విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో ఘనంగా ప్రారంభమైన భవానీ దీక్షా విరమణలు. ఐదు రోజులపాటు కొనసాగనున్న భవానీ దీక్షా విరమణ కార్యక్రమం. నాలుగు హోమగుండాలని వెలిగించి అగ్ని ప్రతిష్టాపన చేసిన ఆలయ అధికారులు అర్చక స్వాములు. నేతి టెంకాయలను సమర్పించి భవానీ దీక్షలను విరమణ చేస్తున్న భవానీ భక్తులు. జై దుర్గా జై జై దుర్గా నామస్మరణతో మారుమోగుతున్న ఇంద్రకీలాద్రి. కనుచూపుమేరకు ఎర్రని దుస్తులతో ఇంద్రకీలాద్రి ఆలయానికి పోటెత్తిన భవానీ భక్తులు. ప్రత్యేక కౌంటర్లలో ఇరుముడులను సమర్పిస్తున్న భవానీలు. మూడు షిఫ్ట్ లలో 300 మంది గురు భవానీలు. కేశఖండనశాలలో 850 మంది క్షురకులను ఏర్పాటు చేసిన ఆలయ అధికారులు. 20 లక్షల లడ్డూలను భవానీలకు అందుబాటులో ఏర్పాటు చేసిన ఆలయ అధికారులు. గిరి ప్రదక్షణలో భవానీ భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు.
international news
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు మల్లాది విష్ణుకు సెంట్రల్ నియోజకవర్గం సీటును కేటాయించకపోవడంతో ఒక్కసారిగా భారీ సంఖ్యలో మల్లాది విష్ణు నివాసానికి చేరుకున్న వైసీపీ శ్రేణులు మల్లాది విష్ణు అభిమానులు. ఎట్టి పరిస్థితుల్లో సెంట్రల్ నియోజకవర్గం సీటు మల్లాది విష్ణు కు కేటాయించాలని కోరుతూ రోడ్డుపై భారీగా చేరుకున్న ప్రజలు. మల్లాది విష్ణు కే సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ అభ్యర్థిగా ప్రకటించాలని కోరుతూ భారీ ఎత్తున నినాదాలు చేస్తున్న వైసీపీ శ్రేణులు మల్లాది అభిమానులు.
కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం, 53 మద్యం సీసాలను, 5 లక్షల 50 వేలు నగదును స్వాధీనం చేసుకున్న గన్నవరం పోలీసులు. సాధారణ తనిఖీలలో భాగంగా గన్నవరం మండలం కేసరపల్లి- సవారిగూడెం జంక్షన్ వద్ద వాహనాలు చెకింగ్ లో భాగంగా ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న గన్నవరం పోలీసులు. వారి వద్ద నుండి 53 మద్యం సీసాలను 5 లక్షల 50 వేలు నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న గన్నవరం పోలీసులు.
ఉంగుటూరు మండలం పెద్ద అవుటపల్లి బ్రదర్ జోసఫ్ తంబి పుణ్యక్షేత్రంలో పురుగుమందు సేవించి తల్లీకూతుళ్ల ఆత్మహత్యాయత్నం. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి కి చెందిన కొప్పుల విజయభారతి (35), కొప్పుల శ్రీనిధి (13)గా గుర్తింపు. స్థానికుల సమాచారంతో చికిత్స నిమిత్తం అంబులెన్స్ లో గన్నవరం మండలం చిన్న ఆవుటపల్లి పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కాలేజీ హాస్పిటల్ కి తరలింపు. పురుగుమందు సేవించిన తల్లీకూతుళ్ల ఆరోగ్యం పరిస్థితి విషమం. సమాచారం అందుకున్న ఆత్కూరు పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఖతార్ లో మరణశిక్ష పడిన 8 మంది భారతీయులకు ఊరట లభించింది. 8 మంది నేవీ మాజీ అధికారులకు శిక్ష తగ్గిస్తూ ఖతార్ కోర్టు తీర్పు వెలువరించింది. 8 మంది నేవీ మాజీ అధికారులపై గూఢచర్యం ఆరోపణలు వచ్చాయి. ప్రైవేటు భద్రతా సంస్థ అల్ దహ్రాలో వీరంతా పని చేశారు. కేసు నమోదవడంతో గతేడాది 8 మంది భారతీయులను ఖతార్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టు తీర్పుతో వారి కుటుంబాల్లో సంతోషం వ్యక్తం అవుతోంది.
