ప్రముఖ వివాదాస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మ పెట్టిన కేసుపై సిఐడి విచారణ. గుంటూరు సీఐడీ కార్యాలయంలో విచారణ చేపట్టనున్న అధికారులు. రామ్ గోపాల్ వర్మ పెట్టిన (క్రైమ్ నంబర్ 22/2023) కేసులో A6 గా ఉన్న రాష్ట్ర తెలుగుయువత ఉపాధ్యక్షులు షేక్ ఫిరోజ్ కు 17వ తేదీన అర్ధరాత్రి సమయంలో గుంటూరులో సిఐడి పోలీసులు నోటీసులు జారీ చేసారు. A5 గా ఉన్న తిరువూరుకు చెందిన బండి శివకేశవ తో పాటు షేక్ ఫిరోజ్ ను ఈ నెల 19న ఉదయం గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి హాజరు కావాలని నోటిసులలో పేర్కొన్నారు. హాజరు కానీ పక్షములో అదుపులోకి తీసుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు.
Tag:
Ram Gopal Varma
రాంగోపాల్వర్మ దర్శకత్వంలో రూపొందించిన ‘వ్యూహం’ సినిమా విడుదలకు తెలంగాణ హైకోర్టు బ్రేక్ వేసింది. ఈ సినిమాకు కేంద్ర సెన్సార్ బోర్డు జారీ చేసిన సర్టిఫికెట్ను జనవరి 11 వరకు సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆ సర్టిఫికెట్ ఆధారంగా చిత్రాన్ని విడుదల చేయరాదంటూ రామదూత క్రియేషన్స్, నిర్మాత దాసరి కిరణ్కుమార్లకు ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్పై విచారణను జనవరి 11కు వాయిదా వేసింది. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ప్రతిష్ఠను దెబ్బతీసేలా రూపొందించిన ఈ సినిమా ప్రదర్శనకు కేంద్ర సెన్సార్ బోర్డు అనుమతించడాన్ని సవాలు చేస్తూ, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ సూరేపల్లి నంద విచారణ చేపట్టారు. న్యాయమూర్తి దృష్టికి తీసుకువచ్చారు.
Read Also..
Read Also..





Total views : 78083