అల్లూరి సీతారామరాజు జిల్లా, వైసీపీ అరకులోయ నియోజకవర్గం సమన్వయకర్తగా ప్రస్తుత అరకు ఎంపీ గొడ్డేటి మాధవిని నియమించడంతో అరకులోయ లో వైసీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు. ఎంపీ మాధవి బిసి కి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుందని, ఎస్టి కాదని, ఎస్టీకి చెందిన స్థానికేతరుడు కు అరకు అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని వైసీపీ శ్రేణులు ర్యాలీ, మానవహారం.
international news
శ్రీకాకుళం జిల్లా, నిజం గెలవాలి పేరుతో నేడు శ్రీకాకుళం, మన్యం జిల్లాల లో పర్యటించనున్న నారా భువనేశ్వరి. చంద్రబాబు నాయుడు అరెస్ట్ తో మనస్థాపానికి గురై మృతి చెందిన కుటుంబాలను పరామర్శించనున్న భువనేశ్వరి. రాజాం జి.ఎం.ఆర్ గెస్ట్ హౌస్ నుండి బయలుదేరి శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం దవలపేట గ్రామానికి చేరుకొని మృతి చెందిన కంచరాన అసిరినాయుడు కుటుంబాన్ని పరామర్శించనున్న భువనేశ్వరి. అనంతరం అక్కడ నుండి మన్యం జిల్లా
భామిని మండలం బిల్లమడ గ్రామానికి చేరుకొని బిల్లమడ గ్రామంలో మృతి చెందిన బర్రి విశ్వనాథం కుటుంబాన్ని పరామర్శ. అనంతరం శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గం బూర్జ మండలం తోటాడ గ్రామం చేరుకొని తోటాడ గ్రామంలో గేదెల సాంబమూర్తి కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఆమదాలవలస మండలం దన్నానపేట గ్రామంలో మృతి చెందిన గొర్లె తిరుపతిరావు కుటంబాన్ని పరామర్శిస్తారు. ఆమదాలవలస మండలం పాత నిమ్మతొర్లాడ గ్రామం చేరుకొని ఆగ్రామంలో మృతి చెందిన ఆకేటి పాపయ్య కుటుంబాన్ని పరామర్శిస్తారు.
పుదుచ్చేరి యానాం నుండి అనధికారికంగా ప్రత్యేకంగా తయారుచేసిన ట్యాంకర్ ద్వారా డీజిల్ తరలించి ఆంధ్ర ప్రాంతంలో అమ్మకాలు సాగిస్తున్న ముఠా ను ముమ్మిడివరం పోలీసులు పట్టుకున్నారు. యానాం కు ఆంద్రా ప్రాంతానికి లీటర్ డీజిల్ కు రూ.12 రూపాయలు వరకూ వ్యత్యాసం ఉండటంతో ఈ అక్రమరవాణా చేసి అమ్మకాలు సాగిస్తున్నట్లు సమాచారం. యానాం నుండి ఆత్రేయపురం తరలిస్తున్నట్లుగా అందిన సమాచారం తో ట్రయినీ డిఎస్పీ విష్ణు స్వరూప్ ఆధ్వర్యంలో పోలీసులు ట్యాంకర్ డ్రైవర్ తో పాటు అందులో ఉన్న మరొక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సివిల్ సప్లయి అధికారులను రప్పించి వారి సహకారంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ట్యాంకర్ లో సుమారు 3వేల లీటర్ల డీజిల్ ఉన్నట్లు సమాచారం.
మల్లంపేట ,ఇందిరమ్మ కాలనీలో ఉంటున్న ఇంతియాజ్ మహమ్మద్, రూబీనా బానో(30) భార్యాభర్తలు. ముగ్గురు పిల్లలు కుమార్తె ఆల్సిత, కుమారులు సూఫీయాన్, అనాష్ ఈ నెల 2న భర్త ఇంటికి వచ్చి చూడగా భార్య పిల్లలు కనబడుట లేదని ఫిర్యాదు. తాను ఉదయం 10 గంటలకు పనిమీద మియాపూర్ కు వెళ్లి సాయంత్రం 5 గంటలకు భార్యకు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ అని వచ్చింది, సాయంత్రం 7 గంటలకు ఇంటికి వచ్చిన అతనికి భార్యా పిల్లలు ఇంట్లో కనిపించకపోవడంతో ఆందోళన చెంది పోలీసులను ఆశ్రయించిన భర్త. ఈ రోజు దుండిగల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన భర్త ఇంతియాజ్ మహ్మద్. ఫిర్యాదు స్వీకరించిన దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మెగా డీఎస్సీ విడుదల చేయాలంటూ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ క్యాంపు కార్యాలయం ముట్టడించిన యువకులు. భారీగా ట్రాఫిక్ జామ్. ఆందోళన చేస్తున్న యువకుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు. కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి. అరెస్ట్ చేసిన యువకుల్ని పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు. ప్రభుత్వం తమ జీవితాలతో ఆడుకుంటుంది అని సరైన బుద్ధి చెబుతామని యువకులు అన్నారు. దాదాపు 100 మందికి పైగా యువకులు ఒక్కసారిగా బొత్స క్యాంపు కార్యాలయం చేరుకున్నారు. మెగా డీఎస్సీ తో పాటు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలంటూ డిమాండ్. సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించిన యువజన సంఘం నాయకులు.
