నేడు సీఎం వైఎస్ జగన్ ఏలూరు జిల్లా నూజివీడులో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో 2003 కు మందు అసైన్మెంట్ భూములకు హక్కు కల్పించడం, కొత్త అసైన్మెంట్ భూములకు పట్టాల పంపిణీ కార్యక్రమంలో 27.41 లక్షల ఎకరాలపై పేదలకు యాజమాన్య హక్కులు ఇవ్వనున్నారు. నిరుపేదలకు కొత్తగా 46 వేల ఎకరాల పంపిణీ జరుగనుంది. అనంతరం నూజివీడులో బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం తాడేపల్లికి తిరుగు ప్రయాణం రానున్నారు.