పెద్దపెల్లి జిల్లా మంథని మండల కేంద్రంలోని మాత శిశు ఆరోగ్య కేంద్రంలో ప్రసవించిన బాలింతలకు హాస్పిటల్ ఫుడ్ మేనేజ్మెంట్ గత వారం రోజుల నుండి ఉడకని గుడ్లు పాలు పాలలాగా కాకుండా నీళ్లలాగా ఇస్తున్నారని పేషెంట్స్ వాళ్ల కుటుంబీకులు చెప్తున్నారు. అదే విధంగా నిన్న ఈ రోజు ఉదయం ఉప్మా విషయంలో పేపర్లు అతికించే లైవ్ లాగా ఉందని, అది తిన్న చిన్నపిల్లలు వాంటింగ్ చేసుకున్నారని అన్నారు. మంథనిలో ఇంత మంచి హాస్పిటల్ ఉన్నప్పటికీ ఫుడ్ విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నందుకు చాలా ఆవేదన చెందుతున్నామని అన్నారు. సదర్ కాంట్రాక్టర్ ను ఇదే మిటని అడిగితే నేను గత 11 నెలల నుండి పెడుతున్నానని ఇప్పటి వరకు నన్ను అడిగిన వాళ్లే లేరని చెప్పుకుంటూ వెళ్లిపోతున్నారని చెప్పారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ విషయంలో పేషంట్లకు మంచి ఫుడ్ ను అందించే విధంగా ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నారు.
pedda palli district news
పెద్దపల్లి జిల్లా మంథని పట్టణ కేంద్రంలో మంగళవారం రోజు సెట్ బ్యాక్ క్రమబద్దీకరణ లో భాగంగా జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ ఆధ్వర్యంలో నిబంధనలు అతిక్రమించి జరిగిన అక్రమ కట్టడాలను కూల్చివేశారు. పట్టణ కేంద్రంలో 5 కట్టడాలపై ఫిర్యాదులు అందాయని అందులో 2 కట్టడాలను సీజ్ చేసినట్లు, మిగిలిన 3 కట్టడాలను పాక్షికంగా కూల్చి, ఇంటి యజమానులకు నోటీసులు ఇచ్చినట్లు డిటీఎఫ్ టీం లీడర్ గిరి మీడియాకు తెలిపారు.
ఇదే క్రమంలో మంథని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున స్వామి మాట్లాడుతూ.. పట్టణంలో మున్సిపల్ నిబంధనలను అతిక్రమించి జరిగిన నిర్మాణాలపై చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. అలాగే జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ లో రెవెన్యూ శాఖ, ఆర్ అండ్ బి శాఖ, మున్సిపాలిటీ, అగ్నిమాపక శాఖ, పోలీసు శాఖ కలిపి డిటిఎఫ్ టీం గా కలిసి పని చేయనున్నాయి అని అధికారులు తెలిపారు. నిర్మాణాల కూల్చివేత సమయంలో కొంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడినా కూడా అధికారులు, పోలీసులు కలిసి కట్టుదిట్టంగా విధి నిర్వహించారు.




Total views : 79573