హైదరాబాద్ ఆఫ్ మారథాన్ను జెండా ఊపి ప్రారంభించిన సచిన్ గచ్చిబౌలి స్టేడియంలో మారథాన్సచిన్తోపాటు బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ కూడా హాజరుఉత్సాహంగా పాల్గొన్న 8 వేలమంది రన్నర్లు హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో ఈ ఉదయం నిర్వహించిన ‘హైదరాబాద్ ఆఫ్ మారథాన్’కు టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 20కే, 10కే, 5కే విభాగాల్లో నిర్వహించిన ఈ మారథాన్లో బ్యాడ్మింటన్ దిగ్గజం, కోచ్ పుల్లెల గోపీచంద్ కూడా పాల్గొన్నాడు. ఈ మారథాన్లో వయసుతో పనిలేకుండా దాదాపు 8 వేల మంది రన్నర్లు పాల్గొన్నారు. ఉదయం 5.15 గంటలకే 21.1కే రన్ ప్రారంభం కాగా, ఆ తర్వాత 10కే, 5కే రన్ ప్రారంభమయ్యాయి. ఏజెస్ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాండ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ మారథాన్ కార్యక్రమానికి దాని బ్రాండ్ అంబాసిడర్ అయిన సచిన్ టెండూల్కర్ పాల్గొని జెండా ఊపి ప్రారంభించాడు.
Tag:
Gachibowli Stadium
సైబర్ టవర్స్ నిర్మించి 25 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఐటీ ఉద్యోగులు సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి స్టేడియంలో టీడీపీ అధినేత చంద్రబాబుకి కృతజ్ఞత కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి భారీగా ఐటీ ఉద్యోగులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. అలాగే చంద్రబాబు కుటుంబసభ్యులు కూడా పాల్గొన్నారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ టీమ్ సంగీత విభావరి నిర్వహించింది. నందమూరి రామకృష్ణ, బాలకృష్ణ భార్య వసుంధరతో పాటు పలువురు నందమూరి కుటుంబసభ్యులు ఇందులో పాల్గొన్నారు.అలాగే శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.




Total views : 77494