సినీ నటుడు నాగార్జున వేసిన పరువు నష్టం కేసులో తాను కోర్టుకు హాజరుకాలేకపోతున్నానని, మరో తేదీ ఇవ్వాలని తెలంగాణ మంత్రి కొండా సురేఖ కోర్టును కోరారు. దీంతో నాంపల్లి కోర్టు విచారణను వాయిదా వేసింది. తనపై చేసిన వ్యాఖ్యలకు గాను నాగార్జున మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం కేసు వేశారు. ఈ కేసులో మంత్రికి ఇదివరకే కోర్టు సమన్లు జారీ చేసింది. వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొంది. అయితే మంత్రిగా వివిధ కార్యక్రమాల కారణంగా సురేఖ విచారణకు హాజరు కాలేకపోతున్నారని ఆమె తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. మరో తేదీ ఇస్తే హాజరవుతారని కోర్టుకు తెలిపారు. దీంతో నాంపల్లి కోర్టు విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- అనంతపురం జిల్లాలో ఆర్ఎంపీ డాక్టర్ల దందా..ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆర్ ఎం పి డాక్టర్ల దందా మూడు పువ్వులు ఆరు కాయలు చందంగా తయారైంది . అత్యవసర వేళలో ప్రథమ చికిత్స చేసి ప్రాణాలు నిలబెట్టాల్సిన ఆర్ఎంపీ డాక్టర్లు ఏకంగా ఎంబిబిఎస్ డాక్టర్లతో సమానంగా తెలిసి తెలియని…
- అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులకు శ్రీకారం..రాజధాని అమరావతిలో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు.అమరావతిలో 21 ఎకరాల విస్తీర్ణంలో, సుమారు 750 కోట్ల వ్యయంతో 1000 పడకల సామర్థ్యంతో ఈ…
- ములుగు జిల్లాలో 100 రోజుల ఉపాధి హామీ పనులు..ములుగు జిల్లాలో 100 రోజుల ఉపాధి హామీ పనుల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. వెంకటాపూర్ మండలం కేశాపూర్ గ్రామ శివారులో కూలీలతో కలిసి స్వయంగా పని చేసి ఆకట్టుకున్నారు.వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని కూలీలు జాగ్రత్తలు పాటించాలని సూచించిన మంత్రి.. వారికి…
- ప్రణీత్ ప్రణవ్ గ్రూప్పార్క్పై పోరాటానికి సిద్ధమవుతున్న స్థానికులు..హైదరాబాద్ శివారు గాగిల్లాపూర్లో ఉన్న ప్రణీత్ గ్రూవ్ పార్క్ అక్రమాలపై స్థానికులు పోరాటానికి సిద్ధమవుతున్నారు. రియల్ ఎస్టేట్ సంస్థ చెరబట్టిన ఉస్మాన్ కుంట గతంలో తమకు ప్రధాన నీటి వనరుగా ఉండేదని.. పక్కనే ఉన్న గడ్డపోతారం ప్రజలు చెబుతున్నారు. తమ చిన్నతనంలో…
- యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో స్వాతి నక్షత్రం వేడుకలు..యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట టెంపుల్లో స్వాతి నక్షత్రం సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారికి అష్టోత్తర శతఘటాభిషేకాన్ని ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా 108 కలశాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి వాటిలోని పవిత్ర జలాలకు పూజలు చేశారు.పంచామృతం,…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 61930