డా.బి.ఆర్.అంభేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం 3వ రోజుకు చేరుకున్న మున్సిపల్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులు సమ్మె. సమ్మెలో భాగంగా చెవులో పువ్వులు పెట్టుకుని నిరశన తెలిపిన ఉద్యోగులు, కార్మికులు. సంఘీభావం తెలిపిన టిడిపి ముమ్మిడివరం ఇంచార్జీ దాట్ల బుచ్చిబాబు,మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, నాయకులు. అన్ని వర్గాలను ఇబ్బంది పెడుతున్న జగన్ పాలన. పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని అంగన్వాడీలు, ఉద్యోగులు, కార్మికులు కోరుతున్న న్యాయమైన డిమాండ్ ను కూడా పట్టించుకోక పోవడం జగన్ నిరంకుశ పాలనకు అద్దం పడుతుంది అని దాట్ల బుచ్చిబాబు అన్నారు.
international news
వరంగల్, అభయ హస్తం అప్లికేషన్ ఫామ్ లను కొందరు దళారులు ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని 50 నుంచి 100 రూపాయలకు అమ్ముతున్నారు. ప్రతి కౌంటర్ వద్ద ఇలా జరుగుతుంది. పట్టించుకునే వారు లేకపోవడంత పేద ప్రజలు తప్పదని కొంటున్నారు. ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న అప్లికేషన్ ఫామ్లను కూడా కొందరు జిరాక్స్ సెంటర్లు దళారులు ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని పెద్ద ఎత్తున అమ్మకాలు చేపట్టారు.
గుంటూరు పట్టణంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభం చేసిన మంత్రి రజినీ. ఈ సందర్భంగా ఆవిడ మాట్లాడుతూ గ్రామీణ యువత లోని ప్రతిభ ను వెలికి తీయడానికి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం వారికి ఎంతో తోడ్పాటు ఇస్తుంది అని అన్నారు. యువతను ఉత్తేజ పరచడానికి షటిల్ అడిన మంత్రి విడుదల రజినీ, ఎమ్మెల్యే మద్దాల గిరి. అందరూ క్రీడల వైపు దృష్టి సారించాలి. ప్రభుత్వం ఐదు రకాల క్రీడలను ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా ప్రవేశ పెట్టారు. క్రీడాకారులకు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి గుర్తింపు వస్తుంది. క్రీడల వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. దేశంలో ఎక్కడ లేని విధంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి ఓ గొప్ప కార్యక్రమం రూపకల్పన చేశారు.
పల్నాడు జిల్లా, దాచేపల్లిలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి నిర్వహించే ఆత్మీయ సమావేశం అర్ధాంతరంగా నిలిచింది. వైసిపి అధిష్టానం పిలుపు వచ్చిందంటూ చెప్పి సమావేశం నుండి వెళ్లిపోయిన ఎమ్మెల్సీ కృష్ణమూర్తి. గురజాల నియోజకవర్గంలో జంగా కృష్ణమూర్తి జోరుగా పర్యటన. ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి
ఫిర్యాదు మేరకు జంగాకు అధిష్టానం నుండి పిలుపు అంటూ ప్రచారం. అధిష్టానం రమ్మని పిలుపునిచ్చిందని స్వయంగా చెప్పి సమావేశం నుంచి వెళ్ళిపోయిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి.
ఐదు డివిజన్లను గెలుచుకుని గుర్తింపు సంఘంగా విజయం సాధించిన AITUC. ఆరు డివిజన్లలో విజయం సాధించి ప్రాతినిధ్య సంఘంగా రెండవ స్థానంలో నిలిచిన INTUC. బెల్లంపల్లి ,మందమర్రి,శ్రీరాంపూర్, రామగుండం-1, రామగుండం-2 డివిజన్లలో AITUC విజయం. కార్పొరేట్, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లందు, భూపాలపల్లి, రామగుండం-3 డివిజన్లలో గెలుపొందిన INTUC. సంస్థ వ్యాప్తంగా 1999 ఓట్ల ఆదిక్యంతో INTUC పై విజయం సాధించిన AITUC. సింగరేణి సంస్థలో 4 వ సారి గుర్తింపు సంఘంగా ఎన్నికైన AITUC .
తెలంగాణాలో మంచు కవ్విస్తుంది, మరో కాశ్మీర్ ను తలపిస్తున్న దృశ్యాలు. తెల్లవారు జామునుండి పొగమంచుతో కమ్ముకుంది సూర్యుడు కూడా పొగ మంచు కారణంగా కాంతిని ప్రసరించ లేక పోతున్నాడు. ఆసిఫాబాద్ కుమురం భీమ్ జిల్లాలో మారుమూల ప్రాంతాలు అడవికి ఆనుకోని ఉన్నందున విపరీతమైన చలితో పాటు పొగమంచు ఈప్రాంతాన్ని చుట్టేసింది ప్రకృతి సోయగం కనువిందు చేస్తూ ఆహ్లాదాన్ని పంచుతున్నాయి కాశ్మీర్ ను తలపిస్తున్న తెలంగాణ ప్రకృతి ని ఆస్వాదిస్తున్నారు ప్రకృతి ప్రేమికులు ఒక పక్క మంచు దుప్పటి మరో పక్క చలి తీవ్రతతో చైల్డ్ అవుతున్నారు జిల్లా ప్రజలు పట్టణాలు, రోడ్ల పై మంచు కమ్ముకుంది.
హనుమకొండ జిల్లా లో గ్రేటర్ వరంగల్ 5వ డివిజన్ కొత్తూరు సగర కమ్యూనిటీ హాల్లో ప్రజా పాలన అభయ హస్తం గ్యారంటీల దరఖాస్తుల ను ప్రారంభించిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందరెడ్డి. పాల్గొన్న అడిషనల్ కలెక్టర్ మహేందర్ జి, బల్దియా కమిషనర్ షేక్ రిజ్వాన్ భాష, జిల్లా నోడల్ అధికారులు, స్థానిక కార్పొరేటర్ శ్రీమన్, వరంగల్ పశ్చిమ ఎమ్యెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కొత్త పింఛన్లు రేషన్ కార్డులు ఇవ్వకుండా ప్రజలను ఇబ్బంది పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తప్పకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తాం. నేటి నుంచి జనవరి 6వ తేదీ వరకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రతి డివిజన్ లో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసాం. అధికారుల ఆఫీసుల చుట్టూ తిరగవలసిన అవసరం లేదు. ప్రజల వద్దకే పాలన వస్తుంది అని అన్నారు.




Total views : 90114