Thursday, September 10, 2026
News Navigation
Thursday, September 10, 2026
News Navigation

Breaking

Thursday, September 10, 2026
Home Andhra PradeshChittoor తపాలా శాఖ కార్యాలయం వద్ద నిరసన సెగ..

తపాలా శాఖ కార్యాలయం వద్ద నిరసన సెగ..

by Rama
post Office

అన్నమయ్య జిల్లా.. రాయచోటి.. ఎడవ వేతన కమిటిలో అమలు కాని అంశములపై తఫాల శాఖ ఉన్నత అధికారులు చర్చల పేరుతో కాలయాపన చేస్తున్నందుకు నిరసనగా జిడీఎస్, పిజేసిఎ కేంద్ర సంఘాల పిలుపు మేరకు అన్నమయ్య జిల్లా రాయచోటి తఫాల శాఖ కార్యాలయం వద్ద గ్రామీణ తఫాల శాఖ ఉద్యోగులు నిరవధిక సమ్మెను చేపట్టడం జరిగింది. ఈ సమ్మె ప్రదానంగా ఎనిమిది డిమాండ్లతో సమ్మెను కొనసాగిస్తున్నారు. ప్రధానమైన డిమాండ్లు సివిల్ సర్వెంట్ హోదా వెంటనే కల్పించి 8 గంటల పని భారం ఉండేలా అమలు చేయాలన్నారు. 12, 24, 36 అదనపు సర్వీసెస్ ఇంక్రిమెంట్లు మంజూరు తో పాటు గ్రూప్ ఇన్సూరెన్స్ ఐదు లక్షలకు పెంచి రిటైర్మెంట్ గ్రాడ్యువిటీ 5 లక్షలకు పెంచాలన్నారు. కుటుంబ సభ్యులతో సహా వైద్య సౌకర్యం కల్పించాలి. కమలేష్ చంద్ర కమిటీ సిఫార్సు చేసిన ప్రతి అంశాన్ని అమలు చేయాలి. జిడిఎస్ కాంట్రిబ్యూషన్ 10 శాతం, డిపార్ట్మెంట్లో 10% కాంట్రిబ్యూషన్ ను అందజేయలన్నారు. తాత్కాలిక పెన్షన్ సదుపాయం కల్పించి, రెగ్యులర్లు సెలవులు పెట్టినప్పుడు వర్క్ లోడ్ తో సంబంధం లేకుండా అదనపు వ్యక్తిని నియమించుకునే విదంగా అనుమంతిన్చాలన్నారు. ఇన్సెంటివ్ కమిషన్ పద్ధతి రద్దు చేసి మరి అన్ని రకాల ఐపిపిబి, ఆర్ పి ఎల్ ఐ, పి ఎల్ ఐ,యాన్ ఆర్ ఈ జి ఎస్, సేవింగ్స్ ను పనిభారంలోని తీసుకోవాలన్నారు. ఏడవ వేతన కమిటీలు అమలుకాని అన్ని అంశాలను వెంటనే అమలు చేయాలి, టార్గెట్స్ మేళా రూపంలో జిడిఎస్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న అన్ని రకాల వేధింపులను నిలుపుదల చెయ్యాలని వారు ఈ సందర్బంగా డిమాండ్ చేశారు. ఈ సమ్మెలో బిపిఎం, ఏబిపిఎం లు సద్దాం, ఇస్మాయిల్ జమిలుల్లా, రామ మోహన్ రెడ్డి, వెంకటరమణ తదితరులు హాజరయ్యారు.

Read Also…

Read Also…

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: