హైదరాబాద్ లోని పబ్బుల నిర్వాహకులు.. కాసుల సంపాదనే ధ్యేయంగా వ్యవహరిస్తున్నారు. తమ కస్టమర్ల నుంచి ఎలా డబ్బులు దండుకోవాలనే దానిపై ఉన్న ధ్యాస వారికి అందించే సేవలపై మాత్రం ఉండటం లేదు. పబ్బుల్లో అందించే ఆహార ఉత్పత్తులు కస్టమర్లను అనారోగ్యం పాలు చేస్తోంది. సరదా కోసం పబ్బులకు వెళ్లే వారు ఆసుపత్రుల పాలయ్యే పరిస్థితి నెలకొంటోంది. నిబంధనలు భేఖాతరు చేస్తూ నిర్వహిస్తున్న పబ్బులపై అధికారులు ఎన్ని దాడులు వారిలో మాత్రం మార్పు రావడం లేదు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని పలు పబ్బుల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. జూబ్లీహిల్స్ లోని డైలీ రిచువల్స్, హార్ట్ కప్ పబ్బుల్లోని వంట గదులకు వెళ్లిన ఫుడ్ సేఫ్టీ అధికారులు అక్కడి పరిస్థితులు చూసి అవాక్కయ్యారు. కిచెన్ రూంలో మొత్తం అపరిశుభ్రతతో పాటు బొద్దింకలను చూసి నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలం చెల్లిన ఆహార ఉత్పత్తులు సైతం అధికారులు గుర్తించారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్న డైలీ రిచువల్స్, హార్ట్ కప్ పబ్బులపై అధికారులు కేసులు నమోదు చేశారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్రెడ్డి.హైదరాబాద్ ఉప్పల్ భగాయత్లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన్కు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య సేవలను సీఎం రేవంత్రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చినా.. రోశయ్య మాత్రం తన ప్రత్యేకతను…
- ‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్కి థాంక్స్..‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్కి థాంక్స్.. యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్లో హీరో సూరి మంచి విజయాన్ని ఇచ్చిన ఆడియెన్స్కి థాంక్స్.. ‘మండాడి’ యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్లో హీరో సుహాస్ ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్…
- నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.ఏపీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పర్యటిస్తున్నారు. విజయవాడకు చేరుకున్న కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో వైద్య మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా కీలక కార్యక్రమాలకు నడ్డా…
- మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.బ్రిక్స్ ఇండియా 2026 సదస్సు నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం మధ్య కీలక ద్వైపాక్షిక భేటీ జరిగింది. న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో భారత్–మలేషియా సంబంధాలకు సంబంధించిన పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు.…
- ఏడేళ్ల తరువాత భారత్ కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ భారత్ పర్యటనకు రానున్నారు. గాల్వాన్ వ్యాలీ ఘటన తర్వాత తొలిసారిగా భారత్కు వస్తున్న జిన్పింగ్ పర్యటనపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకోనున్న జిన్పింగ్తో పాటు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి