చిత్తూరు జిల్లా కాణిపాక స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానంలో నిర్వహించిన పాలకమండలి సమావేశంలో భక్తుల సౌకర్యాలు, 2026 వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేవస్థానం చైర్మన్ మణి నాయుడు, ఈవో పెంచల కిషోర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో బ్రహ్మోత్సవాల నిర్వహణ, అభివృద్ధి పనులు, టెండర్లపై విస్తృతంగా చర్చించారు. ప్రతి నెల జరిగే సంకష్టహర చతుర్థి బంగారు రథోత్సవ సేవ టికెట్ ధరను రూ.5 వేలుగా నిర్ణయిస్తూ బోర్డు ఆమోదం తెలిపింది. అలాగే భక్తులకు మోదక ప్రసాదం అందించే ప్రతిపాదనకూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. క్యూ లైన్లు, మాడ వీధుల్లో వేచి ఉండే భక్తులకు తాగునీటి సదుపాయాలు మెరుగుపర్చేందుకు కొత్త సిబ్బంది నియామకానికి అంగీకరించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా చేపట్టనున్న ఇంజినీరింగ్ పనుల టెండర్లకు కూడా పాలకమండలి ఆమోదం తెలిపింది.
Tag: