గుంటూరు ఎంపీ ఎన్నికల బరిలో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు నియామకం చేసేందుకు వైసీపీ కసరత్తు. ఎంపీ మార్పు పై ఆసక్తి చూపని నరసరావు పేట పార్లమెంట్ ఎమ్మెల్యేలు. నరసరావు పేట ఎంపీ స్థానాన్ని బిసి వర్గాలకి ఇస్తే అన్ని నియోజకవర్గాల్లో పట్టు సాధించవచ్చని వైసీపీ అధిష్టానం యోచన. సీఎం జగన్ మోహన్ రెడ్డి అపాయింట్ మెంట్ కోరిన ఎంపీ శ్రీ కృష్ణ దేవరాయలు. నరసరావు పేట పార్లమెంట్ లో ఎన్నో అభివృద్ధి పనులు చేసిన ఎంపీ శ్రీ కృష్ణ దేవరాయలు. గుంటూరు పార్లమెంట్ కి వస్తే తాడికొండ, మంగళగిరి లాంటి నియోజకవర్గాల్లో అసంతృప్తి సెగ తగులుతుందని ఎంపీ ఆలోచన. సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం మేరకు ఎలాంటి మార్పు జరుగుతుందా అని వైసీపీ కింది స్థాయి నేతల్లో ఆసక్తి నెలకొంది.
CVr health
కేశినేని రాజీనామా నేపద్యంలో ఘాటు వ్యాఖ్యలు చేసిన PVP. ట్విట్టర్ లో నాని రాజీనామా పోస్ట్ ను షేర్ చేస్తూ విమర్శలు చేసిన పీవీపీ. కేశినేని నాని పిప్పళ్ల బస్తా, బెజవాడకే గుదిబండలా తయారయ్యావు. ఏదో మచ్చేసుకుని పుట్టావు, పార్టీలో పదేళ్లు బండి కొనసాగించావు. బ్యాంకులను బాదావు, జనాలని ఉద్యోగులని పీల్చి పిప్పి చేశావు. ఇకనైనా ఒట్టిమాటలు కట్టి పెట్టి, అన్ని మూసుకొని మూలపడుండు పుండాకోర్.!! అంటూ తీవ్ర స్దాయిలో విమర్శలు గుప్పించిన పీవీపీ. 2019 ఎన్నికల్లో నానిపై పోటి చేసిన పీవీపీ. వైసీపిలో పీవీపి కొనసాగనప్పటికి ఐదేళ్లుగా నాని విషయంలో మాత్రం విమర్శలు గుప్పిస్తునే ఉన్నారు.
అమరావతి, గుంటూరు – విజయవాడ వారధిపై హిట్ అండ్ రన్. స్కూటీ పై వెళ్తున్న మహిళలను ఢీ కొట్టిన గుర్తు తెలియని వాహనం. గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో ప్రమాదంలో ఇద్దరు మహిళలు స్పాట్ డెడ్. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కృష్ణ లంక పోలీసులు. గుంటూరు జిల్లా నంబూరుకు చెందిన మహిళలుగా గుర్తింపు. మృత దేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిన పోలీసులు. గుంటూరు నుండి విజయవాడ వస్తుండగా ప్రమాదం. ఢీ కొట్టిన వాహనం కోసం సీసి కెమెరాలను జల్లెడ పడుతున్న పోలీసులు.
