపోతున్న ధర్నా చౌక్. ధర్నా చౌక్ లో ఉన్న అందోళనకారుల టెంట్లు తీసేయడానికి సిద్దమవుతున్న పోలీసులు.
cvr gold
అమరావతి, నేడు కేంద్ర ఎన్నికల సంఘ ప్రతినిధులను కలవనున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్. ఎన్నికలలో వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులను వాడకూడదని ఫిర్యాదు. ఇప్పటికే టీడీపీ, జనసేన సానుభూతిపరుల ఓట్ల తొలగింపు పై ఫిర్యాదు చేసిన ప్రతిపక్షాలు. ఫిర్యాదులు పరిష్కరించినట్టుగా టీడీపీకి లేఖ రాసిన ఈసి. మరి కొన్ని ఫిర్యాదులు పరిష్కరణ దశలో ఉన్నాయని వెల్లడి. ఉమ్మడిగా ఫిర్యాదు చేయనున్న పవన్, చంద్రబాబు. వాలంటీర్లు అసలు ఉద్యోగులే కాదని చెబుతున్న వైసీపీ. సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులని వెల్లడి. ఎన్నికలలో ప్రభుత్వ ఉద్యోగులను వాడకూడదని ఎలా చెబుతారని అంటున్న వైసీపీ. ఉదయం చంద్రబాబు పవన్ భేటీ తర్వాత ఈసీ ని కలిసే అవకాశం. ఈసీకి ఫిర్యాదు చేయాల్సిన అంశాలపై ముందుగా చర్చించునున్న ఇరువురు నేతలు. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ఈసీ తో సమావేశం.
ఢిల్లీ నుండి ఎయిర్ ఇండియా విమానంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంకు చేరుకున్న ఎలక్షన్ కమిషనర్లు. గన్నవరం విమానాశ్రయంలో ఎలక్షన్ కమిషనర్లకు స్వాగతం పలికిన ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు, జేసీలు మరియు ఉన్నతాధికారులు. అనంతరం గన్నవరం విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన విజయవాడ నోవాటాలకు బయలుదేరి వెళ్లిన ఎలక్షన్ కమిషనర్లు.
ఐ పోలవరం మండలం మురమళ్ళ స్థానిక శ్రీ సాయి స్కూల్లో సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. స్కూల్ చైర్మన్ వాసురాజు దంపతులు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కనుమరుగైపోతున్న సంక్రాంతి సాంప్రదాయాలు ఈతరం విద్యార్థిని విద్యార్థులకు కళ్ళకి కట్టినట్టుగా నిర్వహించారు. స్కూల్ ఆవరణలో భోగి మంటలు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దు ఆటల విన్యాసాలు, తెలుగింటి వస్త్రధారణలు, రంగురంగుల రంగవల్లులు, కోడిపందాల కార్యక్రమాలు నిర్వహించారు. భోగిమంటల చుట్టు పాటలు పాడుతూ డాన్సులు వేస్తూ ఆనందోత్సాహాలతో సంబరాలు జరిగాయి.
శ్రీకాకుళం, ఆరోగ్య ప్రదాత, అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలోని ఇంద్ర పుష్కరిణి వద్ద సామూహిక సూర్యనమస్కారముల కార్యక్రమం ఘనంగా జరిగింది. వందలాది మంది జిల్లాలో ఉన్న యోగా విద్యార్ధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ సూచనల మేరకు జిల్లాలోని అరసవల్లి ఆలయ ప్రాంగణంలో అధికారులు, యోగా మాస్టర్లు ఆధ్వర్యంలో సూర్యనమస్కారములు నిర్వహించారు. 12 సెట్లగా విద్యార్ధినీ విద్యార్ధులు సూర్యనమస్కారములు చేశారు. ఒక్క సూర్యనమస్కారములే కాకుండా వివిధ రకముల యోగాసనాలను చేశారు. ఆర్ట్ ఫుల్ సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఆయుష్ శాఖ అధికారి అన్నారు. మకర సంక్రాంతి పండగను పురష్కరించుకొని సూర్యనమస్కారముల కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు, యోగా విద్యార్ధులు పాల్గొన్నారు. మొత్తం 5 సెషన్స్ గా నిర్వహించడం జరిగిందన్నారు.
అన్నమయ్య జిల్లా, ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాయచోటి నియోజకవర్గంలో విజయవంతంగా ముగిసిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం. నియోజకవర్గంలోని 98 సచివాలయ పరిధిలోని లక్ష గడపలకు వెళ్లిన ఎమ్మెల్యే. 186 రోజుల్లో పూర్తి. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పూర్తైన సందర్భంగా సంబేపల్లి మండలం, నారాయణరెడ్డిపల్లి సచివాలయం కాంప్లెక్స్ లో శిలాఫలకం ఆవిష్కరణ. కెక్ కట్ చేసి సంబరాలు నిర్వహించిన వైఎస్ఆర్ సిపి ప్రజా ప్రతినిధులు, సచివాలయ సిబ్బంది. పాల్గొన్న రెవిన్యూ, పోలీస్ శాఖ అధికారులు. విజయవంతంగా పూర్తి కావడానికి సహకరించిన నియోజకవర్గంలోని స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులకు కృతజ్ఞతలు తేలిపిన ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ మంచి చేశాం కాబట్టే ప్రజల్లోకి వేళ్ళగలిగాం. ప్రతి ఒక్కరూ అదరించారు. తమతమ స్తోమతకు తగ్గట్లు స్వాగతాలు పలకడం, అల్పాహారాలు అందించారు. ఎమ్మెల్యే గా 15 ఏళ్లు ఉన్నప్పటికీ తమ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయగలిగా. రెండున్నర సంవత్సరం కరోనా లేకుంటే మరింత ఆభివృద్ది జరిగేది. మళ్లీ ప్రజలు అదరిస్తారన్న నమ్మకం ఉంది.
తిమ్మాపూర్ మండలం, ఎల్ఎండి కాలనీలో గల నీటిపారుదల శాఖ కార్యాలయంలో ఆదివారం దొంగలు పడ్డారు ఎస్సై చేరాలు కథనం మేరకు ఎల్ఎండి కాలనీలో గల నీటిపారుదల శాఖ ప్రభుత్వ కార్యాలయం ఆదివారం కావడంతో సాయంత్రం ఆఫీసుకు ఉన్న బేడాలను పగలగొట్టి సుమారు 5 కంప్యూటర్లతో పాటు వైఫై కనెక్టింగ్ డేటా, వివిధ సామాగ్రిని దొంగలించినట్లు తెలిపారు. సుమారు 2.5 లక్షల విలువ గల సామాగ్రి చోరీకి గురైనట్లు పేర్కొన్నరు. ఈ విషయమై కార్యాలయ సూపరిండెంట్ అంజిరెడ్డి సమాచారం అందించడంతో ఎస్సై చేరాలు కార్యాలయానికి చేరుకొని సిబ్బందితో కలిసి కార్యాలయంలో దొంగిలించిన కంప్యూటర్లు వివిధ సామాగ్రి తో పాటు ఇంకా ఏమి దొంగతనానికి గురయ్యాయని పరిశీలించారు అక్కడే ఉన్న అధికారులను సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా అని ఆరా తీశారు కొంతకాలంగా పనిచేయకపోవడం లేదని చెప్పారు. దొంగతనానికి గురైన కంప్యూటర్లలో ప్రాజెక్టు కు సంబంధించిన డేటా తో పాటు క్యాంపు క్వార్టర్లు అటెండర్లు వివిధ డెవలప్మెంట్ కు సంబంధించిన డేటా కంప్యూటర్ లో భద్రపరుస్తామని ఆ కంప్యూటర్ లు మాత్రమే చోరీకి గురయ్యాయని అలాగే బీరువా ను పగలగొట్టి వివిధ ఫైళ్లు కూడా చోరీ చేసారు అని వెల్లడించారు. వెంటనే క్లూస్ టీం కు సమాచారం అందించడంతో సోమవారం వేలిముద్రలు సేకరించినట్లు తెలిపారు. అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.






Total views : 90138