ప్రకృతి వ్యవసాయాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంతగానో ప్రోత్సహిస్తోందని వైకాపా రాయచోటి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి అన్నారు.రైౖతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో విస్తృతంగా. సమర్థవంతంగా ప్రకతి సూత్రాలకు అనుగుణంగా అమలవుతున్న ప్రకతి వ్యవసాయ పంటల పరిశీలనలో భాగంగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్తల బృందం వచ్చారు. లావోస్ ,పీడీఆర్, భారత్, కెన్యా, జింబాబ్వే, సెనెగల్, బుర్కినా ఫావో, ట్యునీషియా, పెరూ దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు, పరిశోధకులు ద్వైవార్షిక విరామం, ప్రతిబింబంలో భాగంగా చిన్నమండెం సమీపంలో ఏపీసీఎన్ఎస్ ప్రాజెక్టు ద్వారా అమలవుతున్న ప్రకతి వ్యవసాయ కార్యక్రమాలను అర్ధం చేసుకోవడానికి సందర్శించారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సిరాడ్, వరల్డ్ ఫిష్,అలయన్స్, బయోడైవర్శిటీ, ఒఈపి, ఇనేరా సంస్థల ప్రతినిధులు ఈ బృందంలో వున్నారు. సేంద్రీయ పంటలను అంతర్జాతీయ బృందంతో కలసి ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి, జెడ్ పి మాజీ వైస్ చైర్మన్ దేవనాధ రెడ్డి లు పరిశీలించారు.ఈ సందర్భంగా అంతర్జాతీయ బృందంతో శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ. ప్రకృతి వ్యవసాయం, రసాయన వ్యవసాయాల మధ్య తేడాలను ఆయన వివరించారు. ఈ ప్రాంతంలో పరిశ్రమలు లేవని , వ్యవసాయం పైనే తొంబై ఐదు శాతం మంది జీవిస్తున్నారన్నారు. వర్షాభావ పరిస్థితులవల్ల కరవు పరిస్తితులు నెలకొన్నాయని, భూగర్భ జలాలు అడుగంటి పోయాయని ,ఆరు వందలు, ఏడు వందల అడుగుల లోతు వరకు బోర్లు వేస్తున్నా నీరు పడడం లేదన్నారు. జగన్ ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్ కు 80 నుంచి 90 శాతం వరకు సబ్సిడీ అందిస్తోందన్నారు. ప్రకృతి వ్యవసాయం లో తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందవచ్చునన్నారు. తక్కువ విస్తీర్ణపు పొలంలో ఎక్కువ పంటలను పండించవచ్చునన్నారు.ఈ పద్ధతుల ద్వారా పండించిన పంటలకు మార్కెట్ లో డిమాండ్ ఎక్కువగా ఉందన్నారు. రసాయనక పద్ధతులతో సాగుచేసిన పంటల వాడకం వల్ల క్యాన్సర్, కిడ్నీ తదితర ప్రమాదకర జబ్బులు సోకుతున్నాయన్నారు.ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం వారు కూడా సేంద్రీయ వ్యవసాయం ద్వారా పండిన ఆహార ఉత్పత్తులును వినియోగిస్తున్నారన్నారు.జగన్ ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల మహిళలకు విస్తారంగా రుణాలను అందిస్తోందని, తద్వారా మహిళలు ఆ రుణాలతో వ్యవసాయ పంటలకు పెట్టుబడిగా పెడుతున్నారన్నారు.ఏ టి ఎం మోడల్ ను శాస్త్రవేత్తల బృందం పరిశీలించింది. జెడ్ పి మాజీ వైస్ చైర్మన్ దేవనాధ రెడ్డి మాట్లాడుతూ.. ప్రకృతి వ్యవసాయపంటల వాడకం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతోందన్నారు. తమ ప్రాంతంలో ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగవుతున్న పంటలను పరిశీలించడానికి వచ్చిన అంతర్జాతీయ బృందానికి శ్రీకాంత్ రెడ్డి, దేవనాథరెడ్డి లు అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రైతు సాధికారిక సంస్థ అధికారులు చంద్రశేఖర్, టీం లీడర్ ధర్మేంద్ర,జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ రామకృష్ణమ రాజు, అడిషనల్ ప్రాజెజ్ట్ మేనేజర్ యశోదమ్మలతో పాటు ప్రకృతి వ్యవసాయ శాఖాధికారులు పాల్గొన్నారు.
jagan
బడుగు బలహీన వర్గాల అభివృద్ధే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్యేయమని కృష్ణా జిల్లా అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు స్పష్టం చేశారు. చల్లపల్లి మండలంలోని నాలుగు లంక గ్రామాల రైతులకు లీజు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, బందరు ఆర్డీవో ఎం.వాణి హాజరయ్యారు. లంక భూములు సాగు చేసుకుని జీవిస్తున్న నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులకు మేలు కలిగేలా లీజ్ ను రెన్యూవల్ చేశామని సభాముఖంగా ఎమ్మెల్యే తెలిపారు. అర్హత కలిగిన 838 మంది లంక భూముల రైతులకు 760 ఎకరాల లీజు పట్టాలు పంపిణీ చేశారు. చల్లపల్లి మండలంలోని పాగోలు, మాజేరుల్లో 158 మందికి అసైన్డ్ భూములు, 39 ఎకరాలను 22ఏ నుంచి తొలగించి ధృవీకరణ పత్రాలు సింహాద్రి రమేష్ బాబు పంపిణీ చేశారు.
విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్ లో జరిగిన అగ్నిప్రమాద బాధితులకు మంత్రి అప్పలరాజు బాధితులకు నష్టపరిహారాన్ని అందజేశారు. ఈ ప్రమాదంలో హార్బర్ లోని 30 బోట్లు మంటల్లో కాలిపోయాయి. మరో 18 బోట్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. తీవ్రంగా నష్టపోయిన మత్స్యకారుల కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. రెండు రోజుల వ్యవధిలోనే జిల్లా కలెక్టర్ ఖాతాకు నిధులు జమచేశారు. ఈ మొత్తాన్ని మంత్రి అప్పలరాజు బాధితులకు అందజేశారు. కాలిపోయిన బోట్ల విలువలో 80 శాతం పరిహారంగా మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి అప్పలరాజు మాట్లాడుతూ విశాఖ హార్బర్ ప్రమాదానికి రాజకీయ రంగు పులిమే ప్రయత్నం జరిగిందని మండిపడ్డారు. సీఎం జగన్ ఎలాంటి వివక్ష చూపకుండా పరిహారాన్ని అందజేశారన్నారు.
ఏపీ సీఎం జగన్ గొప్ప మానవతావాది అని వైసీపీ రాజ్యసభ సభ్యుడు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కొనియాడారు. జగన్ తీసుకున్న కుల గణన నిర్ణయం చాలా గొప్పదని అన్నారు. కుల గణన వల్ల రాబోయే రోజుల్లో బీసీలకు మరింత సంక్షేమం అందుతుందని చెప్పారు. జగన్ నిర్ణయాలను దేశ వ్యాప్తంగా మెచ్చుకుంటున్నారని…చరిత్రలో జగన్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. పేదరికంలో ఉన్నవారు కూడా జగన్ పాలనలో డాక్టర్లు, ఇంజనీర్లు అవుతున్నారని చెప్పారు. విద్యారంగంలో జగన్ తీసుకొచ్చిన సంస్కరణలతో విద్యార్థుల జీవితాలు మారిపోతున్నాయని అన్నారు. విదేశాల్లో ఎక్కడ చూసినా మనవాళ్లే కనిపిస్తున్నారని చెప్పారు. బీసీలను చంద్రబాబు ఓటు బ్యాంకుగా వాడుకున్నారని .. తమకు సరైన పదవులు ఇవ్వకుండా అగౌరవ పరిచారని విమర్శించారు.
సీఎం జగన్ తీసుకున్న కుల గణన నిర్ణయం హర్షణీయం అని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య అన్నారు. బుధవారం ఆయన తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ, దేశమంతా సీఎం జగన్ నిర్ణయాలను మెచ్చుకుంటున్నారని, రానున్న రోజుల్లో ఇంకా మరింత సంక్షేమం బీసీలకు అందుతుందన్నారు. లోటు బడ్జెట్లో ఉన్నా మెరుగైన సంక్షేమం అందిస్తున్నది జగన్ మాత్రమేనని అన్నారు. కులాల లెక్కలు తీయటం వలన రిజర్వేషన్లు పెరుగుతాయన్నారు. పదవులు ఇంకా పెరుగుతాయన్నారు. బీసీల నాయకత్వం జగన్ హయాంలో బాగా పెరిగిందని చెప్పారు. కులాల లెక్కలు తీయటానికి పాలకులు భయపడతారన్నారు. బస్సుయాత్రలకు జనం నుండి విశేష స్పందన లభిస్తోంది. బీసీల అభ్యున్నతికి జగన్ చేస్తున్న సహాయం మరువలేనిది అంటూ కృష్ణయ్య కొనియాడారు.
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిపై మాజీ మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. పురందేశ్వరి లాంటి కూతురు ప్రపంచంలో ఎవరికి ఉండకూడదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బెయిల్ కోసమే చంద్రబాబు గుండెకు బొక్క పడిందంటూ నాటకాలు ఆడుతున్నాడని కొడాలి ఎద్దేవా చేశారు. తండ్రి మరణానికి కారణమైన పురందేశ్వరి ఇప్పుడు టీడీపీకి బీ టీమ్ గా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు పాలనలో జరిగిన ప్రతి అవినీతిలో పురింధేశ్వరికి వాటాలు అందాయి. అప్పుడు నోరు మూసుకున్నపురందేశ్వరి జగన్మోహన్ రెడ్డి ఇసుక దోపిడీ అంటూ మాట్లాడుతుంది. వైసీపీ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడితే ఖబర్దార్ అంటూ కొడాలి నాని హెచ్చరించారు.
Read Also..
Read Also..
ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో సీఎం జగన్ ప్రవేశపెట్టిన కొత్త పథకం జగనన్న దోపిడీ గ్యారెంటీ స్కీమ్ అని అన్నారు. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్. రాష్ట్ర ప్రజల భవిష్యత్కు ఒక గ్యారెంటీని అందించే నాయకుడు చంద్రబాబు నాయుడు అయితే రాష్ట్ర సంపద దోపిడీకి గ్యారెంటీనిచ్చే పెత్తందారు జగన్ అని విమర్శించారు. జగనన్న దోపిడీ గ్యారెంటీ పథకంలో తనకు నచ్చిన కాంట్రాక్ట్ సంస్థలు, వ్యక్తులకు ప్రజల సొమ్ము దోచిపెట్టడానికి వీలుగా సీఎం గ్యారెంటీ లెటర్స్ ఇస్తున్నారన్నారు. మెగా ఇంజనీరింగ్ సంస్థకు జగన్ సర్కార్ ఇప్పటికే 255 కోట్ల రూపాయల చెల్లింపులకు సంబంధించి 7 గ్యారెంటీ లెటర్స్ మంజూరు చేసిందన్నారు. అయినవారికి దోచిపెట్టేందుకు రూల్స్కు విరుద్ధంగా గ్యారెంటీ లేఖలు ఇస్తున్న జగన్ సర్కార్. ప్రజాశ్రేయస్సుతో ముడిపడి ఉన్న అనేక పథకాలు. పనులకు మాత్రం వేలకోట్లు బకాయిపెట్టి, రాష్ట్రాభివృద్ధిని, సంక్షేమాన్ని గాలికొదిలేసిందని పట్టాభిరామ్ తీవ్రస్థాయిలో విమర్శించారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట లో ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా ఈ నెల 21న సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేసారు.ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మాట్లాడుతూ అర్హులైన మత్స్యకారులకు సీఎం చేతులు మీదుగా సంక్షేమ పథకాలు అందజేస్తామన్నారు. మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ మత్స్యకారుల భవిష్యత్ కు భరోసాగా సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన ఉందన్నారు. పులికాట్ ముఖద్వారం పూడికతీత కు 142 కోట్లు ఖర్చుచేసామన్నారు. మత్స్యకారుల ఆరాధ్యదైవం మన సీఎం జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. 21న జరిగే సభలో నాయకులు కార్యకర్తలు పాల్గొనాలని పిలుపు నిచ్చారు.
Read Also…
నేడు సీఎం వైఎస్ జగన్ ఏలూరు జిల్లా నూజివీడులో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో 2003 కు మందు అసైన్మెంట్ భూములకు హక్కు కల్పించడం, కొత్త అసైన్మెంట్ భూములకు పట్టాల పంపిణీ కార్యక్రమంలో 27.41 లక్షల ఎకరాలపై పేదలకు యాజమాన్య హక్కులు ఇవ్వనున్నారు. నిరుపేదలకు కొత్తగా 46 వేల ఎకరాల పంపిణీ జరుగనుంది. అనంతరం నూజివీడులో బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం తాడేపల్లికి తిరుగు ప్రయాణం రానున్నారు.
Read Also..
Read Also..
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విమర్శలు గుప్పించారు. వై ఏపీ హేట్స్ జగన్ అంటూ ఓ పోస్టర్ ను మీడియాలో ఆయన పోస్ట్ చేశారు. అందులో రాష్ర్ట ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావించారు. నాలుగేళ్ల ఎనిమిది నెలల కాలంలో జగన్ ఘన కార్యాలకు ఈ ఒక్క చిత్రం సరిపోతుందన్నారు. ప్రజలు ఏపీ హేట్స్ జగన్, వద్దు.. వద్దు.. ఈ జగన్, మళ్లీ మాకొద్దు ఈ జగన్ అని ఎందుకంటున్నారో ఇప్పటికైనా అర్థమైందా జగన్ అంటూ ప్రశ్నించారు. వైసీపీ నేతలు ఏపీకి జగనే ఎందుకు కావాలని ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో దానికి సెటైరికల్ గా గంటా శ్రీనివాసరావు ఈ పోస్టర్ ను ట్విటర్ లో షేర్ చేశారు.





Total views : 90068