పిఠాపురం వీరవాడ రోడ్ బ్రాహ్మణ అగ్రహారం వద్ద జరుగుతున్న లక్ష్మీ గణపతి హోమం కార్యక్రమానికి నాగేంద్రబాబు (Nagababu) హాజరయ్యారు. తన తమ్ముడు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి ఎన్నికైన వెంటనే ఈ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తారని ఆయన హామీ ఇచ్చారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రభుత్వం ఆధీనంలో ఉండడంతో హిందువుల సొమ్ములు వక్రమార్గం పడుతున్నాయన్నారు. వక్స్ బోర్డ్ గాని క్రిస్టియన్ మిషనరీలు గాని ప్రభుత్వం ఆధీనంలో లేవన్నారు. కేవలం హిందూ దేవుళ్ళ గుళ్ళు మాత్రమే ప్రభుత్వం పెత్తనం చెలాయించడం తాను వ్యక్తిగతంగా వ్యతిరేకిస్తున్నానని అన్నారు. 90 శాతం హిందువులకే గుళ్ళు, గోపురాల పై ఆజామాసి ఉండాలి, కేవలం 10 శాతం మాత్రమే ప్రభుత్వం దీని మీద అబ్జర్వేషన్ చేయాలన్నారు. ప్రస్తుతం బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న పరిస్థితులను అంబేద్కర్ ఉండి ఉంటే కచ్చితంగా రిజర్వేషన్ ఇచ్చే వారురన్నారు. కూటమి పార్టీ జనసేన అధికారంలోకి రాగానే ఇలాంటి సమస్యలు లేకుండా చేస్తామని భరోసా ఇచ్చారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 17 మెట్రో స్టేషన్లను ఉదయం ఏడున్నర నుంచి మూసివేత.ఢిల్లీ మెట్రో ప్రయాణికులకు డీఎంఆర్సీ కీలక ప్రకటన చేసింది. ఇవాళ ఉదయం 7:30 గంటల నుంచి సెంట్రల్ ఢిల్లీ పరిధిలోని 17 ప్రధాన మెట్రో స్టేషన్లలో ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను తాత్కాలికంగా మూసివేసినట్లు వెల్లడించింది. అయితే రాజీవ్ చౌక్, మండీ హౌస్,…
- నీట్ పేపర్ లీక్పై సుప్రీంకోర్టులో విచారణ.నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పరీక్షల నిర్వహణలో చేపట్టిన సంస్కరణలు, సాధించిన పురోగతిపై సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రంతో పాటు NTAలను ఆదేశించింది సుప్రీంకోర్టు. కేవలం తాత్కాలిక చర్యలతో సరిపెట్టకుండా, పరీక్షా వ్యవస్థలో శాశ్వత ప్రాతిపదికన…
- నెల్లూరు : వెంకటాచలం మండలం పల్లె వీక్షణలో ఎమ్మెల్యే సోమిరెడ్డి.నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో నిర్వహించిన పల్లె వీక్షణ కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ శుక్లతో కలిసి గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే… ప్రజలకు అందుతున్న సేవలు,…