తిరుపతి, ఆర్డీవో సుజనా, మున్సిపల్ కమిషనర్ కే ఎల్ ఎన్ రెడ్డిఆధ్వర్యంలో పుత్తూరు పట్టణంలో ఓటు హక్కు పై అవగాహన, ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నగిరి ఆర్డీవో సృజన పాల్గొన్నారు.అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. కుల, మత, లింగ, జాతి, భాష, అనే బేధం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాల నిండిన పౌరులందరికీ ఓటు వేసే బాధ్యత, హక్కు,భారత రాజ్యాంగం ఆర్టికల్ 320 ద్వారా కల్పిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
right to vote
వయోజనులంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కోరారు. తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ చురుకుగా సాగుతోందన్నారు. హైదరాబాద్ జూబిలీ హిల్స్ లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. వికలాంగులకు ప్రత్యేక వసతులు కల్పించినట్లు శాంతికుమారి వివరించారు. శాంతిభద్రతల విషయంలో రాజీ పడేది లేదన్నారు.
హైదరాబాద్ లోని నందినగర్ లో మంత్రి కేటీఆర్ దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ ఒక బాధ్యత గల పౌరుడిగా తాను ఓటు హక్కును వినియోగించుకుని తన బాధ్యతను నిర్వహించానని చెప్పారు. అభివృద్ధి కోసం పాటు పడే పార్టీకి, ఒక మంచి నాయకుడికి ఓటు వేశానని చెప్పారు. అందరూ కూడా బయటకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలు ఓటు వేయడానికి బయటకు రావాలని కోరారు. నగర ప్రజలు బయటకు వచ్చి నచ్చిన నాయకుడికి, నచ్చిన పార్టీకి ఓటు వేయాలని చెప్పారు. హైదరాబాద్ ప్రజలు ఓటింగ్ కు దూరంగా ఉండటం మంచిది కాదని అన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యత గల పౌరుడిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. గత ఎన్నికల్లో హైదరాబాద్ లో అత్యంత తక్కువగా కేవలం 50 శాతం ఓటింగ్ మాత్రమే జరిగిన సంగతి తెలిసిందే.





Total views : 147292