తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో 2024సాధారణ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిడదవోలు నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా రాజమహేంద్రవరం పార్లమెంట్ జనసేన తెలుగుదేశం బిజెపి పార్టీల ఉమ్మడి ఎంపీ అభ్యర్థి దగ్గుపాటి పురందేశ్వరి (Purandeshwari) ఈరోజు విజ్జేశ్వరం గ్రామం నుండి ప్రచారాన్ని ప్రారంభించారు..ఆమెతోపాటు నిడదవోలు నియోజకవర్గ ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి కందుల దుర్గేష్, నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి బూరుగుపల్లి శేషారావులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
విజ్జేశ్వరం నుండి మొదలైన ఈ రోడ్ షోకి విశేష స్పందన లభించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా విజ్జేశ్వరం, గోపవరం, పురుషోత్తపల్లి, సమిశ్రగూడెం డి. ముప్పవరం, కలవచర్ల, మునిపల్లి, పెండ్యాల గ్రామాలలో తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రచారంలో భాగంగా మహిళలు అడుగడుగునా మంగళ హారతులు పట్టారు. ఈ సందర్భంగా రాజమండ్రి పార్లమెంటరీ అభ్యర్థి దగ్గుపాటి పురందేశ్వరి మాట్లాడుతూ.. కమలం గుర్తుపై ఓటు వేసి తనను ఎంపీ అభ్యర్థిగా గెలిపించాలని అదే విధంగా గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి కందుల దుర్గేషను నిడదవోలు ఎమ్మెల్యేగా గెలిపించాలని అభ్యర్థించారు. ఉమ్మడి పార్టీల కలయికతోనే ఈ రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని పురందేశ్వరి అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి, భారతీయ జనతా పార్టీ, మరియు జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు జరిగింది.సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు జరిగింది. ఈ సందర్భంగా సీఎం వారికి పలు అంశాలపై లక్ష్యాలను నిర్దేశించారు. సంక్షేమ, అభివృద్ధిపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలని ఆదేశించారు. ప్రభుత్వ పథకాల పట్ల ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. అధికారులు-ప్రజాప్రతినిధుల…
- కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో కూటమి పార్టీల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి.కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో కూటమి పార్టీల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. కోడూరు మండల కేంద్రంలోని ఎస్పీ కాలనీలో రహదారి శంకుస్థాపన సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షుడు బండే శ్రీనివాసరావు, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వివాదం…
- తిరుపతి నగరంలోని ఎయిర్ బైపాస్ రోడ్లో ఉన్న డి మార్ట్ స్టోర్పై తక్షణ చర్యలుతిరుపతి నగరంలోని ఎయిర్ బైపాస్ రోడ్లో ఉన్న డి మార్ట్ స్టోర్పై తక్షణ చర్యలు తీసుకోవాలని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు, నేషనల్ షెడ్యూల్డ్ క్యాస్ట్ వెల్ఫేర్ కౌన్సిల్ సభ్యుడు మించల ప్రదీప్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు…