కుప్పం నియోజకవర్గ టీడీపీ, జనసేన ఆత్మీయ సమావేశం కుప్పం టీడీపీ పార్టీ కార్యాలయం లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ mlc కంచెర్ల శ్రీకాంత్, జనసేన ముఖ్య నాయకుడు పసుపులేటి హరి ప్రసాద్ తో పాటు నియోజకవర్గం లోని టీడీపీ జనసేన ముఖ్యనాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకుడు హరిప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రం ని జగన్ సర్వనాశం చేసాడని, అక్రమాలకు రాష్ట్రాన్ని అడ్డాగా చెసారని రాబోయే ఎన్నికల్లో కలిసికట్టుగా జగన్ ని గద్దె దించెందుకు పనిచేయాలని అన్నారు. జగన్ మూడు అంశాలను తన ఆయుధంగా పెట్టుకొన్నాడని దౌర్జన్యం, డబ్బు, దొంగ ఓట్లు లనే ఆయుదాలుగా మలుచుకున్నాడని రాబోయే ఎన్నికల్లో అన్నిటిని తిప్పికొట్టెందుకు సిద్ధంగా ఉండాలని ఉమ్మడిగా పిలుపు నిచ్చారు. టీడీపీ mlc కంచెర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ చంద్రబాబు దురదృష్టి ప్రతి ఒక్కరికి తెలుసనీ ముక్కుసూటిగా ఉన్న జనసేన అధినేత పవన్కళ్యాణ్ చంద్రబాబు తో కలిసి నడవడానికి ముందుకు రావడం రాష్ట్రానికి శుభసుచకమని అన్నారు. రాష్ట్రాన్ని రావణకష్టంగా మార్చిన జగన్ కి రాబోయే ఎన్నికల్లో టీడీపీ ,జనసేన కచ్చితంగా కోలుకోలేని దెబ్బకొట్టి తమ సత్తా చాటుతాం అని అన్నారు. ఇక మీదట ప్రతి సమావేశంలో కూడా కలిసి చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని అని అన్నాను
Janasena
విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామంలో తెలుగుదేశం జనసేన పార్టీలు సంయుక్తంగా గన్నవరం నియోజకవర్గ ఇన్చార్జ్ లు తెలుగుదేశం పార్టీ యార్లగడ్డ వెంకట్రావు జనసేన పార్టీ చలమలశెట్టి రమేష్ బాబు ఆధ్వర్యంలో తెలుగుదేశం జనసేన రాష్ట్ర పార్టీ ల ఆదేశాల మేరకు వైసీపీ ప్రభుత్వంలో రోడ్ల పరిస్థితిని ప్రజలు పడుతున్న దుస్థితిని ఎండగడుతూ నిరసన కార్యక్రమం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం లోని తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలు భారీగా చేరుకున్నారు, నున్న గ్రామం నుంచి సూరంపల్లి వెళ్లే రహదారి దుస్థితిని వివరిస్తూ ప్రజలు పడుతున్న ఇబ్బందులు గురించి వైసిపి ప్రభుత్వం అరాచక పాలన గురించి విమర్శలు గుప్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం రాష్ట్ర నాయకులు గుజ్జర్లపూడి బాబురావు, విజయవాడ రూరల్ మండలం తెలుగుదేశం అధ్యక్షులు కొల్లా ఆనంద్, గొడ్డళ్ళా చిన్నారావు, జనసేన జిల్లా కార్యదర్శి పొదిలి దుర్గారావు నియోజవర్గ జనసేన మహిళ నాయకురాలు మేకల స్వాతి, తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
యావత్తు ప్రపంచం ఈరోజు కోసం ఎంతో ఆసక్తిగా ఉంది. ముఖ్యంగా క్రికెట్ క్రీడాకారులు పెద్ద పండుగగా అభివర్ణిస్తున్నారు. కాకినాడ రూరల్ జనసేన టిడిపి సంయుక్తంగా ఏర్పాటు చేసిన వనభోజనాల కార్యక్రమంలో ప్రేక్షకుల కోసం పెద్ద పెద్ద స్క్రీలను ఏర్పాటు చేశారు. ఫుడ్ కోర్టులు పెడుతున్నారు. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు టీం ఇండియా అభిమానులు ఇక్కడే ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు తీసుకున్నారు. చిన్నా పెద్ద ఆడ మగ తేడా లేకుండా క్రికెట్ చూసేందుకు ఇక్కడ వనభోజనాల్లో అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మాకు కాకుండా జిల్లా ప్రతినిధి నందిని అందిస్తారు.
Read Also..
Read Also..
