నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా నారా భువనేశ్వరి కృష్ణా జిల్లాలో పర్యటించారు. ఆవనిగడ్డ నియోజకవర్గం ఘంటసాల మండలం తాడేపల్లి గ్రామంలో భువనేశ్వరి పర్యటించారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ వార్త విని బాధతో మరణించిన కొడాలి సుధాకర్ రావు కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. సుధాకర్ రావు చిత్రపటానికి నివాళులర్పించారు భువనేశ్వరి. చంద్రబాబు భరోసా పత్రాన్ని బాధిత కుటుంబానికి అందజేశారు. ఎన్టీ రామారావు పేద ప్రజల కోసం చేసినట్లే… చంద్రబాబు కూడా పేద ప్రజల అభివృద్ధి కోసం పాటుపడుతున్నారని అన్నారు. చంద్రబాబు విజన్ 20-20 అన్నప్పుడు కొందరు విమర్శించారని, కానీ ఇప్పుడు ఆయన కట్టిన ఐటి కంపెనీలు లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నాయని అన్నారు. ఐటి శాఖ మంత్రిగా లోకేష్ ఉన్నప్పుడు అనేక కంపెనీలు తీసుకువచ్చాడని, కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే బాధ కలుగుతోందని భువనేశ్వరి తెలిపారు.
Tag:
Nara Bhubaneswari
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడలో శ్రీమల్లికార్జున సమేత కామాక్షితాయి అమ్మవారిని నారా భువనేశ్వరి దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్ పుట్టా సుబ్రహ్మణ్యం నాయుడు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. ప్రత్యేక పూజలను నిర్వహించి శేష వస్త్రంతో సత్కరించారు. కామాక్షితాయి ఆశీస్సులతో తిరిగి టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని భువనేశ్వరి ఆశాభావం వ్యక్తం చేసారు.





Total views : 196514