ములుగు జిల్లా, మంత్రి సీతక్క మాట్లాడుతూ, ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతరను జయప్రదం చేస్తామని సీతక్క అన్నారు , ఫిబ్రవరి 21 నుండి జాతర ప్రారంభం అవుతుంది. ఇప్పటికే 75 కోట్ల నిధులు సీఎం రేవంత్ రెడ్డి మంజూరు చేశారు. రేవంత్ రెడ్డి పాదయాత్ర సైతం మేడారం దేవతల సన్నిధి నుండే ప్రారంభించారు. అడగ్గానే నిధులు కేటాయించారు. అవసరమైన మేరకు మరిన్ని నిధులు ప్రభుత్వాన్ని కోరుతాం. మా ఇంటి ఇలవేల్పు మేడారం తల్లులు. అధికారులకు అన్ని సూచనలు చేశాం. జాతర విజయవంతం కోసం ప్రణాళిక రూపొందించాం. కాంట్రాక్ట్ పనులను అవినీతి లేకుండా పూర్తి చేస్తాం. శాశ్వత ప్రాతిపదికన చేస్తాం. కేంద్రానికి కొన్ని పనులకోసం ప్రతిపాదనలు పంపాము. మేడారం జాతరకు జాతీయ హోదా కోసం రిక్వెస్ట్ పంపుతున్నాము. అందరూ సహకరించి జాతరను విజయవంతం చేయాలి అని ఆమె కోరారు.
Tag:





Total views : 147205