ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా-బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో సీఆర్పీఎఫ్ కోబ్రా బలగాలపై మావోయిస్టుల మెరుపుదాడి ఘటనలో విస్మయం కలిగించే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టేకులగూడెం అటవీప్రాంతంలోని సీఆర్పీఎఫ్ బేస్క్యాంపు సమీపంలో మూడు రోజుల క్రితం భద్రతబలగాలపై చేసిన దాడిలో మావోయిస్టులు బ్యారెల్ గ్రెనేడ్ లాంచర్లను వినియోగించారు. అయితే వాటిని సొంతంగానే తయారు చేస్తున్నట్లు తేలడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. బీజీఎల్తోపాటు ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజ్లను సొంతంగానే కర్మాగారాల్లో తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. టేకులగూడెం అడవుల్లో దాడి అనంతరం మావోయిస్టుల సొరంగాన్ని పోలీసులు గుర్తించిన సంగతి తెలిసిందే. ఆ ప్రాంతానికి సమీపంలోనే భారీగా ఆయుధాల డంప్ను భద్రతబలగాలు స్వాధీనం చేసుకోగా వీటిలో పదుల సంఖ్యలో బీజీఎల్లు లభించడం గమనార్హం. వాటి నిర్మాణశైలిని బట్టి మావోయిస్టులు సొంతంగానే తయారు చేస్తున్నట్లు గుర్తించారు. దండకారణ్యంలోని అబూజ్మడ్ అడవుల్లో వీటిని తయారు చేస్తున్నట్లు భావిస్తున్నారు.
CVr health
విజయవాడ ఎంపీగా రెండుసార్లు గెలిచిన సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని టీడీపీ నుంచి వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో కేశినేనికి అదేస్థానం నుంచి వైసీపీ తరుపున పోటీకి రెడీ అని ప్రకటనలు వచ్చాయి! అయితే తాజాగా చేయిస్తున్న సర్వేల్లో కొత్త పేర్లు తెర మీదకు వస్తున్నాయని తెలుస్తుంది. ఇందులో భాగంగా ఈసారి విజయవాడ లోక్ సభ స్థానం నుంచి ఎస్సీ సామాజికవర్గానికి చెందిన నేతను బరిలోకి దింపాలనే ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో బెజవాడ రాజకీయాల్లో సరికొత్త సమీకరణలు తెరపైకి వస్తున్నాయి.
యువతను దగా చేసిన సైకో మామ జగన్మోహన్ రెడ్డి అని టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ విమర్శించారు. 50 వేల 250 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉంటే 6,100 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారు. మెగా డీఎస్సీ కాదు దగా డీఎస్పీ అని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఏపీని గంజాయి రాష్ట్రంగా మార్చిన ఘనత సీఎంకే చెల్లుతుందని, పోలీసులే గంజాయిని విక్రయిస్తుండడం బాధాకరం అని అన్నారు. ఏపీకి పెట్టుబడులు తీసుకురాలేదు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కరువయ్యాయని, రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మార్చారని అన్నారు. రాష్ట్ర ప్రజలు టీడీపీ-జనసేన పరిపాలన కోరుకుంటున్నారని, దొంగ ఓట్లతోనే వైసీపీ నేతలు ప్రతి ఎన్నికల్లోను గెలుస్తున్నారని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ దుయ్యబట్టారు.
ప్రజా ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ నేతలు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలని ఎమ్మెల్సీ కవిత హితవు పలికారు. జ్యోతిరావ్ ఫూలే భవన్లో స్వీకరిస్తున్న అర్జీల ప్రోగ్రామ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకే ఒక్క రోజు పాల్గొన్నారని విమర్శించారు. ఇంద్రవెల్లిలో జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యక్రమానికి ప్రభుత్వ నిధులు ఎలా ఉపయోగిస్తారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డిని యూటర్న్ ముఖ్యమంత్రి అని పిలుచుకుంటున్నారని తెలిపారు. చెప్పిన ఏ ఒక్క మాట కూడా పాటించకపోవడం వల్లే ఇలా పిలుచుకుంటున్నారని దెప్పి పొడిచారు. కచ్చితంగా వందరోజులు ఓపిక పడుతామని, వందరోజులు పూర్తయ్యాక ఎట్టి పరిస్థితుల్లో వదిలపెట్టబోమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్లోని అన్నీ లోపాలను, లొసుగులను తప్పకుండా ప్రజలకు వివరిస్తామని చెప్పారు. కేసీఆర్కు ఉన్న అపారమైన రాజకీయ అనుభవంతో రేవంత్కు ఏమాత్రం పోలిక లేదని కవిత తెలిపారు. ప్రజాపాలన పేరుతో ప్రజల వద్దకే పాలన తీసుకురావాలని కెసిఆర్ కోరుకునే వారని… నేడు రేవంత్ రెడ్డి కూడా కెసిఆర్ చూపిన మార్గంలో నడుస్తుండటం సంతోషదాయకమని కవిత అన్నారు.
అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో రోడ్డు రవాణా శాఖ భద్రత మాసోత్సవాలు జరుగుతున్నాయి. జనవరి 14వ తేదీన ప్రారంభమైన రోడ్డు భద్రతా మాసోత్సవాలను.. ఫిబ్రవరి 15వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు తాడిపత్రి రవాణాశాఖ ఇన్స్పెక్టర్ పేర్కొన్నారు. ఈ మేరకు RTO ఆఫీసులో ఆయన రోడ్డు భద్రత మాసోత్సవాలను ప్రారంభించారు. రోడ్డు సేఫ్టీ గురించి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని.. దేశంలో ప్రతి నిమిషానికి ఒక రోడ్డు ప్రమాదం జరుగుతుందన్నారు. ప్రతి మూడు నిమిషాలకు అదే రోడ్డు ప్రమాదంలో ఒకరు మృత్యువాత పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ అధికారి రాజా గోపాల్, ఆర్టీసీ డిపో మేనేజర్, తాడిపత్రి డీఎస్పీ గంగయ్య, ట్రైని డీఎస్పీ హేమంత్, తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీకి భారత రత్న అవార్డు దక్కింది. 1990వ దశకం ప్రారంభంలో అయోధ్యలోని రామ మందిరం కోసం రథ యాత్రతో..బీజేపీ నాయకుడు లాల్ కృష్ణ అద్వానీ పార్టీని జాతీయ స్థాయికి చేర్చారు. ఆయనకు భారత దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న రావడం పట్ల.. ప్రముఖ నాయకులంతా హర్షం వ్యక్తం చేశారు. అదే విధంగా అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఆయన కృషి ఎనలేనిదని ప్రధానమంత్రి మోదీ అన్నారు. దేశ అభివృద్ధిలో అద్వానీది కీలక పాత్ర అని కొనియాడారు. ఆయనను కలిసి ప్రధాని మోదీ తన అభినందనలు తెలియజేశారు.
తాజాగా బీఆర్ఎస్ కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. మాజీ డిప్యూటీ సీఎం, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ పార్టీ కు రాజీనామా చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల వరకు ఆయన స్టేషన్ ఘన్ పూర్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. మరో సారి కూడా ఆయన అక్కడి నుంచి టికెట్ ఆశించారు. కానీ బీఆర్ఎస్ రాజయ్యకు టికెట్ ఇవ్వలేదు. మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి ఆ స్థానాన్ని కట్టబెట్టింది. ఈ నిర్ణయంపై రాజయ్య మొదట్లో కొంత అసంతృప్తి వ్యక్తం చేసినా.. తరువాత పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పని చేశారు. కడియం శ్రీహరిని గెలిపించేందుకు నియోజకవర్గం అంతా ప్రచారం చేశారు. బీఆర్ఎస్ మొదటి హయంలో డిప్యూటీ సీఎంగా తాటికొండ రాజయ్య సేవలు అందించారు. అయితే కొంత కాలం తరువాత ఆయన పదవిని కోల్పోయారు. ఇది అప్పట్లో రాజకీయంగా చర్చనీయాశం అయ్యింది. కానీ ఎమ్మెల్యేగా తన నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉండి, సేవలు అందించారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాకపోవడం, ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేసినప్పటికీ ఇప్పట్లో మరే పదవీ దక్కే అవకాశం లేకపోవడంతో ఆయన పార్టీని వీడేందుకు మొగ్గు చూపారు. వాస్తవానికి టికెట్ నిరాకరించినప్పటి నుంచే ఆయన బీఆర్ఎస్ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారు. ఇలాంటి సమయంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ దీప్ దాస్ మున్సి మరియు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలసి చర్చలు జరిపారని తెలుస్తోంది. దీంతో రాజయ్య బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. ఆ పార్టీకి రాజీనామా చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కరివేపాకు వంటకాల్లో ఒక సాధారణ పదార్థం. కానీ ఇది వంటకాల్లో రుచిని ఇవ్వటమే కాకుండా, జుట్టు ఆరోగ్యానికి కూడా అద్భుతంగా పని చేస్తుంది. కరివేపాకులో విటమిన్ సి, బి, ప్రొటీన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లను పోషించి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. కరివేపాకులోని బీటా కెరోటిన్ జుట్టుకు అవసరమైన విటమిన్ ఎ గా మార్చబడుతుంది. ఇది జుట్టు పెరుగుదలకు చాలా ముఖ్యమైనది. కరివేపాకులోని కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, సెలీనియం వంటి ఖనిజాలు జుట్టు కుదుళ్లను బలపరుస్తాయి. కరివేపాకులోని యాంటీ ఫంగల్ లక్షణాలు చుండ్రు మరియు తలలో పురుగులను నివారిస్తాయి.
