హైదరాబాద్, డిసెంబర్ 14న రాష్ట్ర సమాచార, రెవిన్యూ, గృహనిర్మాణ శాఖా మంత్రిగా పొంగులేటి శ్రీనివాస రెడ్డి నేడు డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య భాద్యతలు స్వీకరించారు. ఈ పదవీ స్వీకార కార్యక్రమానికి మంత్రి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రిని ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, వేముల వీరేశం, ఆదినారాయణ, బాలు నాయక్, ఆది శ్రీనివాస్, యశస్వినీ రెడ్డి తోపాటు పలువురు సీనియర్ నాయకులు రేణుకా చౌదరి, రామసహాయం సురేందర్ రెడ్డి, రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, ఆర్ అండ్ బీ కార్యదర్శి శ్రీనివాస రాజు, సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనర్ కె. అశోక్ రెడ్డి, సమాచార శాఖ డైరెక్టర్ రాజమౌళి, అడిషనల్ డైరెక్టర్ నాగయ్య, జేడీ లు జగన్, శ్రీనివాస్, వెంకట రమణ, డీడీ లు మధు సూధన్, హాష్మి, రాజా రెడ్డి, సీఐఈ రాధా కిషన్, వివిధ శాఖల ఉన్నతాధికారులు మంత్రిని కలసి శుభాకాంక్షలు తెలిపారు. భువనగిరిలో స్పోర్ట్ కాంప్లెక్స్ కు 10 ఎకరాల భూమి భువనగిరి జిల్లా రాయగిరి లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి పది ఎకరాల భూమిని కేటాయిస్తూ తన మొదటి ఫెయిల్ పై మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సంతకం చేశారు. రూ. 9.50 కోట్ల విలువ గల ఈ పదెకరాల స్థలాన్ని మల్టి పర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి చేపట్టేందుకు యువజన, క్రీడల శాఖకు కేటాయించారు. రాష్ట్రంలోని 33 జిల్లాల డీపిఆర్ఓ లకు అధునాతన కెమెరాలు అందచేసే సమాచార, పౌర సంబంధాల శాఖ కు చెందిన ఫైల్ పై మంత్రి పొంగులేటి సంతకం చేశారు. గృహ నిర్మాణ శాఖ కు చెందిన పలు పరిపాలనా సంబంధిత ఫైళ్ల పై సంతకం చేశారు.
political
తెలంగాణ నూతన అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ఎన్నికయ్యారు. స్పీకర్ పదవి కోసం మరెవరూ నామినేషన్ వేయకపోవడంతో గడ్డం ప్రసాద్ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. స్పీకర్ గా గడ్డం ప్రసాద్ బాధ్యతలను స్వీకరించాలని అక్బరుద్దీన్ కోరారు. ప్రొటెం స్పీకర్ ఆహ్వానం మేరకు స్పీకర్ గా గడ్డం ప్రసాద్ బాధ్యతలను స్వీకరించారు. అనంతరం గడ్డం ప్రసాద్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, కేటీఆర్ తదితరులు తోడ్కొని వచ్చి స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టారు. ఆ తర్వాత సభలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయన ఛైర్ వద్దకు వెళ్లి అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర మూడవ శాసనసభ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బాధ్యతలను స్వీకరించారు.
గడ్డం ప్రసాద్ రాజకీయ ప్రస్థానం 2008లో ప్రారంభమయింది. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఓడించిన ఘనత గడ్డం ప్రసాద్ కావడం గమనార్హం. తెలంగాణ ఉద్యమం సమయంలో ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇప్పటి వరకు ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2008 ఉపఎన్నిక, 2009లో ఆయన వరుసగా రెండు సార్లు వికారాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009 ఎన్నికల్లో వికారాబాద్ నుంచి కేసీఆర్ పోటీ చేశారు. ఆ ఎన్నికలో కేసీఆర్ పై గడ్డం ప్రసాద్ దాదాపు 5 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత 2014, 2018లో వికారాబాద్ నుంచే ఓటమిపాలయ్యారు. వరుసగా రెండు సార్లు ఓటమిపాలయినప్పటికీ ఆయన వికారాబాద్ నియోజకవర్గాన్ని వీడలేదు. ఇప్పుడు మళ్లీ వికారాబాద్ నుంచే గెలుపొంది, అత్యున్నతమైన అసెంబ్లీ స్పీకర్ పదవిని చేపట్టారు. గడ్డం ప్రసాద్ కు భార్య శైలజ, ఇద్దరు సంతానం ఉన్నారు.
ప్రకాశం జిల్లా.. పెద్దారవీడు మండలం గొబ్బురు-తోకపల్లి హైవే పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బోలేరో వావానం , బైక్ డీ కొని తండ్రి, కుమారుడు, అక్కడక్కడే ఇద్దరు మృతి చెందగా.. మరో మహిళ పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం108 సహాయంతో ఆసుపత్రికి తరలించారు. కురిచేడు మండలం నాయుడు పల్లి పంచాయతీ సంఘం గ్రామానికి చెందినవారుగా గుర్తింపు, స్వగ్రామం నుండి మార్కాపురం వచ్చి గ్రామంకు తిరిగి వెళ్లే సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఫోన్ మాట్లాడుతూ బైక్ నడపడం కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మార్కాపురం ప్రభుత్వ జిల్లా వైద్యశాలకు తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Read Also….
Read Also….
జగన్ మోహన్ రెడ్డి మాటలమాత్రం కోటదాటుతున్నాయి. చేతలు మాత్రం గడప దాటడం లేదని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు. ఘంటసాల మండలం పూషడంలో మొలకెత్తిన వరి పంటను బుద్ధప్రసాద్, జనసేన జిల్లా ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు పరిశీలించి రైతుల ఆవేదన విన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రైతులకు అపార నష్టం కలిగిందని, ఈ ప్రభుత్వం బీమనది ఛానల్ మురుగు డ్రైనేజీలో తూటికాడ, గుర్రపుడెక్క సకాలంలో తొలగించలేదన్నారు. ఫలితంగా ఈ గ్రామంలో 600 ఎకరాల్లో వరి పంట దారుణంగా మొలకలు వచ్చి పంట దేనికి పనికిరాకుండా పోయిందన్నారు. బీమనది డ్రైనేజీకి రూ.12లక్షలు నిధులు కేటాయించినా పనులు జరగలేదన్నారు. తుఫాన్ ముందు సకాలంలో స్పందించి ముంపు నివారణకు చర్యలు తీసుకుంటే అపార నష్టం తగ్గేదన్నారు. ఈ ప్రాంత రైతులకు కలిగిన నష్టానికి ప్రకృతి కారణం కాదని, పాలకుల నిర్లక్ష్యమే ఈ నష్టానికి కారణమన్నారు. ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు నియోజకవర్గంలో ఒకట్రేండు డ్రైనేజీల దగ్గర ఫోటోలు దిగి మొత్తం పరిష్కారం చేసినట్లు ప్రచారం చేసుకున్నారని, కాని ఆయనకు పూషడం గ్రామ రైతుల సమస్యలు ఎమ్మెల్యేకు పట్టవా అని ప్రశ్నించారు. డ్రైనేజీ శాఖ అధికారులు ఎమ్మెల్యే చెప్పిన పనులే చేస్తారా? ఎక్కడ డ్రైనేజీ సమస్య ఉందో గుర్తించి సమస్య పరిష్కారం చేయాల్సిన బాధ్యత అధికారులపై లేదా? అని ప్రశ్నించారు. డ్రైనేజీ పనులు తీసుకున్న కాంట్రాక్టరుతో పనులు చేయించాల్సిన బాధ్యత ఎమ్మెల్యేకు లేదా అని ప్రశ్నించారు. నియోజకవర్గంలో అత్యధిక నష్టం కలిగిందన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి రైతులను నట్టింట ముంచేశారన్నారు. తక్షణమే సీఎం జగన్ రైతులకు ఏ సహాయం చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. అసలు పంటల బీమా ఈ ఏడాది రైతులకు వర్తిస్తుందా లేదా ప్రకటించాలని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వంలో రైతులకు బీమా పరిహారం దక్కిన దాఖలాలు లేవన్నారు. కృష్ణాజిల్లా కలెక్టర్ ఇప్పటివరకు మిచౌంగ్ పంట నష్టం పరిశీలించలేదన్నారు. ఇప్పటికైనా కలెక్టర్ పంట నష్టం పరిశీలించాలని, ఈ పూషడం గ్రామ రైతులను పరామర్శించి, ప్రభుత్వ సహాయంపై స్పష్టత ఇచ్చి ఆదుకుంటామనే భరోసా ఇవ్వాలని కోరారు. తక్షణమే రైతులకు తదుపరి పంటకు ఇన్ పుట్స్ మొత్తం ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. పది ఎకరాలు సాగు చేసిన కౌలు రైతు గల్లా వెంకటేశ్వరరావు, 16 ఎకరాలు సాగు చేసిన పీ.సాంబశివరావు, ఏడెకరాలు సాగు చేసిన అంకం నాంచారయ్య తమ ఆవేదన వ్యక్తం చేశారు. తమ పంట పూర్తిగా నాశనం అయిపోయిందని కోత కోసినా ప్రయోజనం లేదన్నారు. వరి పంట మొత్తం దున్నేసుకుంటామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, జనసేన నాయకులు, జనసేన సర్పంచులు, రైతులు పాల్గొన్నారు.
కడప జిల్లా.. రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడి కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ, సిఐటియు ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు తహసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియాన్ల నాయకులు మాట్లాడుతూ.. అంగన్వాడి కార్యకర్తలకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం 26 వేలు వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోవడం వల్లే అంగన్వాడి కేంద్రాలను మూసివేసి ఈరోజు రోడ్డుపైకి వచ్చామని దీనికి కారణం ప్రభుత్వమేనని చెప్పారు. 30 ఏళ్లుగా అంగన్వాడీ కార్యకర్తలుగా పనులు చేస్తున్నామని కేవలం 11 వేల రూపాయల జీతంతో ఎలా మా కుటుంబాలు పోషించుకోవాలని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం కంటే వెయ్యి రూపాయలు అదనంగా వేతనం ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్టోర్ డీలర్లు పౌష్టికాహారాన్ని అంగన్వాడీ కేంద్రాల వద్ద దించకుండా వీధుల వెంట పరిగెత్తిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. అంగన్వాడీలు చేస్తున్న ఆందోళనకు ప్రజా సంఘాలు మద్దతు తెలిపారు.
అన్నమయ్య జిల్లా.. రాయచోటి.. ఎడవ వేతన కమిటిలో అమలు కాని అంశములపై తఫాల శాఖ ఉన్నత అధికారులు చర్చల పేరుతో కాలయాపన చేస్తున్నందుకు నిరసనగా జిడీఎస్, పిజేసిఎ కేంద్ర సంఘాల పిలుపు మేరకు అన్నమయ్య జిల్లా రాయచోటి తఫాల శాఖ కార్యాలయం వద్ద గ్రామీణ తఫాల శాఖ ఉద్యోగులు నిరవధిక సమ్మెను చేపట్టడం జరిగింది. ఈ సమ్మె ప్రదానంగా ఎనిమిది డిమాండ్లతో సమ్మెను కొనసాగిస్తున్నారు. ప్రధానమైన డిమాండ్లు సివిల్ సర్వెంట్ హోదా వెంటనే కల్పించి 8 గంటల పని భారం ఉండేలా అమలు చేయాలన్నారు. 12, 24, 36 అదనపు సర్వీసెస్ ఇంక్రిమెంట్లు మంజూరు తో పాటు గ్రూప్ ఇన్సూరెన్స్ ఐదు లక్షలకు పెంచి రిటైర్మెంట్ గ్రాడ్యువిటీ 5 లక్షలకు పెంచాలన్నారు. కుటుంబ సభ్యులతో సహా వైద్య సౌకర్యం కల్పించాలి. కమలేష్ చంద్ర కమిటీ సిఫార్సు చేసిన ప్రతి అంశాన్ని అమలు చేయాలి. జిడిఎస్ కాంట్రిబ్యూషన్ 10 శాతం, డిపార్ట్మెంట్లో 10% కాంట్రిబ్యూషన్ ను అందజేయలన్నారు. తాత్కాలిక పెన్షన్ సదుపాయం కల్పించి, రెగ్యులర్లు సెలవులు పెట్టినప్పుడు వర్క్ లోడ్ తో సంబంధం లేకుండా అదనపు వ్యక్తిని నియమించుకునే విదంగా అనుమంతిన్చాలన్నారు. ఇన్సెంటివ్ కమిషన్ పద్ధతి రద్దు చేసి మరి అన్ని రకాల ఐపిపిబి, ఆర్ పి ఎల్ ఐ, పి ఎల్ ఐ,యాన్ ఆర్ ఈ జి ఎస్, సేవింగ్స్ ను పనిభారంలోని తీసుకోవాలన్నారు. ఏడవ వేతన కమిటీలు అమలుకాని అన్ని అంశాలను వెంటనే అమలు చేయాలి, టార్గెట్స్ మేళా రూపంలో జిడిఎస్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న అన్ని రకాల వేధింపులను నిలుపుదల చెయ్యాలని వారు ఈ సందర్బంగా డిమాండ్ చేశారు. ఈ సమ్మెలో బిపిఎం, ఏబిపిఎం లు సద్దాం, ఇస్మాయిల్ జమిలుల్లా, రామ మోహన్ రెడ్డి, వెంకటరమణ తదితరులు హాజరయ్యారు.
Read Also…
Read Also…
పార్లమెంట్ సమావేశాల వేళ లోక్ సభలో కలకలం రేగింది. లోక్ సభలోకి ఇద్దరు ఆగంతకులు చొరబడ్డారు. సభలో టియర్ గ్యాస్ వదిలి భయాందోళనలను సృష్టించారు. ఈ గందరగోళంతో ఎంపీలు భయపడి పరుగులు తీశారు. కొందరు ఎంపీలు వారిని పట్టుకుని భద్రతా సిబ్బందికి అప్పగించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. లోక్ సభ సెక్యూరిటీ వైఫల్యం వల్లే దుండగులు లోపలికి ప్రవేశించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విజిటర్స్ గ్యాలరీ నుంచి సభ్యుల మధ్యలోకి దూకి ముందుకు దూసుకెళ్లడం వీడియోలో కనిపిస్తోంది. కాగా, 2001 లో ఇదే రోజు పార్లమెంట్ పై దాడి జరిగింది. ఈ దాడికి నేటితో 22 ఏళ్లు పూర్తయ్యాయి. సరిగ్గా ఇదే రోజు ఆగంతుకులు లోక్ సభలో చొరబడడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Read Also..
Read Also..
