ప్రకాశం, యర్రగొండపాలెంలో ఓ కేసు విషయమై మోజేశ్ అనే యువకున్ని పొలీస్ స్టేషన్ కి తరలించి కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు. కౌన్సెలింగ్ ఇచ్చారనే అవమానంతో యర్రగొండపాలెం పోలీసు స్టేషన్ లో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నం చేసిన మోజేశ్ అనే యువకుడు. మంటలు అర్పిన పోలీసులు గాయపడ్డ యువకుడు మోజేశ్ ను మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం మార్కాపురంలోని ఓబుల్ రెడ్డి ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. ఆత్మహత్య యత్నం చేసుకున్న యువకుడి బంధువులు యర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ ను ముట్టడించారు. రోడ్లపై టైర్లు కాల్చి ధర్నా చేస్తున్న యువకుడి బంధువులు, యర్రగొండపాలెం లో ఉద్రిక్త వాతావరణం….
Latest Video News
పామర్రు (మ) శ్యామలపురం, కంచర్లవానిపురం గ్రామాల్లో పనల పై వున్నా వరి పనలను పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ పరిశీలించారు. మొవ్వ (మ) అయ్యంకి గ్రామంలో జాయింట్ కలెక్టర్ అపరంజిత సింగ్ తో నీట మునిగిన వరి పొలాలను ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ పరిశీలించారు. .పంట చేతికి వచ్చే టైం లో తుఫాన్ రావడం దురదృష్టం. రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటుంది. రైతులు నష్టపోకుండా ప్రతి ధాన్యం కొనుగోలుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. మిషన్తో కోసిన ధాన్యమంతా మిల్లులకు చేరిపోయింది. సబ్సిడీపై మినుము విత్తనాలు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రతిపక్షాలు దీని రాజకీయం చేయవద్దని మీడియా ద్వారా కోరుతున్నాను. జాయింట్ కలెక్టర్ అపరంజిత సింగ్ మాట్లాడుతూ ప్రజలకు నష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ధాన్యాన్ని కైకలూరు, గుంటూరు, పల్నాడు పంపించాం మేజర్, మైనర్ డ్రైన్స్ మరమ్మతు పనులు యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నాం. రైతులకు నష్టం జరగకూడదు అనేది ముఖ్యమంత్రి రెడ్డి ఆలోచన.
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పీవోకే పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లోక్ సభలో కీలక ప్రకటన చేశారు. పీవోకే మనదే అన్నారు. భారత్లో అంతర్భాగమైన పీవోకేకు 24 అసెంబ్లీ సీట్లు రిజర్వ్ చేసినట్లు స్పష్టం చేశారు. రెండు నయా కాశ్మీర్ బిల్లులను కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో ప్రవేశపెట్టింది. జమ్ముకశ్మీర్ రిజర్వేషన్- సవరణ బిల్లు 2023, జమ్ముకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ- సవరణ బిల్లు 2023లను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. కశ్మీర్లో హక్కులు కోల్పోయిన కశ్మీరీ పండిట్లకు ఈ బిల్లుల ద్వారా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కశ్మీర్లో గతంలో 46 సీట్లు ఉండగా ఆ సంఖ్యను 47కు పెంచామని, అలాగే జమ్ములో గతంలో 37 సీట్లు ఉండగా ఆ సంఖ్యను 43కు పెంచామని తెలిపారు. పీవోకే కూడా మనదేనని, అందుకే ఆ ప్రాంతానికి 24 సీట్లు రిజర్వ్ చేశామన్నారు. భారత తొలి ప్రధాని జనహర్ లాల్ నెహ్రూ చేసిన రెండు పొరపాట్ల కారణంగా జమ్ముకశ్మీర్ దశాబ్దాలుగా బాధపడుతోందని వ్యాఖ్యానించారు. ముందుగా కాల్పుల విరమణ ప్రకటించి, ఆ తర్వాత కశ్మీర్ సమస్యను ఐక్య రాజ్య సమితికి తీసుకెళ్లారని చెప్పారు. ఇది తన తప్పేనని నెహ్రూ చెప్పారని గుర్తు చేశారు. కానీ మన దేశం చాలా భూమిని కోల్పోవడం పెద్ద తప్పు అన్నారు. నెహ్రూపై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. వారు లోక్ సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం జమ్ముకశ్మీర్ రిజర్వేషన్- సవరణ బిల్లు 2023, జమ్ము, కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు 2023 లోక్ సభలో ఆమోదం పొందాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన రైతులను యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం ఆదుకుంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ మేరుగ నాగార్జున తెలిపారు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు, ఈదురు గాలులకు నేలమట్టమయిన లంక ప్రాంతాలలోని వాణిజ్య పంటలు పసుపు ,కంది, అరటి నీట మునిగాయని, ఆరుగాలం పండించిన పంట చేతికి వచ్చే సమయానికి ఇలా ప్రకృతి వైపరీత్యాలు జరగటం చాలా బాధాకరమన్నారు. రైతులకు తీరని లోటుని మంత్రి నాగార్జున ఆవేదన వ్యక్తపరిచారు. గత తెలుగుదేశం ప్రభుత్వం మాదిరిగా మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాటలతో సరిపెట్టబోదని,అధికారులు రూపొందించిన నివేదిక ప్రకారం నష్టపరిహారం అందిస్తామని ఆయన తెలిపారు.