కరివేపాకును జుట్టు పెరుగుదల కోసం ఎలా ఉపయోగించాలి:
కరివేపాకు ఆకులను నీటిలో వేసి మరిగించి, చల్లారిన తర్వాత పేస్ట్ చేసి తలకు పట్టించి 30 నిమిషాల తర్వాత తలస్నానం చేయండి. కరివేపాకు ఆకులను కొబ్బరి నూనెలో వేసి మరిగించి, చల్లారిన తర్వాత నూనెను జుట్టుకు పట్టించి రాత్రంతా ఉంచి మరుసటి రోజు ఉదయం తలస్నానం చేయండి. కరివేపాకు ఆకులను నీటిలో వేసి మరిగించి, ఆ నీటితో తలస్నానం చేయండి. ఇలా చేయటం ద్వారా జుట్టు పెరుగుదల పెరుగుతుంది. జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు బలంగా మరియు మెత్తగా మారుతుంది. చుండ్రు మరియు తలలో పురుగులు తగ్గుతాయి. కరివేపాకు ఒక సహజమైన మరియు సురక్షితమైన పదార్థం. దీనిని ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా జుట్టు పెరుగుదల కోసం ఉపయోగించవచ్చు.
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) మైక్రో శాటిలైట్ల కోసం హైబ్రిడ్ ఎలక్ట్రో-థర్మల్ ప్రొపల్షన్ (HET) సిస్టమ్ను విజయవంతంగా ప్రారంభించింది. ఈ సిస్టమ్ డీఆర్డీవో అభివృద్ధి చేసిన మొదటి పర్యావరణ అనుకూల ప్రొపల్షన్ సిస్టమ్.
HET సిస్టమ్ ఎలా పనిచేస్తుంది?
ఈ సిస్టమ్ హైడ్రజన్ మరియు ఆక్సిజన్ను ఉపయోగించి థ్రస్ట్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంధనాలు పర్యావరణానికి హాని కలిగించే ఉద్గారాలను ఉత్పత్తి చేయవు. HET సిస్టమ్ చాలా సమర్థవంతమైనది మరియు సాంప్రదాయ ప్రొపల్షన్ సిస్టమ్ల కంటే ఎక్కువ డెల్టా-Vని అందిస్తుంది.
HET సిస్టమ్ యొక్క ప్రయోజనాలు:
ఇది పర్యావరణ అనుకూలమైనది మరియు సమర్థవంతమైనది. ఇది సాంప్రదాయ ప్రొపల్షన్ సిస్టమ్ల కంటే ఎక్కువ డెల్టా-Vని అందిస్తుంది. ఇది మైక్రో శాటిలైట్లను భూమి కక్ష్యలోకి ప్రవేశపెట్టడానికి చౌకైన మార్గాన్ని అందిస్తుంది. HET సిస్టమ్ భారతదేశ అంతరిక్ష కార్యక్రమానికి ఒక ముఖ్యమైన మైలురాయి. ఇది మైక్రో శాటిలైట్లను ప్రయోగించడానికి భారతదేశ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు అంతరిక్షంలో భారతదేశ పాత్రను బలోపేతం చేస్తుంది.
ఈ సిస్టమ్ను అభివృద్ధి చేసిన డీఆర్డీవో శాస్త్రవేత్తల బృందానికి అభినందనలు!
గొప్ప వార్త! భారతీయ పర్యాటకులు ఇప్పుడు ఈఫిల్ టవర్ టిక్కెట్లను రూపాయల్లో చెల్లించవచ్చు. ఈ సౌకర్యం 2023 డిసెంబర్ 1 నుండి అందుబాటులోకి వచ్చింది. ఈఫిల్ టవర్ యొక్క అధికారిక వెబ్సైట్లో లేదా టిక్కెట్ కౌంటర్ల వద్ద టిక్కెట్లను రూపాయల్లో కొనుగోలు చేయవచ్చు. చెల్లింపు UPI, Paytm, PhonePe, Google Pay వంటి భారతీయ చెల్లింపు పద్ధతుల ద్వారా చేయవచ్చు. టిక్కెట్ ధరలు ప్రస్తుత మారక రేటు ప్రకారం రూపాయల్లో లెక్కించబడతాయి తద్వారా భారతీయ పర్యాటకులకు టిక్కెట్లను కొనుగోలు చేయడం సులభతరం అవుతుంది. వారికి విదేశీ మారకం కోసం వెళ్లాల్సిన అవసరం లేదు. ఇది భారతీయ పర్యాటకులకు ఈఫిల్ టవర్ను సందర్శించడానికి ఎంతో సౌకర్యాన్ని చేకూరుస్తుంది. ఈ సౌకర్యం భారతీయ పర్యాటకులకు ఒక గొప్ప ప్రయోజనం. ఇది ఫ్రాన్స్ పర్యటనను మరింత సులభతరం చేస్తుంది.






Total views : 90147