రాష్ట్రంలో అంగన్వాడీల పరిస్థితి దయనీయంగా మారిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు ఆవేదన వ్యక్తం చేశాడు. జీతాలు పెంచక, సంక్షేమంలోనూ కోత పెట్టి జగన్ సర్కారు అంగన్వాడీలపై కక్ష సాధింపు ధోరణిలో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఒక్క చాన్స్ ఇస్తే తెలంగాణ కంటే ఎక్కువ జీతాలు ఇస్తానంటూ అంగన్వాడీలకు ఇచ్చిన హామీని వైఎస్ జగన్ బుట్టదాఖలు చేశారని విమర్శించారు. తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేస్తున్న అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లను ప్రభుత్వం బెదిరింపులకు గురిచేస్తోందని ఆరోపించారు. నిరసనలు చేస్తే ఉద్యోగంలో నుంచి తొలగిస్తానని బెదిరించడం జగన్ అధికార దుర్వినియోగానికి నిదర్శనమని చెప్పారు. పొరుగు రాష్ట్రంతో సమానంగా జీతాలిస్తామని హామీ ఇచ్చి ఐదేళ్లు కావొస్తున్నా ఇప్పటికీ అంగన్వాడీల జీతాలు ఎందుకు పెంచలేదని అచ్చెన్నాయుడు ప్రభుత్వాన్ని నిలదీశారు. అరకొర జీతంతో అంగన్వాడీలు బతికేదెలా రాజన్న పాలన అంటే ఇదేనా? అంటూ ప్రశ్నించారు.
Read Also..
Read Also..
హైదరాబాద్ సీపీగా కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు అయిన తరువాత శ్రీనివాస్రెడ్డికి ప్రాధాన్యత గల పోస్టింగ్ మొదటి సారి వచ్చింది. గతంలో గ్రే హౌండ్స్ , అక్టోఫస్లో ఆయన పనిచేశారు. నూతన సీపీ కొత్త కోట శ్రీనివాస్ రెడ్డికి ముక్కుసూటి అధికారి అన్న పేరుంది. కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీపీ శ్రీనివాస్రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ మహా నగరం లో డ్రగ్స్, జూదం నిర్మూలిస్తామన్నారు. ప్రజలు, ప్రభుత్వానికి వారధిగా మీడియా ఉంటోందని కితాబునిచ్చారు. ప్రజాభిప్రాయాన్ని మీడియా ద్వారా తెలియజేయాలని కోరుతున్నానని తెలిపారు. మెట్రో పాలిటీన్ సిటిలో మూడు అంశాలపై అప్రమత్తంగా ఉండాలని సీపీ కోరారు. తెలంగాణా స్టేట్తో పాటు హైదరాబాద్ను డ్రగ్ ఫ్రీ సిటీగా తీర్చి దిద్దాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్లు సీపీ వివరించారు. హైదరాబాద్, తెలంగాణాను డ్రగ్స్ ముఠాలు వదిలి వెళ్లాలని లేకపోతే ఉక్కుపాదం మోపుతామని డ్రగ్స్ ముఠాలను ఆయన హెచ్చరించారు. సినీ ఇండస్ట్రీలో కూడా డ్రగ్స్ సేవిస్తున్నట్లు గుర్తించామన్నారు.
Read Also..
Read Also..
ఏపీలో ధర్మ పరిరక్షణే ప్రధాన అజెండాగా ఎన్నికలకు వెళ్తున్నట్లు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. దగాపడ్డ ఆంధ్రప్రదేశ్ తిరిగి కోలుకునేలా చేస్తామన్నారు. పరిపాలనలో మార్పు కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చేశారన్నారు. తమిళనాడులోని పెరంబదూర్లో రామానుజర్ దేవాలయాన్ని ఆయన దర్శించుకున్నారు. ప్రత్యేక విమానంలో అక్కడకు చేరుకున్న చంద్రబాబుకు తమిళనాడులోని తెలుగు ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్లలో జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకు సమర్థ నాయకత్వాన్ని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలు తన కోసం కాదని, 5కోట్ల మంది ప్రజానీకం కోసమన్నారు. తెలుగువారి బాగు కోసమే తాను కృషి చేస్తామని స్పష్టం చేశారు. 11వ శతాబ్దంలోనే వినూత్న ఆలోచనలకు రామానుజర్ దేవాలయం శ్రీకారం చుట్టిందన్నారు. రామానుజర్ ఆశయాలు నేటి తరానికి తెలిసేలా చిన్నజీయర్ స్వామి హైదరాబాద్లో ఆధ్యాత్మిక కేంద్రం నెలకొల్పటం శుభపరిణామని తెలిపారు.




Total views : 54787