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం కాపుల సంక్షేమన్ని పూర్తిగా అటకేక్కించింది అని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేసారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం లో 1.50 కోట్లతో ఆధునీకరించిన తెలగ కల్యాణ మండపం ను మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప తో కలసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే నిమ్మల మాట్లాడుతూ రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి వచ్చాక కాపు కార్పొరేషన్ కు కేటాయించ వలసిన నిధులు కేటాయించలేదని విదేశీ విద్యను పూర్తిగా అటకెక్కించారని వచ్చే టిడిపి జనసేన రావడం అధికారులకు వచ్చిన వెంటనే అభివృద్ధికి నిధులు కేటాయించడంతోపాటు కాపుల విదేశీ విద్య పునరుద్దిస్తామని ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి రాకముందు కాపు కార్పొరేషన్ కు సంవత్సరానికి రెండూవేల కోట్లు కేటాయిస్తానని ఒక్క రూపాయి విడుదల చేయలేదన్నారు. అలాగే ఐదు శాతం రిజర్వేషన్ జీవోను దుయ్యబట్టారు రానున్న టిడిపి జనసేన సంకీర్ణ ప్రభుత్వంలో కాపుల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తెలిపారు. మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ వెనుకబడిన కులాల వారికి ఇచ్చిన 10 శాతం రిజర్వేషన్ లో కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ టిడిపి ప్రభుత్వం జీవో విడుదల చేసిన వైసీపీ ప్రభుత్వం అమలు చేయలేదని కాపులు అందరూ రిజర్వేషన్ కోసం ఐక్యంగా పోరాడాలని కోరారు.
ఏపీలో అడ్డగోలుగా ఇసుక దోపిడీ జరుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం బురిలంక రేవు వద్ద ఇసుక తవ్వకాలను బీజేపీ, జనసేన నేతలతో కలిసి పురందేశ్వరి పరిశీలించారు. అనంతరం అక్కడి నర్సరీ రైతులు ఇసుక అక్రమాలను బీజేపీ, జనసేన నేతలకు వివరించారు. దశాబ్దాలుగా ఇలాంటి ఇసుక దందా చూడలేదని స్థానికులు తెలిపారు. ఈ సందర్భంగా ఏపీలో ఇసుక సరఫరా దోచుకో, దాచుకో అనే తీరుగా మారిందని పురందేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. జేపీ సంస్థ ముసుగులో ఇసుక దందా కొనసాగుతోందని విమర్శించారు. ఇసుక దందా సొమ్మంతా తాడేపల్లికి చేరుతోందని ధ్వజమెత్తారు. నదీ గర్భంలో యంత్రాలతో తవ్వకాలు చేపట్టవద్దని గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాలను వైసీపీ ప్రభుత్వం తుంగలో తొక్కిందని ఆరోపించారు. ఇక్కడ ఇసుక తవ్వకాలకు ఇచ్చిన అనుమతులు మే నెలతో పూర్తి అయ్యాయని, అయినా ఇష్టానుసార ఇసుక తవ్వకాలు కొనసాగుతున్నాయని పురందేశ్వరి మండిపడ్డారు.
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఆదేశాలు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా గుంతలమయం అయిన రోడ్లు గురించి డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా జగన్ ప్రభుత్వం వైఫల్యాన్ని ప్రజలకి తెలిసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి వినుత కోటా ఆధ్వర్యంలో జనసేన – టీడీపీ నాయకులు శ్రీకాళహస్తి పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీ, దక్షణ కైలాసగిరి కాలనీ, తొట్టంబేడు మండలం కొత్త కండ్రిగ గ్రామాల్లో పర్యటించి గుంతలమయం అయిన రోడ్డులో పడవలు వదిలి నిరసన వ్యక్తం చేశారు. గుంతల రోడ్ల చిత్రాలు , వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ఉంచారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ 4.5 సం.|| తట్టెడు మట్టి వెయ్యలేని ముఖ్యమంత్రి 3 రాజధానులు కడుతాడా , కొత్త రోడ్లు వెయ్యలేదు ,కనీసం గుంతలకి మట్టి కూడా వెయ్యలేని దయనీయ పరిస్థితిలో రాష్ట్రం ఉంది. గుంతలమయం అయిన రోడ్డు లో ప్రజల ప్రయాణం తీవ్ర ఇబ్బందిగా వాహన దారులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. 5 నెలల్లో ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడ్డాక అన్ని రోడ్లు బాగు చేసి, అవసరం అయిన దగ్గర కొత్త రోడ్లు వేస్తామని ప్రజలకి హామీ ఇచ్చారు.
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఆదేశాలు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా గుంతలమయం అయిన రోడ్లు గురించి డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా జగన్ ప్రభుత్వం వైఫల్యాన్ని ప్రజలకి తెలిసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి వినుత కోటా ఆధ్వర్యంలో జనసేన – టీడీపీ నాయకులు శ్రీకాళహస్తి పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీ, దక్షణ కైలాసగిరి కాలనీ, తొట్టంబేడు మండలం కొత్త కండ్రిగ గ్రామాల్లో పర్యటించి గుంతలమయం అయిన రోడ్డులో పడవలు వదిలి నిరసన వ్యక్తం చేశారు. గుంతల రోడ్ల చిత్రాలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 4.5 సం.|| తట్టెడు మట్టి వెయ్యలేని ముఖ్యమంత్రి 3 రాజధానులు కడుతాడా, కొత్త రోడ్లు వెయ్యలేదు, కనీసం గుంతలకి మట్టి కూడా వెయ్యలేని దయనీయ పరిస్థితిలో రాష్ట్రం ఉంది. గుంతలమయం అయిన రోడ్డు లో ప్రజల ప్రయాణం తీవ్ర ఇబ్బందిగా వాహన దారులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. 5 నెలల్లో ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడ్డాక అన్ని రోడ్లు బాగు చేసి, అవసరం అయిన దగ్గర కొత్త రోడ్లు వేస్తామని ప్రజలకి హామీ ఇచ్చారు.