కాకినాడ, సీఎం వీడియో కాన్ఫరెన్స్ కి దూరంగా పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు. సెక్రటేరియట్ నుంచి పాల్గొన్న సీఎం జగన్. జనవరి నెలలో అమలు చేసే పధకాలకి సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రి దాడిశెట్టి రాజా. పిఠాపురం లో పలు అభివృద్ధి కార్యక్రమాలు లో పాల్గొన్న ఎమ్మెల్యే దొరబాబు కి పిఠాపురం సీటు నిరాకరించిన సీఎం, అప్పటి నుంచి పార్టీకి దూరంగా ఉంటూ సొంత వర్గాన్ని మెయింటైన్ చేస్తున్న దొరబాబు. అధికారులు నుంచి సమాచారం వచ్చిన స్పందించని ఎమ్మెల్యే.
విజయనగరం జిల్లా,
స్నేహితులతో కలిసి అరకు విహారయాత్ర ముగించుకొని తిరిగి వస్తుండగా ప్రమాదం బారిన పడ్డ యువకుడు. కొత్తవలస – అరకు ప్రధాన రహదారిలో నిమ్మలపాలెం గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో విశాఖపట్నం జిల్లా మింది గ్రామానికి చెందిన యువకుడు తేజ (23) మృతి చెందాడు. స్నేహితులతో కలిసి అరకు విహారయాత్రను ముగించుకొని తిరిగి వస్తుండగా నిమ్మలపాలెం గ్రామం వద్ద ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న వ్యానును బలంగా ఢీకొనడం వల్ల సంఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. అతనితో పాటు ప్రయాణం చేస్తున్న మరొక యువకుడు భాను తీవ్రంగా గాయపడటంతో 108 అంబులెన్స్ లో పోలీసులు హాస్పిటల్ కు తరలించారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
పల్నాడు జిల్లా, సత్తెనపల్లి శరభయ్య హైస్కూల్లో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న స్పోర్ట్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రద్యుమ్న, జాయింట్ కలెక్టర్ శ్యాం ప్రసాద్. జాయింట్ కలెక్టర్ బౌలింగ్ చేయగా బ్యాటింగ్ చేసిన ప్రిన్సిపల్ సెక్రెటరీ. క్రీడాకారులతో ఆడుకుందాం ఆంధ్ర గురించి అడిగి తెలుసుకున్న పి.ఎస్. క్రికెట్ ను వీక్షించిన ప్రిన్సిపల్ సెక్రెటరీ, జాయింట్ కలెక్టర్.
అన్నమయ్య జిల్లా, సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి గ్రామాలలో నిర్వహించే క్రికెట్ టోర్నమెంట్ కు రాజంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ రెండు గ్రామాల క్రికెట్ జట్లు కెప్టెన్లకు ఒక్కొక్కరికి రూ 10 వేలు చొప్పున రూ 20 వేలు క్రికెట్ కిట్టు కొనుగోలు కోసం చెక్కు అందజేశారు. యువత శక్తివంతంగా ఎదగాలి, యువతతోనే దేశంలో మార్పు సాధ్యం అని ఆయన వెల్లడించారు. యువత క్రీడారంగం, రాజకీయ రంగమే కాక అన్ని రంగాలలోనూ రాణించి శక్తివంతంగా ఎదిగి దేశ అభ్యున్నతి కోసం పాటుపడాలని అన్నారు. వీరబల్లి మండలానికి చెందిన ఈడిగ పల్లె, వడ్డిపల్లె గ్రామాల యువకుల కోరిక మేరకు క్రికెట్ కిట్టు కొనుగోలు కోసం చెక్కు అందజేశారు.
అనంతరం జనసేన పార్టీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ మాట్లాడుతూ, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రీడలు, చదువు పట్ల మక్కువ పెంచుకొని, ప్రతి దినము వ్యాయామం చేస్తూ శరీరాన్ని ఆరోగ్యంగా, సౌష్టవంగా ఉంచుకోవాలని సూచించారు. యువత మంచిగా ఉంటే దేశం బాగుపడుతుందని ఆయన తెలిపారు.
ఎన్నికల వేళ నేతలు వెదజల్లే డబ్బులు కోసం ఆశ పడకుండా, మీ భవిష్యత్తు బాగుండాలి అంటే వచ్చిన నాయకులను, అధికారులను రోడ్లు, పారిశుద్ధ్యం, మంచినీటి వసతి వంటి అభివృద్ధి పనుల కోసం అధికారులను, నేతలను నిలదీయాలని అన్నారు. గ్రామ గ్రామాన ఇందుకోసం యువత నడుం బిగించాలని, అప్పుడే దేశం సమగ్రాభివృద్ధి చెందుతుందని తెలిపారు. రానున్న ఎన్నికలలో టిడిపి, జనసేన కూటమిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జనసేన చేనేత వికాస రాష్ట్ర కార్యదర్శి రాటాల రామయ్య, శ్రీనివాసులు, చౌడయ్య, కొత్తూరు వీరయ్య ఆచారి,కత్తి సుబ్బరాయుడు, పోలిశెట్టి రజిత, శిరీష, వీరబల్లి మండలం వడ్డీ పల్లె క్రికెట్ జట్టు కెప్టెన్ బాలచంద్ర, ఈడిగపల్లె జట్టు కెప్టెన్ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
తిరుపతి ఇళ్ల స్థలాలు కేటాయింపు సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి టిటిడి చైర్మన్ గారు మాట్లాడుతూ సరిగ్గా 17 ఏళ్ల క్రితం దివంగత వైఎస్. రాజశేఖర్ రెడ్డి హయాంలో టిటిడి ఉద్యోగులకు ఇళ్ళ స్థలాలు కేటయింపు చేశాం. కార్మిక పక్ష పాతిగా, ఉద్యోగ పక్ష పాతి గా మేము ఉన్నాము, ప్రతి ఒక్క ఉద్యోగికి ఇళ్ళ స్థలాలు కేటాయింపు చేయాలి అని సీఎం జగన్ అన్నారు అన్నట్టుగానే ఇళ్ళ స్థలాలు కేటాయింపు చేశాం. నాకు అత్యంత ఇష్టమైన పని టిటిడి ఉద్యోగులకు ఇళ్లు పట్టాలు ఇవ్వడం, సంతోషం గా ఉంది అని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు అని తెలిపారు. రిటైర్డ్ ఉద్యోగులకు ఇళ్ళ స్థలాలు కేటాయింపు చేయాలని సీఎం చెప్పారు, మొత్తం ఏడు వందల ఎకరాలు పై చిలుకు టిటిడి ఉద్యోగులకు కేటాయింపు చేశారు సీఎం జగన్ మోహన్ రెడ్డి, వీటికి 80 కోట్లు కేటాయింపు చేశారు. విమర్శలు చేస్తున్నా మమ్మల్ని పడదోయాలనీ కుట్రలు చేసినా మేము కార్మికులు, అణగారిన వర్గాల ప్రజలకు అండగా ఉంటాం. బాధ్యతతో చేసిన పనే తప్ప , వేరే ఉద్దేశ్యం లేదు. శ్రామిక వర్గం పక్షాన నిలబడి ఈరోజు ఇళ్లు స్థలాలు కేటాయింపు చేశారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. పోటు కార్మికులకు 10వేలు జీతం పెంచాం, వాహన బేరర్లు ను స్కిల్డ్ లేబర్ గా గుర్తింపు చేశాం. 415 ఎకరాలు పాధిరేడు అరణ్యం వద్ద టిటిడి ఉధ్యోగులకు ఇళ్ళ స్థలాలు కేటాయింపు. ఏర్పేడు వద్ద 350 రిటైర్డ్ ఉద్యోగులకు ఇళ్ళ స్థలాలు కేటాయింపు.






Total views : 90145