పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల పవిత్రను కాపాడడానికి టీటీడీ అధికారులు రోజు రోజుకి ఆంక్షలు విదిస్తూనే ఉంది . కానీ కొంతమంది మాత్రం సోషల్ మీడియా పిచ్చితో తిరుమల పవిత్రతకు ఆటకం కలిగిస్తున్నారు. తిరుమల ఆలయం ముందు వివాదాస్పద వ్యాఖ్యలు, రాజకీయ ప్రసంగాలు.. ఫోటోషూట్లు, రీల్స్ షూట్లు జరుగుతూనే ఉన్నాయి. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో సినిమా పాటలకు డాన్సులు వేస్తూ వీడియోలు తీసుకుంటున్నారు. వాటిని రీల్స్ రూపంలో సోషల్ మీడియా లో పెడుతున్నారు. తిరుమల పవిత్రతకు భంగం కలిగిస్తున్నారు. ఈ మధ్యనే బిగ్ బాస్ ప్రియాంక, శివ చేసిన వీడియో కలకలం రేపింది. ఆ తర్వాత సారీ చెప్పే పరిస్థితి ఏర్పడింది. అంతకుముందు దివ్వల మాధురి ఫొటోషూట్.. మైన్స్ వ్యాపారి ఫోటోషూట్ వ్యవహారం కూడా వివాదాస్పదంగా మారింది. నాలుగు రోజుల క్రితం తిరుమల ఘాట్ రోడ్లో సెల్ఫీలు, ఫోటోలు వీడియోలు కోసం కొందరు యువకులు కారు డోర్లు తీసి హంగామా చేయడం కూడా భక్తులను ఇబ్బందులకు గురి చేసింది. ఇప్పుడు తిరుమలలో రీల్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అలిపిరి టోల్ గేట్, తిరుమల ఆలయం ముందు, సినిమా పాటలకు ఎంజాయ్ చేసిన యూత్ సోషల్ మీడియాలో పెట్టడం వలన వివాదాస్పదంగా మారింది వ్యవహారం .
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- చీరాలలో చెత్త నుంచి సంపద లక్ష్యం గాలిలోకేనా?ప్రకాశం జిల్లా చీరాల మున్సిపాలిటీలో “చెత్త నుంచి సంపద” సృష్టించాలనే ప్రభుత్వ లక్ష్యం నేడు ప్రశ్నార్థకంగా మారిందనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఒకప్పుడు పారిశుధ్యంలో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన చీరాల పట్టణం… ఇప్పుడు చెత్త నిర్వహణలోనే తీవ్ర వైఫల్యాలకు నిలయంగా మారిందని…
- హ్యాపీ బర్త్ డే విజయ్ దేవరకొండ..స్టార్ గా, పర్సన్ గా విజయ్ దేవరకొండ జర్నీ ఎప్పుడూ ప్రత్యేకమే. ఒక్కొక్కటిగా ఆయన అనౌన్స్ చేస్తున్న భారీ పాన్ ఇండియా సినిమాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. హీరో కొత్త సినిమా ఆయన గత సినిమా సాధించిన బాక్సాఫీస్ కలెక్షన్స్ మీద, ఆ…
- ప్రేమ ఎక్కడ పుడుతుందో ఎవరూ చెప్పలేరు..ప్రేమ ఎక్కడ పుడుతుందో ఎవరూ చెప్పలేరు. కానీ ఈ ప్రేమకథ వింటే మీరు ముక్కున వేలేసుకోవాల్సిందే..! సాధారణంగా పోలీసులు అంటే నేరస్తులకు భయం.. జైలర్ అంటే ఖైదీలకు వణుకు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. చట్టాన్ని కాపాడాల్సిన ఒక జైలు…
- విశాఖ కైలాసగిరిపై సరికొత్త అట్రాక్షన్..పర్యాటక కేంద్రమైన విశాఖపట్నంలోని కైలాసగిరిపై మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. పర్యాటకులను విశేషంగా ఆకర్షించేందుకు VMRDA సుమారు రూ.2.5 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ‘త్రిశూల్ ప్రాజెక్టు’ అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేసిన 65 అడుగుల భారీ…
- యాదాద్రిలో హాట్ టాపిక్ గా ప్రభుత్వ భూముల వివాదం..యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రభుత్వ భూముల వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఆలేరు నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ భూములను అక్రమంగా ఆక్రమిస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలు అధికార పార్టీకే కాకుండా స్థానిక అధికార యంత్రాంగానికీ సవాలుగా మారాయి.…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 70900