అనకాపల్లి జిల్లాలో మందు తాగి రెచ్చిపోయిన విద్యార్థులు. బాలుర వసతి గృహంలో వెలుగులోకి 7వ తరగతి విద్యార్థుల బాగోతం. చోడవరం బిసి బాలుర వసతి గృహంలో మితి మీరిన న్యూ ఇయర్ సెలబ్రేషన్. మద్యం మత్తులో చిందులేసిన మైనర్ విద్యార్థులు. మందలించిన హాస్టల్ ముందు ఉంటున్న AC మెకానిక్. తప్పు అని మందలించిన వ్యక్తిపై విద్యార్థులు మూకుమ్మడి దాడి. పత్తాలేని హాస్టల్ వార్డెన్. చోద్యం చూస్తున్న చోడవరం పోలీసులు.
అన్నమయ్య జిల్లా రాయచోట, తెదేపా తీర్థం పుచ్చుకోనున్న మాజీ ఎమ్మెల్యే ద్వారక నాథ్ రెడ్డి. వైసీపీ రాజ్యసభ సభ్యుడి స్వయానా బావమరిది ద్వారక నాథ్ రెడ్డి. ఆయన తండ్రి అయినా రామ సుబ్బారెడ్డి 1978 కాంగ్రెస్ పార్టీ తరపున లక్కిరెడ్డీ పల్లి ఎమ్మెల్యే గా గెలుపొందారు. ద్వారక నాథ్ రెడ్డి 1994 లో లక్కిరెడ్డిపల్లి నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999లో తెదేపా తరపున టికెట్ ఇవ్వకపోవడంతో అప్పట్లో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. 2009 లో టికెట్ కోసం ప్రయత్నం చేసినప్పటికీ టికెట్ మాత్రం దక్కలేదు. వైసీపీ ఆవిర్భావం తర్వాత 2014 వైసీపీ తరపున టికెట్ ఆశించారు. 2019 లో వైసీపీ, తేదేపా టికెట్ ఆశించినప్పటికీ టికెట్ మాత్రం దక్కలేదు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్న ద్వారకా నాథ్ రెడ్డి. గత కొన్ని రోజులుగా తెదేపా టికెట్ ఆశిస్తూ పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉన్నారు. ఈ రోజు విజయవాడ కేంద్రంగా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరగనున్న భారీ బహిరంగ సభలో తారకరత్న అత్త ,అలేఖ్య రెడ్డి అమ్మ,ద్వారక నాథ్ రెడ్డి అక్క హరమ్మ సమక్షంలో పసుపు కండువా వేసుకొనున్నట్లు ఆయన అనుచరవర్గం వెల్లడించారు.
తూర్పు నియోజకవర్గ అభ్యర్థిగా ఎన్నికైన నూరి ఫాతిమా మాట్లాడుతూ. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు. నా పై నమ్మకంతో తూర్పు నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో అవకాశం కల్పించిన జగన్ మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. గుంటూరు 1 టౌన్ లో మైనార్టీ మహిళకు అవకాశం ఇవ్వడం జరిగింది. జగనన్న నా పై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చెయ్యకుండా గుంటూరు 1 టౌన్ లో భారీ మెజారిటీతో గెలుపొంది జగనన్నకు గిఫ్ట్ గా అందిస్తాను. ప్రజలకోసం నిరంతరం కష్ట పడతాను. మా నాన్నగారు ఎలా అయితే ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉన్నారో అదే విధంగా ప్రజలకు చేరువలో ఉంటాను.
వైస్సార్ జెండా రెపరెపలాడేలా కృషి చేస్తాను. నన్ను ఈ స్థానంలో నిల్చోబెట్టిన వైసీపీ అధిష్టానం కు తూర్పు కార్యకర్తలుకు, నాయకులకు ధన్యవాదాలు.
అనకాపల్లి జిల్లా, పాయకరావుపేట ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ ను ముట్టడించిన ప్రజలు. పని చేయాలంటే లంచం అడుగుతున్న ఎలక్ట్రికల్ ఏ.ఈ. ఎం.నాగేశ్వరరావు. వినియోగదారుల నుండి అధిక మొత్తంలో లంచం డిమాండ్ చేస్తున్న ఏ.ఈ. మీటర్ గురించి అప్లై చేసిన వినియోగదారుడు ను 40వేలు రూపాయలు లంచం డిమాండ్ చేశాడంటూ ప్రజల ఆరోపణ. ఎక్కడికి వెళ్లినా నన్ను ఏమి చేయలేరని ఏ.ఈ. నాగేశ్వరరావు ధైర్యం. సబ్ స్టేషన్ ముందు రోడ్డుపై బైఠాయించి, స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన ప్రజలు.
జగ్గయ్యపేట జాతీయ రహదారి భీమవరం టోల్ ప్లాజా వద్ద అంగన్వాడీలను అడ్డుకుంటున్న పోలీసులు. విజయవాడ కలెక్టరేట్ వద్ద బైటాయింపు కార్యక్రమానికి వెళ్తున్న అంగన్వాడి మహిళలను నిలిపివేస్తున్న పోలీసులు. మా హక్కుల సాధన కోసo వెళ్తుంటే ఆపడం ఏంటని అడుగుతున్న అంగన్ వాడీలు. మహిళలని చూడకుండా పోలీసులు అసభ్యంగా మాట్లాడుతున్నారని అంగన్వాడి సభ్యులు మండిపడుతున్నారు.





Total views : 90703