కడప జిల్లా, కాజీపేటలో 300 కుటుంబాలు వైకాపా నుంచి తెలుగుదేశం లోకి చేరిక. వైకాపా ఎంపీటీసీ చంద్ర భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో మైదుకూరు టీడీపీ ఇన్ ఛార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్ సమక్షంలో టీడీపీలోకి చేరికలు. సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ అభివృద్ధి కావాలని సొంత పార్టీ ఎంపీటీసీ అడిగితె సస్పెండ్ చేసిన ఘనత వైకాపా కు చెందుతుంది. వైకాపా ఎంపీటీసీనే చేరుతున్నారంటే వారి అరాచకం అర్ధం అవుతుంది. రాష్ట్రానికి అభివృద్ధి కావాలి సంక్షేమం కాదు. అభివృద్ధి లేకుండా సంక్షేమం పనికిరాదు. అభివృద్ధి గురించి ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని రాత్రికి రాత్రే అరెస్టు చేస్తారు. రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోంది. నియంత పాలన ఎక్కువ రోజులు ఉండదు. మైదుకూరు శాసనసభ్యులు రఘురామిరెడ్డి కి దోచుకోవడం తప్పితే అభివృద్ధి చేయడం తెలియదు. శాసనసభ్యుడు రఘురామిరెడ్డికి సంక్షేమానికి, అభివృద్ధికి తేడా కూడా తెలియదు. తెలుగుదేశంతోనే అభివృద్ధి సాధ్యం అని వైకాపా నుంచి తెలుగుదేశం లోకి చేరుతున్నారు. తెలుగుదేశం లోకి స్వచ్ఛంగా చేరుతున్న వైసీపీ పార్టీ అధికార నాయకులు. వైసీపీ పాలనలో కాంట్రాక్టర్లు దోచుకుంటున్నారు. కాజీపేట మండలం అభివృద్ధిలో వెనకబడి ఉంది అని వెల్లడించారు.
పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని పేదలు, అట్టడుగువర్గాలకు కరుణతో సేవ చేయాలనే ఆయన సందేశం ప్రతి ఒక్కరికీ మార్గదర్శకమని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ అన్నారు. బీజేపీ ఉంగుటూరు అసెంబ్లీ కన్వీనర్ శరణాల మాలతీరాణి ఆధ్వర్యంలో ఉంగుటూరు మండలం చేబ్రోలు గ్రామంలో ఏర్పాటుచేసిన భారతీయ జనసంఘ్ సహవ్యవస్థాపకుడు దీన్ దయాళ్ ఉపాధ్యాయ విగ్రహాన్ని శుక్రవారం రాత్రి కేంద్రమంత్రి భారతి ప్రవీణ్ పవార్ ఆవిష్కరించారు. అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షుడు విక్రమ్ కిశోర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ రూపొందించిన అంత్యోదయ సిద్ధాంతాన్ని ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ఈ సందర్బంగా కేంద్రమంత్రి భారతీ పవర్ తెలుగు ప్రసంగం ఆకట్టుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ విగ్రహాన్ని చెక్కిన వారు, ఏర్పాటు చేసిన వారు, ఆవిష్కరించిన వారు మహిళలే కావడం గర్వంగా ఉందన్నారు. సర్పంచి రాంధే లక్ష్మీసునీత, మహిళామోర్చా రాష్ట్రాధ్యక్షురాలు నిర్మలా కుమారి, మైనార్టీమోర్చా రాష్ట్రాధ్యక్షుడు బాజీ, మధుకర్ తదితరులు పాల్గొన్నారు. ఈకార్యక్రమంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిని పొత్తులపై వివరాలు కోరగా అతిత్వరలో వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.
విజయవాడ, టీడీపీకి గుడ్ బై చెప్పిన విజయవాడ ఎంపీ కేశినేని నాని. త్వరలో టీడీపీకి రాజీనామా చేయనున్న ఎంపీ కేశినేని నాని. ఫేస్ బుక్ పోస్ట్, ట్విట్టర్ ద్వారా తన నిర్ణయాన్ని వెల్లడించిన కేశినేని నాని. తెలుగుదేశం పార్టీకి నా అవసరం లేదని చంద్రబాబు భావించిన తర్వాత కూడా నేను పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదని నా భావన. త్వరలో ఢిల్లీ వెళ్లి లోక్ సభ స్పీకర్ ను కలిసి లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తా. ఆ మరుక్షణమే టీడీపీకి రాజీనామా చేస్తా.
డిజిటల్ చెల్లింపుల సంస్థ PhonePe అంతర్జాతీయ చెల్లింపుల వ్యాపారానికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా యెస్ బ్యాంక్ మాజీ ఎగ్జిక్యూటివ్ రితీష్ పాయ్ ని నియమించినట్లు ఒక ప్రకటన లో పేర్కొంది. ఆయన ఇంతకు ముందు TerraPay లో ఉత్పత్తులు, పరిష్కారాల విభాగానికి అధ్యక్షుడిగా పనిచేసారు. అలాగే యెస్ బ్యాంకు లో సీనియర్ గ్రూప్ ప్రెసిడెంట్, చీఫ్ డిజిటల్ ఆఫీసర్ గా కూడా పనిచేసారు. అక్కడ డిజిటల్ చెల్లింపుల విభాగం లో కీలక పాత్ర పోషించారు.
కాకినాడ జిల్లా, రూరల్, ప్రభుత్వం పెంచిన 3000 రూపాయల పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని కాకినాడ మండల ప్రజా పరిషత్ కార్యాలయం లో ఎం.పి.డి.ఓ కే.స్వప్న అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబు హాజరయ్యారు. ప్రభుత్వం పెంచిన పెన్షన్ లను లబ్ధిదారులకు కన్నబాబు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత నుండి పెన్షన్ డబ్బులు నేరుగా ఇంటికే అందేలా ఆలోచించిన నాయకుడు జగన్ మోహన్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వ హయాంలో 65 సంవత్సరాలు నిండిన వారికే పెన్షన్లు ఇచ్చేవారు. పెద ప్రజల కష్టాలు చూసిన జగన్ మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి నెల 1వ తేదీ ఉదయాన్నే వాలంటీర్ వచ్చి లబ్ధిదారులకు అందజేసి దేశం లో చాలా రాష్ట్రాలకు ఆదర్శంగా పాలన సాగిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. దేశం లో ఏ రాష్ట్రం లో ఇవ్వని విధంగా 3000 రూపాయలు పెన్షన్ లు ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని, కులం, మతం, ఏ రాజకీయ పార్టీ కి మద్దతు ఇచ్చారు అని చూడకుండా అర్హులైన వారందరికీ పెన్షన్లు ఇస్తున్న దమ్మున నాయకుడు జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో డి.ఎల్.డి.ఓ పట్టంసెట్టి నారాయణ మూర్తి, ఎం.పి.పి గోపిసెట్టి పద్మజ బాబ్జీ, జెడ్పీటీసీ నురుకుర్తి రామకృష్ణ, తిమ్మపురం గ్రామ సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
రాజమహేంద్రవరం, గైట్ కాలేజీలో అంగరగవైభవంగా ప్రారంభమైన 2వ అంతర్జాతీయ తెలుగు మహాసభలు. తెలుగు పండుగలా సందడిగా మారిన గైట్ కాలేజీ ఆవరణ. చైతన్య విద్యాసంస్థలు అధినేత చైతన్య రాజు, ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు గజల్ శ్రీనివాస్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహణ. శ్రీశ్రీ రాజ రాజ నరేంద్రుల పట్టాభిషేక సహస్రాబ్ది నీరాజనంగా తెలుగు మహాసభలు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన అతిధులు, ప్రతినిధులు. విశాఖ శారదా పీఠం శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర మహాస్వామి వారి దివ్య ఆశీస్సులతో తెలుగు మహాసభల అంకురార్పణ కార్యక్రమం. మహాసభల ప్రారంభోత్సవ సభ వేదికకు రాజరాజ నరేంద్ర వేదికగా నామకరణం. మొదలైన సాంస్కృతిక కార్యక్రమాలు. తొలిరోజు ముఖ్యఅతిథిగా హాజరు కానున్న రాష్ట్ర గవర్నర్ , న్యాయమూర్తులు, పలువురు రాష్ట్ర మంత్రులు, సాహిత్య ప్రముఖులు, ప్రతినిధులు.
ఎల్బీనగర్, రోడ్డు ప్రమాదంలో తండ్రి కొడుకులు మృతి. నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌరెల్లి రోడ్డు వద్ద పాపన్న గూడ చౌరస్తాలో టిప్పర్ లారీ బైక్ ఢీ కొని కుత్బుల్లాపూర్ కి చెందిన తండ్రి కొడుకులు మృతి. నాగోల్ పీఎస్ పరిధి కుత్బుల్లాపూర్ కి చెందిన కుతాడి కుమార్ (40) , 7వ తరగతి చదువుతున్న కొడుకు కుతాడి ప్రదీప్ (13) టిప్పర్ ఢీకొని తండ్రి కొడుకులు ఇద్దరు మృతి. పరారీ లో టిప్పర్ డ్రైవర్. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న నాగోల్ పోలీసులు.




Total views : 90036