రిగేషన్ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. హాజరైన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇరిగేషన్ అధికారులతో ముగిసిన సీఎం సమీక్ష. మేడిగడ్డపై పూర్తి వివరాలివ్వండి అంటూ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. కుంగిన మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని నీటిపారుదల శాఖ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆదివారం తన నివాసంలో నీటిపారుదల శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నీటిపారుదల రంగం పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో కొత్తగా నిర్మించిన ప్రాజెక్టుల ఖర్చులకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలన్నారు. ఇతర రాష్ట్రాలతో జల వివాదాలకు సంబంధించి కృష్ణా ట్రిబ్యునల్ వద్ద వినిపించాల్సిన వాదనలు, ముందు ముందు ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. యాసంగి పంటలకు నీళ్లిచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. నీటి లభ్యత, ఇతర అంశాలపై పలు సూచనలు చేశారు. అంతర్రాష్ట్ర జలవివాదాలను త్వరగా పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో చర్చించిన అంశాలకు సంబంధించి వీలైనంత త్వరగా పూర్తి వివరాలను అందించాలని అధికారులను ఆదేశించారు సీఎం. ఈ సమీక్షా సమావేశంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈఎన్ సీ మురళీధర్, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.
kaleshwaram medigadda bridge
మేడిగడ్డలో కుంగిన ప్రాంతాన్ని వేరుచేసి, నీటిని పూర్తిగా తొలగించిన… వైఫల్యానికి గల కారణాలను అధ్యయనం చేయనున్నట్లు డ్యాం సేఫ్టీ అథార్టీ తెలిపింది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వాన్ని సమాచారమివ్వాలని కోరినా తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదని జాతీయ డ్యాం సేఫ్టీ అథార్టీ పేర్కొంది. జాతీయ అథార్టీ, సీడబ్ల్యూసీ అధికారుల బృందం మళ్లీ పరిశీలించి.. వైఫల్యానికి దారి తీసిన కారణాలను మరింత లోతుగా తెలుసుకోవాల్సి ఉందని పేర్కొంది. నేషనల్ డ్యాం సేఫ్టీ అథార్టీ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం చేసిన పరిశీలనాంశాలను తప్పనిసరిగా తమకు పంపాల్సి ఉందని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర జల్శక్తి శాఖ ఆధ్వర్యంలోని జాతీయ అథార్టీ తెలంగాణ రాష్ట్ర డ్యాం సేఫ్టీ అథార్టీకి తాజాగా లేఖ రాసింది. మేడిగడ్డ బ్యారేజి కుంగడం, పియర్స్ దెబ్బతినడంతో జాతీయ అథార్టీ అధికారులు పరిశీలించి తమ అభిప్రాయాలతో గతంలోనే నివేదికను అందజేసిన సంగతి తెలిసిందే. ఇందులోని అంశాలతో నవంబరు ఒకటిన రాష్ట్ర నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి.. కేంద్ర జల్శక్తిశాఖ కార్యదర్శి లేఖ రాశారు. ఇందులో డిజైన్, నిర్మాణం, నిర్వహణ, నాణ్యతా లోపాలతో పాటు వైఫల్యానికి కారణాలను వివరంగా పేర్కొన్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి.. బ్యారేజి కుంగిపోవడానికి గల కారణాలను తెలుసుకోవడంలో సహకరించాల్సిందిపోయి నిందారోపణలు చేయడం తగదంటూ కేంద్రానికి సమాధానమిచ్చింది.





Total views : 62199