రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్ పేట్ కార్పొరేషన్లో హైడ్రా పంజా విసిరింది. మున్సిపల్ కార్పొరేషన్ 4వ డివిజన్ వెంకటేశ్వర కాలనీలో ఏనుగు సురేందర్ రెడ్డి పార్కు స్థలాన్ని ఆక్రమించాడు. సురేందర్ రెడ్డి సుమారు వేయి గజాల పార్కు స్థలాన్ని ఆక్రమించి, కంటైనర్ను ఏర్పాటు చేశాడు. గతంలో పలుమార్లు మున్సిపల్ అధికారులు పార్కు స్థలమని బోర్డు ఏర్పాటు చేశారు. అయినా ఆ సైన్ బోర్డును సురేందర్ రెడ్డి పట్టించుకోలేదని స్థానికులు తెలిపారు. ఈ నేపథ్యంలో పార్కు స్థలం ఆక్రమణకు గురైందని కాలనీవాసులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుతో హైడ్రా ఇన్స్పెక్టర్ తిరుమలేష్, పోలీసు సిబ్బంది స్పందించారు. సురేందర్ రెడ్డి అక్రమంగా ఏర్పాటు చేసిన కంటైనర్ను తొలగించారు. పార్కు స్థలాన్ని సురేందర్ రెడ్డి చెర నుంచి విడిపించి, మున్సిపల్ అధికారులకు అప్ప చెప్పారు. అధికారులు, ఆయా పార్టీ నేతల అండదండలతో బడంగ్ పేటలో కబ్జాలు జరుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- శ్రీశైల క్షేత్రంలో ఉగాది ఉత్సవాలకు ఏర్పాట్లు.నంద్యాల జిల్లా శ్రీశైల మహా క్షేత్రంలో ఈనెల 16 నుండి 20 వరకు ఉగాది ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ఈవో శ్రీనివాసరావు సిబ్బందితో సమీక్ష జరిపారు. ఉగాది ఉత్సవాల సందర్భంగా గతంలో వలే భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనం…
- నేపాల్ ఎన్నికల్లో కొత్త పార్టీ ప్రభంజనంనేపాల్ రాజకీయాల్లో కొత్త పార్టీ ప్రభంజనం సృష్టించింది. నేపాల్ ఎన్నికలు ఆ దేశ రాజకీయాలను సమూలంగా మార్చేశాయి. కేవలం మూడున్నరేళ్ల క్రితం ఆవిర్భవించిన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ఆర్ఎస్పీ పార్లమెంట్ ఎన్నికల్లో సరికొత్త రికార్డు నెలకొల్పింది. దశాబ్దాలుగా తమను శాసిస్తున్న హేమాహేమీలను…
- పశ్చిమాసియా ఘర్షణలతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది.పశ్చిమాసియా ఘర్షణలతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. దాంతో చమురు ధరలు భగ్గుమంటున్నాయి. తాజాగా బ్యారెల్ ముడిచమురు ధర 100 డాలర్ల మార్క్ దాటేసింది. నాలుగేళ్లలో ఒక బ్యారెల్ ధర ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. అమెరికా…
- తిరుపతి నగరంలోని ఎయిర్ బైపాస్ రోడ్లో ఉన్న డి మార్ట్ స్టోర్పై తక్షణ చర్యలుతిరుపతి నగరంలోని ఎయిర్ బైపాస్ రోడ్లో ఉన్న డి మార్ట్ స్టోర్పై తక్షణ చర్యలు తీసుకోవాలని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు, నేషనల్ షెడ్యూల్డ్ క్యాస్ట్ వెల్ఫేర్ కౌన్సిల్ సభ్యుడు మించల ప్రదీప్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు…
- తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్–2026 కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీస్ అధికారులను ఉద్దేశించి కీలక సూచనలు చేశారు.తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్–2026 కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీస్ అధికారులను ఉద్దేశించి కీలక సూచనలు చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి పోలీస్ అధికారులు చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడడంలో పోలీస్ శాఖ కీలక…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి