రాజమండ్రి గైట్ మైదానంలో జనవరి 5 6 7 తేదీలలో అంతర్జాతీయ తెలుగు మహాసభలను నిర్వహించనున్నట్లు గజల్ శ్రీనివాస్ తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం అల్లూరి సాంస్కృతిక కళాక్షేత్రం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన శ్రీనివాస్ మాట్లాడారు. ఆంధ్ర సర్వహక పరిషత్ చైతన్య విద్యాసంస్థలు సంయుక్తంగా అత్యంత వైభవంగా అంతర్జాతీయ మహాసభలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ మహాసభలలో నాలుగు రాష్ట్రాలకు చెందిన గవర్నర్లు ఇద్దరు కేంద్రమంత్రులతోపాటు ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రి లకు ఆహ్వానం పంపినట్లు ఆయన తెలిపారు. లక్ష మంది వరకు తెలుగు భాషాభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి ఉచిత భోజన సదుపాయం వసతి ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. జనవరి 2 తేదీన పదివేల మంది విద్యార్థిని, విద్యార్థులతో రాజమండ్రిలో శోభయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆయా ప్రాంతాల్లో ఉన్న తెలుగు వారందరూ జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
Read Also..
Read Also..




Total views : 196387