పోలీస్ అమరవీరుల దినోత్సవ వారోత్సవాలలో భాగంగా ఏ.ఆర్.గ్రౌండ్స్ లో ఓపెన్ హౌస్ కార్యక్రమం జరిగింది.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా నగర పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా పాల్గొన్నారు. ఈ ప్రదర్శనలో భాగంగా పోలీస్, అగ్నిమాపక మరియు NDRF కి సంబంధించిన పరికరాలను ప్రదర్శించారు. ప్రదర్శన లో భాగంగా ఏర్పాటు చేసిన పోలీస్ జాగిలాలు, రైఫిల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఈ కార్యక్రమంలో వందల సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు పాలోన్నారు. ఈ ఓపెన్ హౌస్ కార్యక్రమం రెండు రోజులపాటు కొనసాగుతుందని విజయవాడ సిటీ కమిషనర్ కాంతి రానా తెలిపారు.
Police
హెచ్సీఏలో నిధులు గోల్మాల్ కేసులో హెచ్సీఏ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్ కోర్టుని ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోరుతూ మల్కాజ్గిరి కోర్టులో ఈ మేరకు పిటిషన్ వేశారు. నిధుల అవకతవకల వ్యవహారం వెలుగుచూశాక ఉప్పల్ పోలీసులు మొత్తం నాలుగు కేసులు నమోదు చేశారు. అప్పటి నుంచి అజారుద్దీన్ అజ్ఞాతంలోకి వెళ్లారు. అయితే తాజాగా కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్పై నవంబర్ 1న విచారణ జరగనుంది. ఇదిలావుండగా టెండర్ల పేరుతో నిధులను థర్డ్ పార్టీకి కట్టబెట్టారని తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. అన్ని విషయాలను పరీలించిన తర్వాత జస్టిస్ లావ్ నాగేశ్వర్రావు కమిటీ నాలుగు కేసులు నమోదు చేసింది. 2020 -2023 మధ్య నిధులు గోల్మాల్ చేశారని రిపోర్ట్ పేర్కొంది. క్రికెట్ బాల్స్ కొనుగోలులో ఒక్కో బంతిని 392 రూపాయలకు బదులు 1400 రూపాయలు వర్క్ ఆర్డర్ చేసినట్లు గుర్తించారు. బాల్స్ కొనుగోలులె 57 లక్షలు నష్, జిమ్ పరికరాల పేరిట 1.53 కోట్లు, బకెట్ చైర్స్ కొనుగోలులో 43 లక్షలు. ఫైర్ ఫైటింగ్ పరికరాల పేరిట 1.50 కోట్ల మేర హెచ్సీఏకి నష్టం వచ్చేలా చేశారని రిపోర్ట్ పేర్కొంది.
ఈ నెల 25న ఏసీబీ కోర్టు జడ్జికి రాసిన మూడు పేజీల లేఖలో చంద్రబాబు పలు అంశాలు ప్రస్తావించారు. రాజమండ్రి జైల్లో ఈ మధ్య కాలంలో చోటు చేసుకున్న పలు లోపాలు. జడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న తన ప్రాణాలకు ముప్పుగా పరిణమించినట్లు చంద్రబాబు తెలిపారు. సెప్టంబర్ 10న తనను అరెస్టు చేసి 11న రాజమండ్రి జైలుకు రిమాండ్ కు పంపారని, జైల్లోకి తాను ప్రవేశిస్తున్న సమయంలో తనను ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారని ఆరోపించారు. తద్వారా తన ప్రతిష్టను మంటగలిపారని, అలాగే తన భద్రతకు ముప్పు కలిగించారని చంద్రబాబు తెలిపారు. అలాగే తనను హతమార్చేందుకు ఓ వామపక్ష తీవ్రవాద సంస్ధ కుట్ర పన్నిందని, ఇందుకోసం భారీగా డబ్బు కూడా చేతులు మారినట్లు, ఈ మేరకు జైలు సూపరింటెండెంట్ కు ఓ లేఖ కూడా అందినట్లు తనకు తెలిసిందని చంద్రబాబు వెల్లడించారు. దీనిపై పోలీసులు అధికారులు ఇప్పటివరకూ స్పందించలేదని, ఆ లేఖపై ఎలాంటి విచారణ కూడా జరపలేదన్నారు. అలాగే ఎన్డీపీఎస్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఓ వ్యక్తి పెన్ కెమెరాతో జైల్లో సంచరిస్తూ తోటి ఖైదీల ఫొటోలు తీస్తున్నాడనని తనకు తెలిసిందన్నారు. అలాగే రాజమండ్రి జైలుపై ఓ డ్రోన్ కెమెరా సంచరిస్తూ తమ ఫొటోలు, వీడియోలు తీస్తోందని, అయినా జైలు అధికారులు కానీ, పోలీసులు కానీ దాన్ని అడ్డుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. జైల్లో గంజాయి ప్యాకెట్లు వస్తున్నాయని, అక్కడ మొత్తం 2200 మంది ఖైదీలుంటే అందులో 750 మంది తీవ్ర ఆరోపణలు ఉన్నవారు ఉన్నారని, ఇవన్నీ తన భద్రతకు ముప్పుగా మారాయన్నారు. ఈ నెల ఆరో తేదీన తనను కలిసి వెళ్తున్న కుటుంబ సభ్యుల్ని మరో డ్రోన్ కెమెరా షూట్ చేసిందని, దీన్ని బట్టి చూస్తుంటే తనతో పాటు కుటుంబానికి కూడా ముప్పు ఉందన్నారు. రాష్ట్రంలో గత నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో పలు చోట్ల తిరిగిన తనపై అధికార పార్టీ ప్రోద్భలంలో దాడులు జరిగాయన్నారు. జగన్ అధికారంలోకి రాగానే తన భద్రతను తగ్గించారని, హైకోర్టు జోక్యంతో తిరిగి పునరుద్ధరించారన్నారు. 2019 ఆగస్టులో అమరావతిలో బస్సు యాత్ర చేపడితే వైసీపీ కార్యకర్తలు రాళ్ల దాడులకు పాల్పడ్డారన్నారు. అలాగే ఈ ఏడాది ప్రాజెక్టుల వద్దకు తాను వెళ్లినప్పుడు కూడా వైసీపీ కార్యకర్తలు దాడులు చేశారన్నారు. ఈ పరిణామాల్ని అన్నింటిని దృష్టిలో ఉంచుకుని రాజమండ్రి జైల్లో తనకు పూర్తిస్దాయిలో భద్రత కల్పించాలని చంద్రబాబు జడ్జిని కోరారు.
అనంతపురం జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినం ఘనంగా జరిగింది. అమరుల త్యాగాలు, ఆశయాలను స్పూర్తిగా చేసుకుని విధుల్లో పునరంకితమవుదాం అని అనంతపురం రేంజ్ .ఐ.జి RN అమ్మిరెడ్డి , జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ పోలీసులకు సంయుక్తంగా పిలుపునిచ్చారు. జిల్లా ప్రశాంతత, ప్రజల భద్రతే లక్ష్యంగా పోలీసుల విధులు నిర్వర్తించాలని వారు కోరారు.
సమాజం కోసం ప్రాణ త్యాగం చేసిన పోలీసుల సేవ మరువలేనిదని మంచిర్యాల్ డిసిపి సుదీర్ కొకైన్ అన్నారు. మంచిర్యాల్ జిల్లా మందమర్రి పోలీస్ స్టేషన్ ఆవరణ లో ఆమరవీరుల స్థూపం వద్ద సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా పోలీస్ అమరవీరులకు డిసిపి సుదీర్ కొకైన్, బెల్లంపల్లి ఏసీపీ సదయ్య నివాళులర్పించారు. అనంతరం పోలీస్ గౌరవ వందనం చేశారు. డీసీపీ మాట్లాడుతూ.. ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారంటే అది పోలీసులే కృషేనని అన్నారు. మావోయిస్టులు, సంఘ విద్రోహులతో పోరాడుతూ పోలీసు సిబ్బంది తమ ప్రాణాలను త్యాగం చేస్తున్నారని అన్నారు. సమాజం కోసం ప్రాణ త్యాగం చేసినవారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.