తుఫాను ప్రభావానికి బాపట్ల జిల్లాలో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. భట్టిప్రోలు మండలంలో పర్యటించిన ఆయన పంట పొలాలను,జగనన్న కాలనీలను పరిశీలించారు. తుఫాను వస్తుందని తెలిసి కూడా సరైన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలం అయ్యిందని ఆరోపించారు. వర్షపు నీరు పోయేందుకు డ్రైనేజీ కాలువలు సరిగా లేకపోవడంతో నీటిలోనే… పంట నాని ఎక్కువ నష్టం వాటిల్లే పరిస్థితి ఉందని అన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వలనే రైతులకు ఎక్కువ నష్టం జరుగుతోందన్నారు. నష్ట పోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని సిఎం జగన్ అన్ని చర్యలు తీసుకున్నాం అనడం సరికాదనీ క్షేత్ర స్థాయిలోకి వచ్చి రైతుల పరిస్తితి తెలుసుకోవాలన్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చెయ్యాలని డిమాండ్ చేశారు. మరోవైపు వర్షపు నీటిని జగన్న కాలనీలు అధ్వానంగా మారి నడిచేందుకు కూడా ఇబ్బంది కరంగా మారాయన్నారు. సరైన సౌకర్యాలు లేక కాలనీల్లో ఉంటున్న పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.తుఫాను ప్రభావంతో వాణిజ్య పంటలు దెబ్బతిని లంక గ్రామాల రైతులు ఆందోళన చెందుతున్నారు.అరటి తోటలు గాలుల ప్రభావానికి నేల వాలయి ..కంద,పసుపు పంటలు వర్షపు నీటితో నాని రైతులకు నష్టం వాటిల్లింది.చేతికి వచ్చిన పంటలు దెబ్బతిని నష్టాన్ని మిగిల్చాయి అని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు
విశాఖ మిథిలాపురి కాలనీలో యథేచ్ఛగా అక్రమ కట్టడాల నిర్మాణాలు జరుగుతున్నాయి.. రెవెన్యూ లేఔట్ లో అర్దరాత్రి అక్రమ గ్రావెల్ తవ్వకాలు చేస్తున్నారు. పరదాల చాటున భారీ అక్రమ నిర్మాణం జరుపుతున్నారు. gvmc అధికారులు అక్రమ నిర్మాణానికి కొమ్ముకాస్తున్నారు. Gvmc జోన్ 2 లో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ గ్రావెల్ తవ్వకాలు సాగిస్తున్నారు.. ఇంత జరుగుతున్న టౌన్ ప్లానింగ్ విభాగం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుంది. అక్రమ గ్రావెల్ తవ్వకాలతో సమీప భవనాలు కూలిపోతున్నాయి. ఇంత జరుగుతున్నా చోద్యం చూస్తున్న ACP శాస్త్రి కాసులకు కక్కుర్తిపడి అడ్డగోలుగా తవ్వకాలకు సహకరిస్తున్నాడు. ఈ తతంగంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తుఫాను కారణంగా నిరాశ్యులైన వారికి ప్రభుత్వం సాయం అందిస్తున్నదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ మేరుగు నాగార్జున అన్నారు. బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం ఐలవరం గ్రామంలోని తుఫాన్ ప్రభావంతో నిరాశ్యులైన పలువురికి నిత్యవసరకులు, 25 కిలోల బియ్యాన్ని జిల్లా కలెక్టర్ రంజిత్ భాష మరియు మంత్రివర్యులు బాధితులకు అందించారు. ఈ సందర్భంగా మంత్రి నాగార్జున మాట్లాడుతూ తుఫాను ప్రభావంతో అధికారులను అప్రమత్తం చేసి ప్రాణ నష్టం వాటిల్లకుండా ప్రభుత్వం తగు జాగ్రత్తలు చేపట్టిందని మంత్రి నాగార్జున తెలిపారు. ప్రతిపక్ష నాయకుడు ప్రజలకు మేలు చేయాల్సింది మరిచి ఇలాంటి టైంలో రాజకీయాలు మాట్లాడటం సవాబ్ కాదు మీకు చేతనైంది మీరు చేయండి అనే ఆనందబాబుకు సవాళ్లు విసిరారు. మీ ముఖ్యమంత్రి వ్యవసాయం దండగ అన్నారు. అదే మన ముఖ్యమంత్రి వ్యవసాయం పండగానే నినాదంతో ప్రతి రైతుకు సాయం చేసె గుణం మా ముఖ్యమంత్రి ది ప్రతి రైతుకు రైతు భరోసా కౌల రైతులకు భరోసా ఇన్పుట్ సబ్సిడీ పంట రాష్ట్ర పరిహారం రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు పంపిణీ ఎల్లవేళలా అందుబాటులో ఉండి వ్యవసాయ సలహాలు ఇస్తున్న వ్యవసాయ సిబ్బంది ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసే ప్రభుత్వం మాది మాట్లాడే ముందు మీరు ఏం చేశారు అనేది తెలుసుకోండి. ఇప్పుడు చేతనైతే సహాయం చేయండి. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే రాజకీయం చేద్దాం ఇప్పుడు ప్రజలకు మేలు చేద్దాం చేతనైతే మేలు చేయండి అని ఆనంద్ బాబుకు ఇతవు పలికారు.
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో భారత్ గ్యాస్ కార్యాలయం ఎదుట మహిళలు బారులు తీరారు..ఈ కేవైసీ ఆధార్ అనుసంధానం చేసుకునేందుకు వినియోగదారులు పెద్ద ఎత్తున కార్యాలయం ముందు బారులు తీరారు. ఈ కేవైసీకి గడువు ఉంది. కాని తెలంగాణలో ప్రభుత్వం మారడంతో గ్యాస్ సిలిండర్ 500 కే ఇస్తాము అని ప్రకటించడంతో పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళలు తమ ఆధార్ ను అనుసంధానం చేసుకుంటూన్నారు.
పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం పట్టణంలోని మిషన్ హై స్కూల్ రోడ్లో ఎదురు ఎదురుగా వస్తున్న రెండు మోటార్ సైకిల్ ఢీకొన్న సంఘటన లో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుని నరసాపురం మండలం చిట్టవరం గ్రామానికి చెందిన పోల హేమంత్ (20)గుర్తించారు. తీవ్రంగా గాయపడిన వారిలో సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ తిరుమల రాజు ఉన్నారు వీరి ముగ్గురిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పశ్చిమగోదావరి మిచౌoగ్ తుఫాన్ కారణంగా 15 వేల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని, నష్టపోయిన ప్రతి రైతుని ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర సివిల్ సప్లై శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలంలో ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరు ప్రసాదరాజు తో కలిసి నష్టపోయిన పంట పొలాలను పరిశీలించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే ధాన్యాన్ని కొనుగోలు చెయ్యమని మిల్లర్ల ను ఆదేశించామన్నారు . ఎక్కడైనా మిల్లర్లు ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని , రైతుల నుంచి చివరి గింజ కొనుగోలు చేసే వరకు బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి మాట్లాడుతూ రైతులకు గోనే సంచులను కూడా ప్రభుత్వమే సరఫరా చేస్తుందన్నారు





Total views : 62340