శ్రీకాకుళం జిల్లా… ఇచ్ఛాపురం… నియోజకవర్గంలో రోడ్ల దుస్థితిపై టిడిపి జనసేన ఉమ్మడి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అద్వానంగా ఉన్న రాజపురం- కమలాయిపుట్టుగ రహదారి వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. రోడ్ల దుస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ అశోక్ మీడియాతో మాట్లాడారు. టిడిపి ప్రభుత్వ హాయంలో ఇచ్చాపురం నియోజకవర్గంలో సుమారు 85 కోట్ల రూపాయలతో రహదారుల నిర్మాణం చేశామని, వైసిపి ప్రభుత్వం రహదారుల దుస్థితిని గాలికి వదిలేసిందని అన్నారు. తమ ఉమ్మడి నిరసన కార్యక్రమాలను డిజిటల్ క్యాంపైనింగ్ ద్వారా మరింత విస్తృతంగా, ఉధృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. అధ్వానంగా ఉన్న రహదారులను వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదని జనసేన నాయకులు దాసరి రాజు అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి, జనసేన నేతలు పాల్గొన్నారు…
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 21 డివిజన్ లో ఉన్న రోడ్లపై మరమ్మత్తులు చేయాలని డిమాండ్ చేశారు నిత్యం రద్దీగా ఉండే బిఆర్టిఎస్ రోడ్ లోని పలుచోట్ల రోడ్లను మరమ్మత్తు చేయాలని డిమాండ్ చేశారు నిత్యం ఈ రోడ్లో ప్రయాణించే వాహనాలు రోడ్డు ప్రమాదాలు గురై ఎందరో ప్రజలు ప్రాణాలు బలి తీసుకుంటున్నారని తెలిపారు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే విష్ణు ఇప్పటికైనా కళ్ళు తెరిచి రోడ్లను మర మత్తులు చేసేంతవరకు మా పోరాటం ఆగదని తెలిపారు
ఈ కార్యక్రమంలో టిడిపి నుంచి రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు జనసేన నుంచి పోలిశెట్టి రవి సెంట్రల్ కోఆర్డినేటర్ తదితరులు పాల్గొన్నారు
వైసీపీ ప్రభుత్వ అరాచక, విధ్వంసక పాలన నుండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు విముక్తి కలిగించడమే తెలుగుదేశం జనసేన పార్టీల లక్ష్యమని కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు తెదేపా ఇంచార్జ్ వనమాడి కొండబాబు, జనసేన ఇంచార్జ్ ముత్తా శశిధర్ పేర్కొన్నారు. తెలుగుదేశం – జనసేన ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు గురువారం ముఖ్య నాయకులతో తెలుగుదేశం, జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలుగుదేశం జనసేన ఉమ్మడి ఎజెండా, పార్టీ కార్యక్రమాలు, ఓటర్ వెరిఫికేషన్ తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా వనమాడి కొండబాబు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం అరాచక పాలనపై పోరాటం చేస్తున్న చంద్రబాబు నాయుడు పై అక్రమ కేసులు బనాయించి జైల్ లో నిర్బంధించిన తరువాత పవన్ కళ్యాణ్ తో ములాఖత్ లో చంద్రబాబు ను కలిసి వైసిపి ప్రభుత్వం అరాచక పాలనపై తెలుగుదేశం జనసేన పార్టీలు కలిసి పోరాటం చేయడం జరుగుతుందని ప్రకటించారని, వైసీపీ ప్రభుత్వ అరాచక, అవినీతి, అసమర్ధత పాలనపై ఉమ్మడి కార్యచరణతో పోరాటం చేయడం జరుగుతుందని, దానిలో భాగంగా 17 వ తేదీ నుండి తెదేపా జనసేన కలిసి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ఈ నెల 18,19 తేదీలలో రాష్ట్రంలో అద్వానంగా తయారైన రోడ్లు దుస్థితిపై టీడీపీ, జనసేన ఉమ్మడిగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. కాకినాడ సిటీ నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ ముత్తా శశిధర్ మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల నుండి రాష్ట్ర ప్రజలకు విముక్తి కలిగించడమే లక్ష్యంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు టీడీపీ, జనసేన ఉమ్మడిగా ఎన్నికలకు వెళతామని ప్రకటించారని, నాటి నుండి టీడీపీ, జనసేన కలిసి సమన్వయoతో కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించడం జరిగిందని, ఆ విధంగా ఉమ్మడి ఎజెండాను ప్రజలలోకి తీసుకువెళ్లడం జరుగుతుందని, టీడీపీ, జనసేన నాయకులు కార్యకర్తలు సమన్వయoతో ఉమ్మడి కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
Read Also..





Total views : 90065